Rajasthan budget 2023 : పాత బడ్జెట్​నే మళ్లీ చదివిన సీఎం! విపక్షాలు ఫైర్​..-rajasthan budget 2023 live cm gehlot reads out excerpts of previous budget uproar in house ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rajasthan Budget 2023 Live Cm Gehlot Reads Out Excerpts Of Previous Budget, Uproar In House

Rajasthan budget 2023 : పాత బడ్జెట్​నే మళ్లీ చదివిన సీఎం! విపక్షాలు ఫైర్​..

Sharath Chitturi HT Telugu
Feb 10, 2023 12:35 PM IST

Rajasthan budget 2023 live : రాజస్థాన్​ సీఎం అశోక్​ అశోక్​ గహ్లోత్​.. రాష్ట్ర అసెంబ్లీలో పాత బడ్జెట్​ను ప్రవేశపెట్టారు! ఈ విషయంపై విపక్షాలు మండిపడ్డాయి.

బడ్జెట్​కు ముందు  రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​..
బడ్జెట్​కు ముందు రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​.. (ANI)

Rajasthan budget 2023 live : బడ్జెట్​ సమావేశాల నేపథ్యంలో రాజస్థాన్​ అసెంబ్లీలో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొంది. సీఎం అశోక్​ గహ్లోత్​.. పాత బడ్జెట్​నే ప్రవేశపెట్టారని విపక్ష బీజేపీ ఆరోపించింది. బడ్జెట్​ డాక్యుమెంట్​లు లీక్​ అయినట్టు విమర్శించింది. బీజేపీ నిరసనల మధ్య సభ 30 నిమిషాల పాటు వాయిదా పడింది.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

రాజస్థాన్​లో సీఎం పదవితో పాటు ఆర్థికశాఖ బాధ్యతలు కూడా అశోక్​ గహ్లోత్​ చేతుల్లోనే ఉంది. కాగా.. శుక్రవారం ఉదయం ఆయన బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివర్లో.. రాజస్థాన్​ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అశోక్​ గహ్లోత్ బృందం రూపొందించిన​ బడ్జెట్​పై అక్కడి ప్రజల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Ashok Gehlot Rajasthan budget 2023 : అయితే.. బడ్జెట్​ డాక్యుమెంట్​లలో పొరపాటు జరిగినట్టు తెలుస్తోంది! 2023-24 బడ్జెట్​కి బదులు పాత బడ్జెట్​ సారాంశాన్నే అశోక్​ గహ్లోత్​ మళ్లీ చదివినట్టు సమాచారం. పట్టణాభివృద్ధి, కృషి బడ్జెట్​ వంటి అంశాలపై 8 నిమిషాల పాటు అశోక్​ గహ్లోత్​ చేసిన ప్రసంగం.. 2022-23 బడ్జెట్​ను పోలి ఉంది! ఈ విషయాన్ని గ్రహించిన విపక్ష బీజేపీ.. సభలో గందరగోళాన్ని సృష్టించింది.

బడ్జెట్​ ప్రతులను సీఎం మాత్రమే తీసుకురావాలని, కానీ ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు అధికారుల చేతులు మారుతూ వస్తున్నాయని బీజేపీ పేర్కొంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందే.. బడ్జెట్​ డాక్యుమెంట్లు లీక్​ అయ్యాయని ఆరోపించింది.

Rajasthan budget 2023 : ఈ పరిణామాలపై బీజేపీ నేత, మాజీ సీఎం వసుంధర రాజే.. అశోక్​ గహ్లోత్​పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

"అసలు ఏ బడ్జెట్​ చదువుతున్నారో సీఎంకే తెలియడం లేదు. సభలోకి వచ్చే ముందు కనీసం ఒక్కసారి కూడా చూసుకుని ఉండరు. దీని బట్టి.. ప్రజా పాలనలో ఈ ప్రభుత్వం ఎంత సీరియస్​గా ఉందో తెలిసిపోతోంది. ఇలాంటి వారు పాలిస్తున్నంత కాలం.. ఈ రాష్ట్రం నాశనం అవ్వకతప్పదు. నేను సీఎంగా ఉన్నప్పుడు కనీసం 2,3 సార్లైనా బడ్జెట్​ను చదివి, ఆ తర్వాతే అసెంబ్లీలోకి తీసుకొచ్చేదానిని," అని వసుంధర రాజే తన నిరసన వ్యక్తం చేశారు.

సభ వాయిదా..

Ashok Gehlot latest news : బీజేపీ నేతల నిరసనలు రాజస్థాన్​ అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణానికి దారి తీశాయి. నేతల నిరసనలను నియంత్రించేందుకు స్పీకర్​ సీపీ జోషి విఫలయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సభ 30 నిమిషాల పాటు వాయిదా పడింది. అనంతరం స్పీకర్​ వెల్​లోకి వెళ్లిన బీజేపీ నేతలు అక్కడ బైఠాయించి ఆందోళన చేపట్టారు.

గహ్లోత్​ వివరణ..

పాత బడ్జెట్​ను చదివిన వ్యవహారంపై వివరణ ఇచ్చారు గహ్లోత్​.

“మీకు బడ్జెట్​ కాపీలు ఇచ్చాము. నా దగ్గర ఉన్న దానిలో ఒక పేజీ తప్పుగా వచ్చింది. అది చదివాను. రెండింట్లో వ్యత్యాసాన్ని మీరు చెప్పగలరు. అంత మాత్రన బడ్జెట్​ లీక్​ అయ్యిందని ఎలా అనగలరు?” అని అన్నారు అశోక్​ గహ్లోత్​.

WhatsApp channel

సంబంధిత కథనం