PM Modi latest news : సుదీర్ఘ కాలం పాటు జరిగిన 2024 లోక్సభ ఎన్నికలు, కన్యాకుమారి ట్రిప్ తర్వాత.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మళ్లీ అధికారిక సమావేశాలతో ఆదివారాన్ని బిజీబిజీగా గడపబోతున్నారు. మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చిన అనంతరం మొదటి 100 రోజుల్లో చేయాల్సిన పనులు సహా.. దేశంలో హీట్వేవ్ పరిస్థితులపై కీలక చర్చలు జరపనున్నారు.
జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో జరిగే వార్షిక ఈవెంట్ సెలబ్రేషన్స్ సన్నాహకాలను ఫైనలైజ్ చేయనున్నారు మోదీ. 'భూమి పునరుద్ధరణ, డిసెర్టిఫికేషన్, కరవు' థీమ్తో ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరగనుంది. ఈ ఈవెంట్ని సౌదీ అరేబియా హోస్ట్ చేయనుంది.
ఇక ఆదివారం మోదీ చేపట్టనున్న సమావేశాల్లో.. హైలైట్ ఒకటి ఉంది. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్లో.. మోదీ మళ్లీ ప్రధాని అవుతారని అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో.. అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో చేయాల్సిన పనులపై తన టీమ్తో ఆదివారమే కీలక చర్చలు జరపనున్నారు మోదీ. ఇది అనేక గంటల పాటు జరుగుతుందని తెలుస్తోంది. ఏ లక్ష్యాలు పెట్టుకోవాలి? ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఎంచుకోవాలి? వంటివి ఈ సమావేశంలో చర్చించనున్నారు.
2024 Lok Sabha elections exit polls : ఎన్నికల క్యాంపైనింగ్లోకి అడుగుపెట్టే ముందు.. తన సీనియర్ దౌత్యవేత్తలతో చర్చించారు మోదీ. మోదీ3.0కి సిద్ధంగా ఉండాలని.. ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అందుకు తగ్గట్టుగా రెడీ అవ్వాలని సూచించారు. మరి.. 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే.. మోదీ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఏప్రిల్ 19న ప్రారంభమైన లోక్సభ ఎన్నికల ఏడు దశల మారథాన్ పోలింగ్ ప్రక్రియ జూన్ 1 శనివారంతో ముగిసింది. జూన్ 1న ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత, శనివారం సాయంత్రం 6.30 నుంచి వివిధ సంస్థలు, న్యూస్ చానళ్లు తమ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. వాటిలో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా, ఏబీపీ- సీ-ఓటర్, న్యూస్ 24-టుడేస్ చాణక్య, రిపబ్లిక్ టీవీ- పీఎంఏఆర్క్యూ-మ్యాట్రిజ్, టైమ్స్ నౌ- బుల్స్ ఐ, ఎన్డీటీవీ ఇండియా- జన్ కీ బాత్, టీవీ9 భారతవర్ష్- పోల్స్టార్ట్ తదితర జాతీయ న్యూస్ ఛానళ్లు, ఏజెన్సీలు ఉన్నాయి.
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని రిపబ్లిక్ టీవీ- పీ మార్క్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఎన్డీయే కు 359 సీట్లు, ఇండియా కూటమికి 154 సీట్లు, ఇతరులకు 30 సీట్లు వస్తాయని పేర్కొంది. అలాగే, ఇండియా న్యూస్ - డీ డైనమిక్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఎన్డీయేకు ఈ ఎన్నికల్లో 371 స్థానాలు, ఇండియా కూటమికి 125 సీట్లు వస్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం