Ayodhya Ram Mandir : స్కామ్​ అలర్ట్​.. మీ వాట్సాప్​కు ఇలా మెసేజ్​ వస్తే- జాగ్రత్త!-scam alert these whatsapp messages on ayodhya ram mandir are fake ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ayodhya Ram Mandir : స్కామ్​ అలర్ట్​.. మీ వాట్సాప్​కు ఇలా మెసేజ్​ వస్తే- జాగ్రత్త!

Ayodhya Ram Mandir : స్కామ్​ అలర్ట్​.. మీ వాట్సాప్​కు ఇలా మెసేజ్​ వస్తే- జాగ్రత్త!

Sharath Chitturi HT Telugu

Ayodhya Ram Mandir scam alert : ‘అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఈవెంట్​కు వీఐపీ టికెట్లు కావాలా? అయితే ఈ లింక్​ క్లిక్​ చేయండి,’ అని మీకు వాట్సాప్​లో మెసేజ్​ వచ్చిందా? అయితే తస్మాత్​ జాగ్రత్త!

మీ వాట్సాప్​కు ఇలా మెసేజ్​ వస్తే- జాగ్రత్త! (HT_PRINT)

Ayodhya Ram Mandir scam alert : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. ఆ ఘట్టం ఇంకొన్ని రోజుల దూరంలోనే ఉంది. జనవరి 22న.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. అత్యంత గ్రాండ్​గా ఈ ఈవెంట్​ జరగనుంది. అయితే.. ఈ ఈవెంట్​ టార్గెట్​గా సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు! అమాయకులకు మాయ మాటలు చెప్పి స్కామ్​లకు పాల్పడుతున్నారు.

స్కామ్​ అలర్ట్​.. ఈ మెసేజ్​ వస్తే జాగ్రత్త!

సామాన్య ప్రజలు, నెటిజెన్లే టార్గెట్​గా.. స్కామ్​స్టర్స్​ ఈ అయోధ్య రామ మందిర స్కామ్​కి పాల్పడుతున్నారు. మెగా ఈవెంట్​ రోజున, అంటే జనవరి 22న.. అయోధ్య రామ మందిరానికి వీఐపీ టికెట్లు ఇప్పిస్తామని వాట్సాప్​లో మెసేజ్​లు ఫార్వర్డ్​ చేస్తున్నారు.

"జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలా? ఈ కింద ఇస్తున్న లింక్​ని క్లిక్​ చేసి, మీ వివరాలను తెలియజేయండి. మీ కుటుంబసభ్యులకు, బంధువులకు.. ఎవరికైతే టికెట్లు కావాలో వారికి కూడా ఈ మెసేజ్​ని ఫార్వడ్​ చేయండి," అని స్కామ్​స్టర్స్​ మెసేజ్​లు చేస్తున్నారు.

Ayodhya Ram Mandir latest updates : మరికొందరు.. డైరక్ట్​గా ఏపీకే ఫైల్​ పంపించి డౌన్​లోడ్​ చేసుకోమని చెబుతున్నారు. ఆ ఏపీకే ఫైల్​ పేరు.. 'రామ జన్మభూమి గ్రిహ్​సంపర్క్​ అభియాన్​' అని ఉంటుంది. డౌన్​లోడ్​ చేసుకున్న వారికి ఉచితంగా వీఐపీ ఎంట్రీలు ఇస్తామని చెబుతున్నారు.

ఆ మెసేజ్​ల చివరిలో.. 'జైశ్రీరామ్​.. జై జై శ్రీరామ్​' అని ఉంటుంది.

ఇలాంటి మెసేజ్​లోని లింక్స్​ క్లిక్​ చేసినా, ఏపీకే ఫైల్స్​ డౌన్​లోడ్​ చేసినా.. ఇక అంతే! మీ డేటాను ఇవి దోచుకుంటాయి. అదే సమయంలో భయంకరమైన వైరస్​ని ఇంజెక్ట్​ చేస్తాయి. ఫలితంగా.. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్​ వివరాలన్నీ స్కామ్​స్టర్స్​ చేతుల్లోకి వెళతాయి. కాల్​ రికార్డ్స్​ నుంచి బ్యాంకింగ్​ యాక్టివిటీల వరకు.. అన్ని వాళ్ల కంట్రోల్​లో ఉంటాయి. మీరు చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగును వాళ్లు ట్రాక్​ చేస్తారు. సమయం, సందర్భం చూసుకుని మీ డబ్బులను దోచేసుకుంటారు.

మరి.. వీఐపీ పాస్​లు పొందడం ఎలా?

Ayodhya Ram Mandir news : రామ మందిర ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసి తరించాలని లక్షలాది మంది రామ భక్తులు కోరుకుంటున్నారు. దీనినే ప్రాఫిట్​ అనుకుని, స్కామ్​స్టర్స్​ రెచ్చిపోతున్నారు. కానీ ఇక్కడ ఒక్క విషయం పొందాలి. ఆహ్వాన పత్రిక ఉంటేనే ఈవెంట్​లోకి ఎంట్రీ లభిస్తుంది. ఆహ్వానం లేకుండా వెళితే.. వెనక్కి పంపించేస్తారు. ఈ మేరకు.. పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు గురువారం జరిగిన రివ్యూ మీటింగ్​లో అధికారులకు ప్రత్యేక ఆదేశాలిచ్చారు ఉత్తర్​ ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​.

"రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ నుంచి ఆహ్వానం లభించిన వారికే రామ మందిర ప్రారంభోత్సవానికి ఎంట్రీ ఉంటుంది. అయోధ్య హోటల్స్​లో అడ్వాన్స్​ బుకింగ్స్​ చేసుకున్న వారిని క్యాన్సిల్​ చేసుకునే విధంగా చర్యలు తీసుకోండి," అని స్పష్టం చేశారు యోగి ఆదిత్యనాథ్​.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.