Stock market news : స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు సైతం నష్టాల్లోనే ముగిశాయి.
Stock market news today in telugu : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 94పాయింట్ల నష్టంతో 59,026 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 24పాయింట్లు కోల్పోయి 17,606 వద్ద కొనసాగుతోంది.
ట్రెండింగ్ వార్తలు
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంతో.. సోమవారం ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 337పాయింట్ల నష్టంతో 59,120 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50.. 89పాయింట్లు కోల్పోయి 17,630 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్, నిఫ్టీలు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను వరుసగా 59005-17594 వద్ద మొదలుపెట్టాయి.
పివొట్ ఛార్ట్ ప్రకారం.. నిఫ్టీ సపోర్టు 17,534- 17438 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 17,724- 17,819 వద్ద ఉంది.
లాభాలు.. నష్టాలు..
Stock market news : టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, ఎం అండ్ ఎం, టైటాన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
హెచ్డీఎఫ్సీ, టెక్ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, కొటాక్ బ్యాంకు షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం సమస్యల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. డౌ జోన్స్ సూచీ 0.3శాతం, ఎస్ అండ్ పీ 500 0.84శాతం, నాస్డాక్ 1.37శాతం నష్టపోయాయి.
అమెరికా మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల పవనాల కారణంగా ఆసియా స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200.. 1.16శాతం నష్టపోయింది. సౌత్ కొరియా కాస్పి 0.68శాతం నష్టాల్లో ఉంది.
చమురు ధరలు..
చమురు ధరలు శుక్రవారం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్.. 0.2శాతం పెరిగి బ్యారెల్కు 90.62డాలర్లకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు.. రూ. 2,509.55కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 263.07కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఎఫ్ అండ్ ఓ బ్యాన్..
Stocks under F & O ban : అంబుజా సిమెంట్స్, కాన్ ఫిన్ హోమ్స్, డెల్టా కార్ప్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ షేర్లు నేడు ఎఫ్ అండ్ ఓ బ్యాన్ లిస్ట్లోకి చేరాయి.
సంబంధిత కథనం