ఐఈడీ పేలుడులో ఏడుగురు పాకిస్తాన్ సైనికులు మృతి-seven pakistani soldiers killed in ied blast in balochistan pak military confirms ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఐఈడీ పేలుడులో ఏడుగురు పాకిస్తాన్ సైనికులు మృతి

ఐఈడీ పేలుడులో ఏడుగురు పాకిస్తాన్ సైనికులు మృతి

Sudarshan V HT Telugu

బలూచిస్తాన్ లో జరిగిన ఒక ఐఈడీ పేలుడులో ఏడుగురు పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. బలూచిస్తాన్ లోని సమస్యాత్మక నార్త్ ఈస్ట్ ప్రావిన్స్ లో మంగళవారం ఈ ఘటన జరిగింది.

ఐఈడీ పేలుడులో ఏడుగురు పాకిస్తాన్ సైనికులు మృతి (AFP/File)

బలూచిస్తాన్ లోని సమస్యాత్మక నార్త్ ఈస్ట్ ప్రావిన్స్ లో మంగళవారం జరిగిన పేలుడులో ఏడుగురు పాక్ సైనికులు మృతి చెందినట్లు పాక్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. బలూచిస్తాన్ లో జైలు నుంచి ఖైదీలతో వెళ్తున్న వ్యాన్ పై దాడి చేసి, ఖైదీలను విడిపించి, ఐదుగురు పోలీసులను అపహరించిన ఘటన జరిగిన కొద్ది రోజులకే అదే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జైలు వ్యానుపై జరిగిన దాడికి తామే బాధ్యులమని వేర్పాటువాద మిలిటెంట్ గ్రూప్ ప్రకటించుకుంది.

శుక్రవారం జైలు వ్యాన్ పై

బలూచిస్థాన్ ప్రావిన్స్ లో శుక్రవారం రాత్రి 30 నుంచి 40 మంది సాయుధ మిలిటెంట్లు కీలక రహదారిని దిగ్బంధించి, పోలీసుల రక్షణతో జైలు నుంచి వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ తర్వాత ఖైదీలను విడుదల చేశారని, అయితే ఐదుగురు పోలీసు అధికారులను అపహరించారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

బలూచిస్తాన్ తో సమస్య

ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లోని ఖనిజ సంపద కలిగిన బలూచిస్థాన్ లో వేర్పాటువాద తిరుగుబాటు చాలా కాలంగా కొనసాగుతోంది. అక్కడి మిలిటెంట్లు తరచూ ప్రభుత్వ సిబ్బందిని, విదేశీయులను, ఇతర ప్రాంతాలకు చెందిన సెటిలర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. జైలు వ్యానుపై జరిగిన తాజా దాడికి తామే బాధ్యులమని ఈ ప్రాంతంలో అత్యంత చురుకైన వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.

గతంలో పలు దాడులు

ఈ ఏడాది ఏప్రిల్ లో పాకిస్థాన్ లోని నైరుతి ప్రాంతంలో భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం సమీపంలో శక్తిమంతమైన బాంబు పేలడంతో నలుగురు సైనికులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో ఈ దాడి జరిగింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.