Bihar quota : బీహార్​లో​ ‘65శాతం కోటా’ కొట్టివేతను సమర్థించిన సుప్రీంకోర్టు-sc refuses stay on patna hc order scrapping 65 caste based quota in bihar ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bihar Quota : బీహార్​లో​ ‘65శాతం కోటా’ కొట్టివేతను సమర్థించిన సుప్రీంకోర్టు

Bihar quota : బీహార్​లో​ ‘65శాతం కోటా’ కొట్టివేతను సమర్థించిన సుప్రీంకోర్టు

Sharath Chitturi HT Telugu

Bihar quota supreme court : బీహార్​లో ఉద్యోగాలు, అడ్మిషన్స్​లో 65శాతం కుల ఆధారిత రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

సుప్రీంకోర్టు..

'65శాతం కోట' విషయంలో బిహార్​ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బీహార్​లో ఉద్యోగాలు, అడ్మిషన్స్​లో 65 శాతం కుల ఆధారిత రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బీహార్ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్స్​పై నోటీసులు జారీ చేసి సెప్టెంబర్​లో విచారణ జరిపేందుకు అంగీకరించింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యా సంస్థల్లో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్​ని పాట్నా హైకోర్టు గత నెలలో రద్దు చేసింది.

రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు తీర్పు వెలువరించగా, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను మించి పెంపు ఉందని పిటిషనర్లు వాదించారు.

నవంబర్ 2023 లో, బీహార్ ప్రభుత్వం రెండు రిజర్వేషన్ బిల్లుల కోసం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అవి.. బీహార్​ రిజర్వేషన్​ ఆఫ్​ వేకెన్సీస్​ ఇన్​ పోస్ట్స్​ అండ్​ సర్వీసేస్​ (ఎస్​సీ, ఎస్​టీ, ఈబీసీ, ఓబీసీ కోసం), బీహార్ (విద్యా సంస్థలలో ప్రవేశాలలో) రిజర్వేషన్ సవరణ బిల్లు, 2023.

ఈ బిల్లుల ద్వారా కోటాను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచింది. బీహార్​ ప్రభుత్వం. బిల్లు​ల వల్ల ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) అదనంగా 10 శాతంతో కలిపి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకునేవి.

రాష్ట్ర కుల గణన సర్వే ఫలితాల తరువాత, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) 20%, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) 2%, అత్యంత వెనుకబడిన తరగతులు (ఈబీసీ) 25%, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కోటాను 18% కు ప్రభుత్వం పెంచింది.

అయితే రిజర్వేషన్ల పెంపు శాసనాధికారాలను మించిపోయిందని పిటిషనర్లు వాదించారు. రిజర్వేషన్ల పెంపు కూడా వివక్షతో కూడుకున్నదని, ఆర్టికల్ 14, 15, 16 ద్వారా పౌరులకు కల్పించిన సమానత్వ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

1992లో సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం నిర్దేశించిన 50% పరిమితిని ఉల్లంఘించినందుకు ఈ చట్టం సరైనది కాదని పేర్కొంటూ, "రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు తగినంత ప్రాతినిధ్యం ఉంది. 50% నిబంధనను ఉల్లంఘించడానికి సరైన ఆధారాలు లేవు. దీనిని ఏ విధంగానూ అనుమతించము," అని పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ హరీష్ కుమార్ లతో కూడిన ధర్మాసనం.. నాటి తీర్పులో వివరించింది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.