పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. రాష్టపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ప్రముఖులు-president droupadi murmu presents padma awards 2025 at rashtrapati bhavan balakrishna ajith kumar arijit singh shekhar ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. రాష్టపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ప్రముఖులు

పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. రాష్టపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ప్రముఖులు

Anand Sai HT Telugu

2025 సంవత్సరానికి గాను పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. అవార్డులను ప్రముఖులు అందుకున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అందుకున్న అజిత్ కుమార్

సోమవారం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం 2025 నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్, శేఖర్ కపూర్, అరిజిత్ సింగ్, రికీ కేజ్ వంటి ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. పంకజ్ ఉదాస్‌ను మరణానంతరం సత్కరించారు.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై పద్మ అవార్డులను అందుకున్నారు. నందమూరి బాలకృష్ణ సాంప్రదాయ దుస్తులలో వచ్చి పద్మభూషణ్‌ను స్వీకరించగా, అజిత్ కుమార్ సూట్ ధరించి వచ్చారు. శేఖర్ కపూర్, శోభన కూడా పద్మభూషణ్‌ను అందుకున్నారు. పంకజ్ ఉధాస్ భార్య ఆయన గౌరవార్థం ఈ అవార్డును స్వీకరించారు.

జనవరిలో అవార్డులు ప్రకటించినప్పుడు అజిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'భారత రాష్ట్రపతి చేత గౌరవనీయమైన పద్మ అవార్డును తీసుకోబోవడం నాకు చాలా వినయంగా, గౌరవంగా ఉంది. ఇంత స్థాయిలో గుర్తింపు పొందడం ఒక గౌరవం. నేను నిజంగా కృతజ్ఞుడను.' అని చెప్పారు.

అరిజిత్ సింగ్, రికీ కేజ్‌లకు పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేశారు. తెలంగాణకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్‌ను ప్రదానం చేశారు. ఎండోస్కోపీలో ఆయన చేసిన అద్భుతమైన క్లినికల్ పురోగతి, వైద్య పరిశోధనలకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. అవార్డు ప్రదానోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. క్రీడలు, వైద్యం, వ్యాపారం, ఇతర రంగాలకు చెందిన అనేక మంది సోమవారం అవార్డులను అందుకున్నారు.

డాక్టర్ లక్ష్మీనారాయణ సుబ్రమణ్యంను కళ, సంగీత రంగంలో చేసిన విశేష కృషికి పద్మవిభూషణ్‌తో సత్కరించారు. డాక్టర్ సుబ్రమణ్యం ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు. ఆయన కర్ణాటక, పాశ్చాత్య సంగీతంలో మంచి ప్రావీణ్యం కలిగి ఉన్నారు. సంగీత రంగంలో తన ప్రత్యేకమైన శైలికి ప్రసిద్ధి చెందారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.