PM to launch 5G services: రేపు 5 జీ సేవలు ప్రారంభం
PM to launch 5G services: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం భారత్ లో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించే 5 జీ టెలీకాం సర్వీసెస్ ను ప్రారంభించనున్నారు.
PM to launch 5G services: భారత్ లో 5 జీ సేవలను ప్రధాని మోదీ శనివారం, అక్టోబర్ 1న, 2022న ప్రారంభించనున్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది.
PM to launch 5G services: మొదట కొన్ని నగరాల్లోనే..
ఈ సేవలు మొదట కొన్ని నగరాల్లోనే అందుబాటులోకి వస్తాయి. క్రమంగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తారు. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించే 5 జీ సర్వీసెస్ వల్ల విద్య, వైద్యం, ప్రజా సేవలు, వ్యాపార, వాణిజ్య రంగాలకు పెను ప్రయోజనం కలుగుతుంది. 2035 నాటికి 5జీ సేవల వల్ల ఒనగూరే ప్రయోజనం దాదాపు 450 బిలియన్ డాలర్లని అంచనా.
PM to launch 5G services: ప్రగతి మైదాన్ నుంచి..
అక్టోబర్ 1న ఢిల్లీలోని ప్రగతి మైదాన్ నుంచి భారత్ లో 5జీ సేవలను ప్రధాని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, టెలీకాం కంపెనీ అధిపతులు పాల్గొనే అవకాశముంది. రిలయన్స్ నుంచి ముకేశ్ అంబానీ, ఎయిర్ టెల్ నుంచి సునీల్ మిట్టల్, వీ ఇండియా హెడ్ రవిందర్ ఠక్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇదే కార్యక్రమంలో ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022’ ఎడిషన్ ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు.
PM to launch 5G services: దీపావళి నుంచి జియో సేవలు
భారత్ లో 5జీ సేవలను అందించడానికి అవసరమైన మౌలిక వసతులను టెలీకాం కంపెనీలు ఇప్పటికే సమకూర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దీపావళి నుంచి భారత్ లోని కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో 5 జీ సేవలను ప్రారంభించబోతున్నట్లు రిలయన్స్ జియో ఇప్పటికే ప్రకటించింది. ఎయిర్ టెల్, వీ సంస్థలు తమ 5జీ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయో రేపు ప్రకటించే అవకాశముంది.