BBC documentary on PM Modi : బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు-sc issues notice to centre on pils on bbc documentary on 2002 gujarat riots ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sc Issues Notice To Centre On Pils On Bbc Documentary On 2002 Gujarat Riots

BBC documentary on PM Modi : బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

Sharath Chitturi HT Telugu
Feb 03, 2023 01:48 PM IST

BBC documentary on PM Modi : బీబీసీ డాక్యుమెంటరీ నిషేధం వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ఆ డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఆ డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు (HT_PRINT)

Supreme court notice to centre on BBC documentary : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించిన కేంద్రానికి.. సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. డాక్యుమెంటరీపై నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

వివాదాస్పదంగా బీబీసీ డాక్యుమెంటరీ..

2002 గుజరాత్​ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని మోదీపై ఇటీవలే ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దేశాభివృద్ధిని తట్టుకోలేక.. కొందరు ఇండియాపై కుట్ర పన్నుతున్నట్టు ఆరోపించింది. చివరికి.. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించింది.

BBC documentary on Modi : ఈ వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారింది. డాక్యుమెంటరీని నిషేధించినా.. పలు వర్సిటీల్లోని విద్యార్థులు దానిని ప్రదర్శించారు. ఈ క్రమంలో అనేక మంది అరెస్ట్​ అయ్యారు.

బీబీసీ డాక్యుమెంటరీని ప్రభుత్వం నిషేధం విధించడంపై సుప్రీంకోర్టులో కొన్ని రోజుల క్రితం రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్​)లు దాఖలయ్యాయి. వాటిని శుక్రవారం విచారించింది అత్యున్నత న్యాయస్థానం. సంబంధిత వ్యాజ్యాలపై స్పందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది జస్టిస్​ సంజీవ్​ ఖన్నా, జస్టిస్​ ఎంఎం సుంద్రేష్​లతో కూడిన ద్విశభ్య ధర్మాసనం. డాక్యుమెంటరీని నిషేధిస్తున్నట్టు విడుదల చేసిన నోటీసులను కూడా చూపించాలని కేంద్రానికి స్పష్టం చేసింది.

BBC documentary on Modi watch online : అధికారాన్ని ఉపయోగించుకుని.. సోషల్​ మీడియాలో నుంచి డాక్యుమెంటరీకి సంబంధించిన లింక్స్​ని తొలగించారని న్యాయవాది ఎంఎల్​ శర్మ.. తన పిటిషన్​లో ఆరోపించారు. లింక్స్​ని బ్లాక్​ చేసే ఉత్తర్వులను ప్రభుత్వం ఎప్పుడూ అధికారికంగా జారీచేయలేదని వివరించారు. డాక్యుమెంటరీపై నిషేధం విధించడం.. రాజ్యాంగానికి విరుద్ధమని, దుర్మార్గమని, ఏకపక్ష నిర్ణయాలని ఆరోపించారు.

BBC documentary SC notice : డాక్యుమెంటరీ నిషేధంపై మరో పిటిషన్​ను.. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రి, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​, ప్రముఖ జర్నలిస్ట్​ ఎన్​ రామ్​ దాఖలు చేశారు.

WhatsApp channel