viral : అగ్ర కులాల అసోసియేషన్.. ఆరెస్సెస్!
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) అగ్ర కులాల సంస్థ అని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా` కార్యక్రమం పెద్ద డ్రామా అని, ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే పెద్ద డ్రమటిస్ట్ అని వ్యాఖ్యానించారు.
viral news | కాంగ్రెస్ సీనియర్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరెస్సెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. అగ్రకులాల ఆధిపత్యాన్ని నిలపడానికి అనునిత్యం కృషి చేసే సంస్థలు ఆరెస్సెస్, బీజేపీలని ఆయన ఆరోపించారు.
ట్రెండింగ్ వార్తలు
viral news | అగ్ర కులాల అసోసియేషన్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) అగ్ర కులాల ఆర్గనైజేషన్ అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్, బీజేపీలు అగ్ర కులాల ఆధిపత్యాన్ని సపోర్ట్ చేస్తాయని, అందుకే అవి చాతుర్వర్ణ వ్యవస్థకు మద్దతిస్తాయన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థతో సమాజంలో అసమానతలు పెరుగుతాయన్నారు. కర్నాటక పీసీసీ ఆఫీస్లో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్ధరామయ్య మాట్లాడారు. ఆరెస్సెస్ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొనలేదని, ఏనాడు కూడా భారత జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వలేదని వివరించారు. గత 52 ఏళ్లుగా ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేయలేదన్నారు. నిజానికి ప్రస్తుత బీజేపీకి సైద్ధాంతికంగా గురువులైన సావర్కర్, గోవల్కర్లు జాతీయ పతాకాన్ని వ్యతిరేకించారన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేయాలని సూచించారు.
`హర్ ఘర్ తిరంగా` పెద్ద డ్రామా కార్యక్రమం..
కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా` కార్యక్రమం పెద్ద డ్రామా అని సిద్ధరామయ్య విమర్శించారు. దేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలు కొనసాగడానికి కాంగ్రెస్సే కారణమన్నారు. స్వాతంత్య్రం రావడానికన్నా ముందు పుట్టిన తమకు, స్వాతంత్య్రం వచ్చిన పుట్టిన ప్రధాని మోదీ వంటి వారు దేశభక్తి గురించి చెబుతున్నారన్నారు. ప్రధాని మోదీ దేశంలోనే పెద్ద డ్రామా బాజీ అని విమర్శించారు.