జమ్ముకశ్మీర్​లో పోలీస్​ అధికారి కాల్చివేత.. ఉగ్రవాదుల పనే!-police officer shot dead in j k s pulwama ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  జమ్ముకశ్మీర్​లో పోలీస్​ అధికారి కాల్చివేత.. ఉగ్రవాదుల పనే!

జమ్ముకశ్మీర్​లో పోలీస్​ అధికారి కాల్చివేత.. ఉగ్రవాదుల పనే!

Sharath Chitturi HT Telugu

జమ్ముకశ్మీర్​ పుల్వామా​ జిల్లాలోని ఓ ఎస్​ఐ.. అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆయన్ని ఉగ్రవాదులు కాల్చి చంపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో పోలీస్​ అధికారి కాల్చివేత! (ANI/ప్రతీకాత్మక చిత్రం)

జమ్ముకశ్మీర్​లో తీవ్ర అలజడులు నెలకొన్నాయి. పుల్వామా​ జిల్లా  పాంపోర్​కు చెందిన సంబోరా గ్రామంలోని వరి పొలాల్లో ఎస్​ఐ ఫరూక్​ అహ్మద్​ మీర్​ మృతదేహం కనిపించింది. ఆయన శరీరం మొత్తం బుల్లెట్​ గాయాలతో నిడిపోయింది.

శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఉగ్రవాదులే ఆ ఎస్​ఐని చంపినట్టు తెలుస్తోంది.

"ఐఆర్​పీ 23 బెటాలియన్​లో పోస్ట్​ అయిన ఫకూర్​ అహ్మద్​ మీర్​ మృతదేహం.. ఆయన ఇంటికి సమీపంలోని వరి పొలాల్లో కనిపించింది. తన వరి పొలాల్లో పనిచేసేందుకు ఆయన ఇంటి నుంచి బయటకి వచ్చినట్టు తెలుస్తోంది. అప్పుడే ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్నాము. ఉగ్రవాదులే ఈ ఘటనకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది," అని కశ్మీర్​ పోలీసులు ట్వీట్​ చేశారు.

జమ్ముకశ్మీర్​లో ఇటీవలి కాలంలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. పోలీసులు, వ్యాపారులు, పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపుతున్న ఘటనలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ఘటన.. సర్వత్రా భయాందోళనలను సృష్టించింది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.