Gaganyaan astronauts : 'గగన్యాన్'లో పర్యటించే వ్యోమగాముల పేర్లను ప్రకటించిన మోదీ!
Gaganyaan astronauts names : గగన్యాన్ మిషన్ కోసం సన్నద్ధమవుతున్న నలుగురు వ్యోమగాములను ప్రపంచానికి పరిచయం చేశారు ప్రధాని మోదీ. 140 కోట్ల భారతీయుల అంతరిక్ష ఆంకాక్షలను వారు మోస్తున్నారని వ్యాఖ్యానించారు.

Who are the astronauts selected for Gaganyaan : ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'గగన్యాన్' మిషన్కి సంబంధించిన కీలక్ అప్టేట్! భారత దేశ తొలి మానవసహిత అంతరిక్ష మిషన్లో ప్రయాణించే నలుగురు వ్యోమగాముల పేర్లను మంగళవారం ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారు.. గ్రూప్ కెప్టెన్ పీ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ ఎస్ శుక్లా. వీరందరికి.. 'అస్ట్రోనాట్ వింగ్స్'ని ఇచ్చారు మోదీ.
గగన్యాన్ మిషన్కు ఇస్రో సన్నద్ధం..
కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. తిరువనంతపురంలోని వీఎస్ఎస్సీ (విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్)ని సందర్శించారు. గగన్యాన్ మిషన్ ప్రోగ్రెస్ని రివ్యూ చేశారు. అనంతరం.. మిషన్ కోసం సన్నద్ధమవుతున్న వ్యోమగాములను కలిశారు. ఆ తర్వాత.. వారందరిని ప్రపంచానికి పరిచయం చేశారు.
Gaganyaan 3 astronauts name : 2024-25 మధ్యలో ఈ గగన్యాన్ మిషన్ని ప్రయోగించాలని ఇస్రో ప్లాన్ చేసింది. అంతరిక్షణంలో లో ఎర్త్ ఆర్బిట్లో మూడు రోజుల పాటు వ్యోమగాములను ఉంచి, వారిని సురక్షితంగా ఇండియాకు తీసుకురావడమే ఈ మిషన్ లక్ష్యం. మిషన్ కోసం వ్యోమగాములు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. టెక్నికల్ స్కిల్స్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్పై అధిక దృష్టిపెట్టారు.
"గగన్యాన్లో ప్రయాణించే నలుగురి పేర్లు ఇప్పుడు ఇండియాకు తెలిసింది. ఈ నలుగురు కేవలం ప్రయాణికులు మాత్రమే కారు! 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకు వెళ్లే శక్తులు.. ఈ నలుగురు. 40ఏళ్ల తర్వాత.. ఓ భారతీయులు స్పేస్లోకి వెళుతున్నారు. కానీ ఈసారి.. కౌంట్డౌన్ మనది, రాకెట్ మనది," అని మోదీ అన్నారు.
Gaganyaan mission launch date : 1988లో సోవియట్ యూనియన్ తరఫును.. వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ (రిటైర్డ్).. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.
"ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుతున్న సమయంలో.. గగన్యాన్ మిషన్ జరుగుతుండటం.. అంతరిక్షణ రంగాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది," అని మోదీ అభిప్రాయపడ్డారు.
Gaganyaan mission astronauts : అంతర్జాతీయ ఏజెన్సీల వద్ద ఉన్న కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో పాటు భారత దేశంలోని నిపుణులు, పరిశ్రమ ఎక్స్పీరియెన్స్, అకాడమియా సామర్థ్యాలు, పరిశోధనా సంస్థల నైపుణ్యాలను వినియోగించుకుంటూ.. గగన్యాన్ కోసం ముందుకు వెళుతోంది ఇస్రో.
సంబంధిత కథనం