South Korea Plane crash : దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179మంది దుర్మరణం- అసలు కారణం ఏంటి? లైవ్​ వీడియో..-south korea plane crash 179 of 181 passengers dead what led to the tragedy see live video ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  South Korea Plane Crash : దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179మంది దుర్మరణం- అసలు కారణం ఏంటి? లైవ్​ వీడియో..

South Korea Plane crash : దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179మంది దుర్మరణం- అసలు కారణం ఏంటి? లైవ్​ వీడియో..

Sharath Chitturi HT Telugu
Dec 29, 2024 01:05 PM IST

South Korea Plane crash death toll : దక్షిణ కొరియాలోని మువాన్​ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179మంది మరణించారు. ఈ విషాదకర ఘటనలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

విమాన ప్రమాదం జరిగిన ఘటన..
విమాన ప్రమాదం జరిగిన ఘటన.. (REUTERS)

దక్షిణ కొరియా ఆధివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179మంది మరణించారు! ప్రమాదం సమయంలో 181మంది విమానంలో ఉండగా, కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వివరాలను దక్షిణ కొరియా ఎమర్జెన్సీ కార్యాలయం వెల్లడించింది.

yearly horoscope entry point

అసలేం జరిగింది..?

జెజు ఎయిర్​ విమానం థాయ్​ల్యాండ్​లోని బ్యాంకాక్​ నుంచి మువాన్​ నగరానికి తిరిగివచ్చింది. నగరంలోని విమానాశ్రయంలో ఆదివారం ల్యాండ్​ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతం దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని అలముకుంది.

దక్షిణ కొరియా ప్రమాదం సమయంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు ఫ్లైట్ అటెండెంట్లు ఉన్నారని యోన్హాప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్యను తొలుత 28గా ప్రకటించారు. కానీ నిమిష నిమిషానికి మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. చివరికి 179 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు.

ప్రయాణికుల్లో ఇద్దరు థాయ్ జాతీయులు ఉన్నారని, మిగిలిన వారు దక్షిణ కొరియన్లని రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.

దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి అసలు కారణం ఏంటి?

ల్యాండింగ్ గేర్ సరిగ్గా లేకపోవడంతో విమానం రన్​వేపై నుంచి జారి కంచెను ఢీకొట్టిందని యోన్ హాప్ వార్తా సంస్థ తెలిపింది. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను పరిశీలిస్తున్నామని ఎమర్జెన్సీ అధికారులు తెలిపారు. ల్యాండింగ్ గేర్ తెరవకుండానే విమానం ల్యాండ్ అయ్యి చివరికి పేలిపోయిన దృశ్యాలు కనిపించాయి. అయితే విమానం రన్​వే చివరకు చేరుకునే వరకు వేగాన్ని తగ్గించడంలో విఫలమైందని, ఎయిర్​పోర్టు వెలుపలి అంచున ఉన్న గోడను ఢీకొట్టి పేలిపోయిందని వారు తెలిపారు.

నేషనల్ ఫైర్ ఏజెన్సీ 32 ఫైర్ ట్రక్కులు, పలు హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. ఈ ఘటనతో మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు.

మరోవైపు పక్షుల దాడి, ప్రతికూల వాతావరణం కూడా ఈ ఘోర ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానిక అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.

విమాన ప్రమాదం జరిగిన కొంతసేపటికే జెజు ఎయిర్ ఒక ప్రకటన విడుదల చేసింది. "మువాన్ విమానాశ్రయంలో జరిగిన సంఘటనలో ప్రభావితమైన వారందరికీ మేము క్షమాపణలు చెబుతున్నాము," అని తెలిపింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని వివరించింది. జరిగిన బాధకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాము అని జెజు ఎయిర్ తన వెబ్​సైట్​లో పేర్కొంది.

విమాన ప్రమాదం జరగడం ఈ వారంలో ఇది రెండోది! బుధవారం కజకిస్థాన్​లోని అక్తౌ సమీపంలో జరిగిన అజర్​బైజాన్ ఎయిర్​లైన్స్ విమాన ప్రమాదంలో 67 మందిలో 38 మంది మృతి చెందగా, మిగతా వారంతా గాయపడ్డారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.