Plane crash : రన్​వేపై దిగిన వెంటనే విమానంలో భారీ మంటలు- 29మంది దుర్మరణం!-south korea plane crashed with over 170 passengers rescue operations on ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Plane Crash : రన్​వేపై దిగిన వెంటనే విమానంలో భారీ మంటలు- 29మంది దుర్మరణం!

Plane crash : రన్​వేపై దిగిన వెంటనే విమానంలో భారీ మంటలు- 29మంది దుర్మరణం!

Sharath Chitturi HT Telugu
Dec 29, 2024 08:02 AM IST

South Korea plane crash : దక్షిణ కొరియా మువాన్ నగరంలోని విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్​ అయిన తర్వాత దానిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 29మంది మరణించారు.

ఘటనాస్థలం వద్ద దట్టమైన నల్లటి పొగలు..
ఘటనాస్థలం వద్ద దట్టమైన నల్లటి పొగలు..

దక్షిణ కొరియాలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. మువాన్ నగరంలోని విమానాశ్రయంలో రన్​వేపై ఓ విమానం దిగిన అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం మంటలు ఆ విమానం మొత్తాన్ని కప్పేశాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 29మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.

yearly horoscope entry point

దక్షిణ కొరియాలో విమాన ప్రమాదం..

ప్రమాదానికి గురైన విమానం జెజు ఎయిర్​కు చెందిన బోయింగ్ 737-800. ఇది బ్యాంకాక్​ నుంచి తిరిగి వస్తోంది. ప్రమాదం సమయంలో ఈ విమానంలో 170 మందికి పైగా మంది ఉన్నారని తెలుస్తోంది. మంటలను ఆర్పివేసిన తర్వాత విమానం నుంచి ప్రయాణికులను బయటకు తీసేందుకు రెస్క్యూ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు.

విమానం నుంచి దట్టమైన నల్లటి పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలను స్థానిక టీవీ స్టేషన్లు ప్రసారం చేశాయి.

విమానం రన్ వేపై నుంచి జారి కంచెను ఢీకొందని యోన్ హాప్ వార్తా సంస్థ తెలిపింది. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను పరిశీలిస్తున్నామని ఎమర్జెన్సీ అధికారులు వెల్లడించారు. అయితే ల్యాండింగ్​ గేర్​ తెరుచుకోకుండానే విమానం ల్యాండ్​ అయ్యిందని, అనంతరం పేలుడు సంభవించిందని తెలుస్తోంది.

దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 29 మంది మరణించారని, కాగా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.

వారంలో రెండో దుర్ఘటన..!

విమాన ప్రమాదాలకు సంబంధించి ఈ వారంలో ఇది రెండో దుర్ఘటన! కజకిస్థాన్​లోని అక్తౌ సమీపంలో బుధవారం జరిగిన అజర్​బైజాన్ ఎయిర్​లైన్స్ విమాన ప్రమాదంలో (67 మందిలో) 38 మంది మృతి చెందగా, మిగతా వారంతా గాయపడ్డారు.

అజర్​బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యా దక్షిణ చెచెన్యా ప్రాంతంలోని గ్రోజ్నీకి వందల మైళ్ల దూరం ప్రయాణించిన అజర్ బైజాన్ ఎయిర్​లైన్స్ విమానం జే2-8243 కజకిస్తాన్​లోని అక్టౌకు 3 కిలోమీటర్ల దూరంలో కాస్పియన్ సముద్రం అవతలి ఒడ్డున కూలిపోయింది.

కాస్పియన్ సముద్రం మీదుగా విమానం వందల మైళ్ల దూరం ఎందుకు కూలిపోయిందో తెలియరాలేదు. అయితే పొగమంచు కారణంగా విమానం కూలిపోయిందని మొదట నివేదికలు పేర్కొన్నాయి. కాని తరువాత రాయిటర్స్​లో ఉదహరించిన అజర్ బైజాన్ దర్యాప్తు యొక్క ప్రాధమిక ఫలితాలు రష్యా వైమానిక రక్షణ దళాలు పొరపాటున దానిని కూల్చివేశాయని తెలిపాయి.

దట్టమైన పొగమంచు, ఉక్రెయిన్ డ్రోన్లపై స్థానిక హెచ్చరికల మధ్య విమానం తన అసలు గమ్యస్థానం నుంచి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు రష్యా ఏవియేషన్ వాచ్ డాగ్ శుక్రవారం తెలిపింది.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.