New Governors appointment : పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి
New Governors appointment : పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి. ఈ మేరకు ఆదివారం రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
New Governors appointment : 12 రాష్ట్రాలకు గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాఖ్కు లెఫ్టినెంట్ గవర్నర్ను నియమిస్తూ.. రాష్ట్రపతి భవన్ ఆదివారం ఓ ప్రకటనను వెలువరించింది. మహారాష్ట్ర గవర్నర్గా భగత్ సింగ్ కోశ్యారి తప్పుకున్నారు. ఆయన స్థానంలో రమేశ్ బైస్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ట్రెండింగ్ వార్తలు
'మహా' ఉద్రిక్తల మధ్య..
Maharashtra new governor : మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి- విపక్షాల మధ్య గత కొంత కాలంగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ క్రమంలో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవలే ప్రకటించారు భగత్ సింగ్ కోశ్యారి. తన రాజీనామాను ఆమోదించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన ద్రౌపది ముర్ము.. మహారాష్ట్ర కొత్త గవర్నర్గా రమేశ్ బైస్ను నియమించారు. ఇంతకాలం ఆయన ఝార్ఖండ్ గవర్నర్ బాధ్యతల్లో కొనసాగారు. ఇప్పుడు ఝార్ఖండ్ గవర్నర్గా సీపీ రాధా కృష్ణన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
మరోవైపు లద్ధాఖ్ లెఫ్టినెట్ జనరల్ రాధా కృష్ణన్ మూర్తి సైతం.. రాజీనామా చేశారు. ఫలితంగా ఆయన స్థానంలో బ్రిగేడియర్ డా. బీడీ మిశ్రా (రిటైర్డ్)ను లద్ధాఖ్ లెఫ్టినెంట్ జనరల్గా నియమించింది రాష్ట్రపతి భవన్. ఆయన ఇంతకాలం అరుణాచల్ప్రదేశ్కు గవర్నర్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ భర్తీ చేయనున్నారు.
AP new Governor : ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా విశ్రాంత జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈశాన్య భారతంలోనూ..
సిక్కిం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్ల, అసోం గవర్నర్గా గులామ్ చాంద్ కటారియాలు పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు.
President appoints new Governors : వీరితో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు సైతం మారారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న బిశ్వ భూషణ్ హరిచందన్.. ఛత్తీస్గఢ్కు వెళ్లనున్నారు. ఛత్తీస్గఢ్ గవర్నర్ శుశ్రి అనుసుయా ఉక్యె.. మణిపూర్కు వెళ్లనున్నారు. లా గణేశన్.. నాగాలాండ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన మణిపూర్ గవర్నర్ పదవిలో ఉన్నారు. మేఘాలయ గవర్నర్గా.. ఇప్పటివరకు బీహార్లో ఆ బాధ్యతలు చూసుకున్న ఫాగు చౌహాన్ నియమితులయ్యారు. ఇక హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఇప్పటివరకు ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. బీహార్ గవర్నర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాష్ట్రపతి భవన్ వెలువరించిన ప్రకటన ప్రకారం.. సంబంధిత గవర్నర్లు తమ తమ రాష్ట్రాల్లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి.