PM Modi thanks cadre: కార్యకర్తలే ఛాంపియన్లు.. గుజరాత్ విజయంపై మోదీ-pm modi thanks bjp karyakartas after historic win in gujarat
Telugu News  /  National International  /  Pm Modi Thanks Bjp Karyakartas After Historic Win In Gujarat
గుజరాత్‌లో పార్టీ శ్రేణుల సంబరాలు
గుజరాత్‌లో పార్టీ శ్రేణుల సంబరాలు (AP)

PM Modi thanks cadre: కార్యకర్తలే ఛాంపియన్లు.. గుజరాత్ విజయంపై మోదీ

08 December 2022, 18:04 ISTHT Telugu Desk
08 December 2022, 18:04 IST

గుజరాత్‌లో బీజేపీ చారిత్రక విజయం నమోదు చేయడంపై ప్రధాన మంత్రి మోదీ స్పందించారు. కార్యకర్తలందరూ ఛాంపియన్లని కొనియాడారు.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ చారిత్రాత్మక విజయం సాధించినందున ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లోని ప్రతి బీజేపీ కార్యకర్తను "ఛాంపియన్" అని సంబోధించారు.

‘కష్టపడి పనిచేసే బీజేపీ గుజరాత్ కార్తకలు అందరికీ నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. మీలో ప్రతి ఒక్కరూ ఛాంపియన్! మా పార్టీకి నిజమైన బలం అయిన మా కార్యకర్తల అసాధారణమైన కృషి లేకుండా ఈ చారిత్రాత్మక విజయం ఎప్పటికీ సాధ్యం కాదు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోదీ ‘ధన్యవాదాలు గుజరాత్. అసాధారణ ఎన్నికల ఫలితాలను చూసి నేను చాలా భావోద్వేగాలకు లోనయ్యాను. ప్రజలు అభివృద్ధి రాజకీయాలను ఆశీర్వదించారు. అదే సమయంలో ఈ ఊపు మరింత వేగంగా కొనసాగాలని కోరుకుంటున్నారు. నేను గుజరాత్ జనశక్తికి నమస్కరిస్తున్నాను..’ అని మోదీ తన తదుపరి ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఎన్నికల పనితీరు అన్ని రికార్డులను బద్దలు కొట్టేలా చేసింది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక స్థానాలను సాధించిన పార్టీగా బీజేపీ నిలవనుంది.

ఎన్నికల సంఘం తాజా సమాచారం ప్రకారం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో ఇప్పటికే 141 స్థానాల్లో విజయం సాధించి, 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ మొత్తంగా 156 స్థానాల్లో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉంది.

ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో 5 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో ఆ పార్టీ తన ఓట్ల శాతాన్ని 12.92 శాతానికి పెంచుకుంది. గుజరాత్‌లో కాంగ్రెస్ తన ఘోరమైన ఓటమిని చవిచూడనుంది. 15 స్థానాలు గెలుచుకుని 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

గుజరాత్‌లో వరుసగా ఏడోసారి ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ, 2002లో తన పేరిట ఉన్న 127 సీట్ల తన అత్యుత్తమ రికార్డును మెరుగుపరుచుకోవడమే కాకుండా, 1985లో కాంగ్రెస్‌కు దక్కిన 149 స్థానాల రికార్డును కూడా బద్దలు కొట్టబోతోంది.

డిసెంబరు 12న ప్రమాణ స్వీకారం

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి డిసెంబర్ 12 మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని గురువారం రాష్ట్ర బిజెపి చీఫ్ సిఆర్ పాటిల్ చెప్పారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతను మొదటిసారి 12 సెప్టెంబర్ 2021న బిజెపి శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు.