Rupee rises: 13 పైసలు బలపడి 79.11కి చేరిన రూపాయి
Rupee rises: రూపాయి విలువ మరో 13 పైసలు బలపడి ఈ ఉదయం 79.11కు చేరుకుంది.
ముంబై: సోమవారం ప్రారంభ ట్రేడింగ్లో అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ 13 పైసలు బలపడి 79.11 వద్ద కొనసాగుతోంది. ఒక దశలో 80.05కు పడిపోయిన రూపాయి విలువ గత వారం బాగా కోలుకుంది.
ట్రెండింగ్ వార్తలు
ఫారెక్స్ ట్రేడర్లు ద్రవ్య విధానంలో యూఎస్ ఫెడ్ దూకుడు తగ్గడం, పడిపోతున్న ముడి చమురు ధరల కారణంగా డాలర్ పతనం కొనసాగడం వల్ల రూపాయి బలంగా ప్రారంభమైంది.
ఇంటర్బ్యాంక్ విదేశీ మారకం వద్ద అమెరికా డాలర్తో రూపాయి 79.16 వద్ద ప్రారంభమైంది. ప్రారంభ లావాదేవీల్లో 79.11కి చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే 13 పైసల పెరుగుదలను నమోదు చేసింది.
క్రితం సెషన్లో అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ 79.24 వద్ద ముగిసింది.
డాలరు బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.14 శాతం పడిపోయి 105.75 వద్దకు చేరుకుంది.
గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 0.97 శాతం తగ్గి 103 డాలర్లకు చేరుకుంది.
రూపాయి 79 నుండి 79.40 రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ట్రెజరీ హెడ్ అనిల్ కుమార్ భన్సాలీ అంచనా వేశారు.
‘ఆగస్టు 5న రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (RBI MPC) రేటు సంకేతాలను అందుకోవడానికి మార్కెట్ వేచి ఉంది’ అని బన్సాలీ చెప్పారు.
దేశీయ ఈక్విటీ మార్కెటు లాభాల్లో ట్రేడవుతోంది. 30-షేర్ సెన్సెక్స్ 188.86 పాయింట్లు పెరిగి 57,759.11 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 72.45 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 17,230.70 వద్దకు చేరుకుంది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు శుక్రవారం క్యాపిటల్ మార్కెట్లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం రూ. 1,046.32 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
టాపిక్