రాజ్యసభలో 47గంటల సమయం వృథా.. లోక్సభ పనిచేసింది 44 గంటలే!
Parliament monsoon session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కార్యకలాపాలు సోమవారంతో ముగిశాయి. కాగా.. రాజ్యసభలో మొత్తం మీద 47గంటల సమయం వృథా అయ్యింది.
Parliament monsoon session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎంతో విలువైన సమయం వృథా అయ్యింది! ముఖ్యంగా రాజ్యసభ కేవలం 35 గంటలే పనిచేసింది. మొత్తం మీద రాజ్యసభలో 47గంటల సమయం వృథా అయ్యింది.
ట్రెండింగ్ వార్తలు
జులై 18న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారంతో రాజ్యసభ కార్యకలాపాలు ముగిశాయి. విపక్షాల నిరసనల కారణంగా.. 16 సిట్టింగ్లలో 47 గంటల సమయం వృథాగా మారింది.
ఈ వ్యవహారంపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలకు ఆటంకం కలగడం బాధాకరమైన విషయమన్నారు.
రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. రాజ్యసభ ఛైర్మన్గా ఆయనకు సోమవారమే చివరి రోజు. చివరి ప్రసంగంలో.. సభ కార్యకలాపాలకు కలిగిన ఆటంకాలను ప్రస్తావించారు వెంకయ్య నాయుడు. ప్రశ్నలు అడగడం, సమాధానాలు పొందడం వంటి అవకాశాలు కోల్పోయామని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ దఫా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో.. రాజ్యసభలో 235 ప్రశ్నలు లిస్టింగ్కు రాగా.. కేవలం 61 వాటికి మాత్రమే సమాధానాలు లభించాయి. ఏడు రోజుల పాటు క్వశ్చన్ హవర్ కార్యక్రమమే జరగలేదు. 60 స్పెషల్ మెన్షన్లు, 25 అంశాలు మాత్రమే చర్చకు వచ్చాయి.
Rajya Sabha : ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై తీవ్రస్థాయిలో నిరసనలు చేసిన విపక్షాలు.. సభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. కాగా.. ధరల పెరుగుదలపై రాజ్యసభలో చర్చ జరగ్గా.. కేవలం 33మంది మాత్రమే పాల్గొన్నారు. ఆ చర్చ కూడా నాలుగు గంటలే జరిగింది.
ఈ దఫా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో నాలుగు బిల్లులు పాస్ అయ్యాయి.
ఇక చివరి ప్రసంగంలో ప్రధాని మోదీతో పాటు అధికార, విపక్ష ఎంపీలకు వెంకయ్య నాయుడు ధన్యవాదాలు తెలిపారు.
లోక్సభలో..
Lok లోక్సభ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. 16 సిట్టింగ్లలో 44 గంటల 29 నిమిషాలు పనిచేసింది.
ఈ సమయంలో ఏడు బిల్లులు, ఆరు లెజిస్లేషన్లు పాస్ అయ్యాయి.
రెండు సభలు.. షెడ్యూల్కు నాలుగు రోజుల ముందే ముగిశాయి.
సంబంధిత కథనం