Ramdev Baba on Salman Khan : ‘సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటారు’
Ramdev Baba on Salman Khan : సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు యోగా గురువు రామ్దేవ్ బాబా. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Ramdev Baba on Salman Khan : ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు యోగా గురువు రామ్దేవ్ బాబా. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు కూడా డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని గుర్తుచేశారు.
ట్రెండింగ్ వార్తలు
ఉత్తర్ప్రదేశ్ మోరాదాబాద్లో మూడు రోజుల పాటు యాంటీ డ్రగ్స్ క్యాంపైన్ ‘ఆర్యవీర్ సమ్మేళన్’ జరిగింది. ఇందులో శనివారం పాల్గొన్నారు రామ్దేవ్ బాబా. ఈ క్రమంలోనే అక్కడ ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం ఆ ప్రసంగంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. 'బాలీవుడ్- డ్రగ్స్' విషయంపై ఆయన మాట్లాడారు.
Ramdev Baba on drugs : "డ్రగ్స్ పార్టీలో మత్తుపదార్థాలు తీసుకుంటూ.. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దొరికిపోయాడు. జైలుకు వెళ్లాడు. ఇక సల్మాన్ ఖాన్ కూడా డ్రగ్స్ తీసుకుంటారు. ఆమిర్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటారో లేదో నాకు తెలియదు. వీళ్ల గురించి దేవుడికే తెలియాలి. ఎంతమంది నటులు డ్రగ్స్ తీసుకుంటున్నారో ఎవరికి తెలుసు? ఇక నటీమణుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. సినీ పరిశ్రమలో డ్రగ్స్ ప్రతిచోటా ఉంది. బాలీవుడ్లో డ్రగ్స్ ఉన్నాయి. రాజకీయాల్లో డ్రగ్స్ ఉన్నాయి. ఎన్నికల వేళ మద్యాన్ని విపరీతంగా పంపిణీ చేస్తారు. దేశాన్ని డ్రగ్స్ ఫ్రీగా చేయాలని మనం ప్రతిజ్ఞ చేయాలి," అని వ్యాఖ్యలు చేశారు యోగా గురువు రామ్దేవ్ బాబా.
ఎలాంటి ఆధారాలతో.. రామ్దేవ్ బాబా ఇలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియదు. ఆయన ఆరోపణలు చేసిన వారిలో.. ఎవరూ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. సల్మాన్ ఖాన్ సైతం ఈ విషయంపై ఇంకా మాట్లాడలేదు.
ఆర్యన్ ఖాన్..
Ramdev Baba on Bollywood drugs : క్రూజ్ పార్టీ కేసులో భాగంగా.. గతేడాది షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. 20రోజల తర్వాత బెయిల్ దొరికింది. కొన్ని నెలల తర్వాత.. ఆర్యన్ ఖాన్కు క్లీన్ చిట్ లభించింది.
2020లో సుశాంత్ సింగ్ రాజ్పుట్ ఆత్మహత్య సంచలనం సృష్టించింది. ఆ తర్వాత.. బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అనేక మంది బాలీవుడ్ ప్రముఖులను అధికారులు డ్రగ్స్ విషయంలో విచారించారు.
ఒక్క బాలీవుడ్లోనే కాదు.. దేశవ్యాప్తంగా డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా పంజాబ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యువత డ్రగ్స్కు బానిసగా మారిపోతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని గత కొంత కాలంగా డిమాండ్లు తీవ్రంగా పెరుగుతున్నాయి.
సంబంధిత కథనం