ఇరాన్​ ఈ ఒక్క పని చేస్తే చాలు- ఇండియాలో పెట్రోల్​, డీజిల్​ ధరలు అమాంతం పెరిగిపోతాయి!-strait of hormuz petrol diesel prices in india can increase if iran does this ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఇరాన్​ ఈ ఒక్క పని చేస్తే చాలు- ఇండియాలో పెట్రోల్​, డీజిల్​ ధరలు అమాంతం పెరిగిపోతాయి!

ఇరాన్​ ఈ ఒక్క పని చేస్తే చాలు- ఇండియాలో పెట్రోల్​, డీజిల్​ ధరలు అమాంతం పెరిగిపోతాయి!

HT Telugu

సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్‌ సహా ఒపెక్ సభ్య దేశాలు ఆసియాకు ముడి చమురును ఎగుమతి చేయడానికి స్ట్రైట్​ ఆఫ్​ హార్ముజ్​జలసంధిని ఉపయోగిస్తాయి. దీనిని అడ్డుకుంటే, చమురు సరఫరా నిలిచిపోతుంది!

స్ట్రైట్​ ఆఫ్​ హార్ముజ్​లో ఓ ఓడ (Reuters File Photo)

ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతల మధ్య ముడి చమురు ధర పెరుగుతుందని ఆందోళనలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇంధనాన్ని భారీ మొత్తంలో దిగుమతి చేసుకునే భారత్​లో పెట్రోల్​, డీజిల్​ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్​ ఒక్క పని చేస్తే చాలు.. ప్రపంచానికి చమురు సప్లై భారీగా పడిపోవచ్చు. ధరలు అమాంతం పెరిగిపోవచ్చు. ఆ ఒక్కటి.. హార్ముజ్ జలసంధిని(స్ట్రైట్​ ఆఫ్​ హర్ముజ్​) మూసివేయండి! ఈ స్ట్రైట్​ ఆఫ్​ హర్ముజ్​ ఎందుకు అంత కీలకమైనదో ఇక్కడ తెలుసుకోండి..

ఇరాన్- ఒమన్ మధ్యలో స్ట్రైట్​ ఆఫ్​ హర్ముజ్​..

స్ట్రైట్​ ఆఫ్​ హర్ముజ్​ ఇరాన్- ఒమన్ మధ్య ఉంది. ఇది ఉత్తరాన ఉన్న గల్ఫ్‌ను దక్షిణాన ఉన్న ఒమన్ గల్ఫ్‌తో, ఆపైన అరేబియా సముద్రంతో కలుపుతుంది. సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్‌లతో పాటు చమురు ఎగుమతి చేసే దేశాలు (ఒపెక్​) సభ్యులు ఆసియాకు ముడి చమురును ఎగుమతి చేయడానికి దీనిని ఉపయోగిస్తాయి.

అయితే, సౌదీ అరేబియా, యూఏఈ ఈ జలసంధిని తప్పించుకోవడానికి ఇతర మార్గాలను కనుగొన్నాయి. కానీ ఇది మూసివేస్తే గణనీయమైన ప్రభావం కచ్చితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ చమురు వినియోగానికి ప్రధాన కేంద్రం..

యూఎస్​ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 20 శాతం ఈ స్ట్రైట్​ ఆఫ్​ హర్ముజ్​ ద్వారానే వెళుతుంది. ఇది "ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చమురు రవాణా చెక్‌పాయింట్," అని పేర్కొంది.

33 కిలోమీటర్ల వెడల్పు..

ఈ జలసంధి దాని ఇరుకైన ప్రదేశంలో 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. షిప్పింగ్ లేన్ ప్రతి దిశలో కేవలం మూడు కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. యూఎస్​ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, జలమార్గంలోని షిప్పింగ్ లేన్‌లు మరింత ఇరుకైనవిగా ఉంటాయి. దీనివల్ల అవి దాడులకు గురవుతుంటాయి.

జలసంధిని అడ్డుకుంటే చమురు ధరలు పెరుగుతాయి..

జలసంధిని అడ్డుకుంటామని ఇరాన్​ అనేక సంవత్సరాలుగా బెదిరిస్తోంది. కానీ ఆ బెదిరింపును ఎప్పుడూ అమలు చేయలేదు!

కానీ ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన మార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోవాలని నిర్ణయించుకుంటే, ప్రపంచ చమురు ధరలు మరింత పెరగవచ్చు.

2024లో, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్ట్రైట్​ ఆఫ్​ హర్ముజ్​కి సమీపంలో ఇజ్రాయెల్‌కు సంబంధించిన కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకుంది. 'ఎంఎస్​సీ ఏరీస్' అనే ఈ ఇజ్రాయెల్‌కు చెందిన కార్గో నౌకలో 17 మంది భారతీయులు ఉన్నారన్నది గమనార్హం.

మరి ఇరాన్​ తన బెదిరింపులను నిజం చేస్తుందా? లేక ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతలు శాంతిస్తాయా అన్నది చూడాలి.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.