Stock market today : భారీ నష్టాల్లో సూచీలు.. నిఫ్టీ 165 పాయింట్లు డౌన్
Stock market today : దేశీయ సూచీలు.. శుక్రవారం భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లోనే ఉన్నాయి.
Stock market today : అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో దేశీయ సూచీలు శుక్రవారం ట్రేడింగ్ను నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 601పాయింట్లు నష్టపోయి 54,719 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 165 పాయింట్ల నష్టంతో 16,314 వద్ద కొనసాగుతోంది.
ట్రెండింగ్ వార్తలు
గురువారం ట్రేడింగ్ సెషన్ను 428పాయింట్ల లాభంతో 55,320 వద్ద ముగించిన సెన్సెక్స్.. శుక్రవారం 54,760.25 వద్ద ప్రారంభమైంది. ఇక గురువారం.. 122 పాయింట్ల లాభంతో 16,478 వద్ద స్థిరపడిన నిఫ్టీ.. శుక్రవారం 16,283.95 వద్ద ఓపెన్ అయ్యింది.
లాభాలు.. నష్టాలు..
ఇన్ఫీ, పవర్గ్రిడ్, హెచ్డీఎప్సీ, ఎల్టీ, టెక్ఎం షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ షేర్లు స్వల్ప లాభాల్లో కొనసా
అంతర్జాతీయ మార్కెట్లు..
అమెరికాలో ద్రవ్యోల్బణానికి సంబంధించిన డేటా.. శుక్రవారం విడుదల కానుంది. ద్రవ్యోల్బణం ఇంకా తగ్గలేదని, ఫెడ్ మరిన్ని చర్యలు చేపట్టక తప్పదన్న ఊహాగానాలతో.. అమెరికా స్టాక్ మార్కెట్లలో మదుపర్లు భారీ అమ్మకాలు చేశారు. ఈ క్రమంలో యాపిల్ 3.6శాతం, అమెజాన్ 4.2శాతం మేర పతనమయ్యాయి. డౌజోన్స్ 1.94శాతం, ఎస్ అండ్ పీ 500 2.38శాతం, నాస్డాక్ 2.75శాతం మేర నష్టాల్లో ముగిశాయి.
అమెరికా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి సెగ.. ఆసియా మార్కెట్లను సైతం కలవరపెడుతోంది. జపాన్ నిక్కీ 1.3శాతం, సౌత్కొరియా కాస్పి 1.34శాతం, ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.76శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
యూరోప్లో వడ్డీ రేట్ల పెంపు..
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు చర్యలు చేపడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా చేరింది. జులైలో వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. అదే సమయంలో ద్రవ్యోల్బణం ఉహించిన దాని కన్నా ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.
ఎఫ్ఐఐ.. డీఐఐ..
దేశీయ స్టాక్ మార్కెట్లో గురువారం.. ఎఫ్ఐఐలు రూ. 1,512.24కోట్లు విలువ చేసే షేర్లు విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,624.90 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
సంబంధిత కథనం