Aero India 2023 : ఏరో ఇండియా 14వ ఎడిషన్​ను ప్రారంభించిన మోదీ-pm modi inaugurates aero india 2023 in bengaluru ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Pm Modi Inaugurates Aero India 2023 In Bengaluru

Aero India 2023 : ఏరో ఇండియా 14వ ఎడిషన్​ను ప్రారంభించిన మోదీ

Sharath Chitturi HT Telugu
Feb 13, 2023 10:40 AM IST

Bengaluru Aero India 2023 : ఏరో ఇండియా 2023ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఐదు రోజుల పాటు ఈ ఈవెంట్​ జరగనుంది.

ఏరో ఇండియా 2023 ఈవెంట్​లో మోదీ
ఏరో ఇండియా 2023 ఈవెంట్​లో మోదీ (ANI)

Aero India 2023 inuaguration : బెంగళూరు వేదికగా.. ఏరో ఇండియా 2023 ఈవెంట్​ను సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశీయంగా రూపొందించిన పరికరాలు, టెక్నాలజీతో పాటు ప్రపంచ దేశాలతో భారత్​కు ఉన్న భాగస్వామ్యాన్ని చాటిచెప్పే విధంగా ఈ ఈవెంట్​లో ప్రదర్శనలు ఉండనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఈ నేపథ్యంలో నవ భారత శక్తి గురించి మాట్లాడారు మోదీ.

"నవ భారత సామర్థ్యాలకు బెంగళూరు సాక్ష్యంగా నిలుస్తోంది. నవ భారతానికి ఆకాశమే హద్దు అని రుజువవుతోంది. ఈ రోజున.. మన దేశం నూతన శిఖరాలను అందుకోవడంతో పాటు దాటుకుని ముందుకు పరుగులు తీస్తోంది. డిఫెన్స్​ కంపెనీలకు మార్కెట్​గా ఈరోజున ఇండియా ఉంది. రక్షణ భాగస్వామ్యం అంశంలో భారత్​కు ఎంతో శక్తి ఉంది. ఎయిరో ఇండియా అనేది నవ భారత విధానాలకు చిహ్నం. ఒకప్పుడు ఇది కేవలం ఒక షోగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈరోజున ఇది కేవలం ఒక ఈవెంట్​ మాత్రమే కాదు. ఇది భారతదేశ శక్తిని చాటిచెప్పే వేదిక," అని అన్నారు మోదీ.

ఏరో ఇండియా 2023 నేపథ్యంలో ఎయిర్​ఫోర్స్​ చీఫ్​ మార్షెల్​ వీఆర్​ చౌదరి.. గురుకుల్​ ఫార్మేషన్​కు నాయకత్వం వహించారు. ఆకాశంలో విమానాలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

Aero India 2023 schedule : ఏరో ఇండియా ఈవెంట్​.. 5 రోజుల పాటు జరగనుంది. ఇది 14వ ఎడిషన్​ ఈసారి "ది రన్​వే టు ఎ​ బిలియన్​ ఆపర్చ్యునిటీస్​" అనే థీమ్​ను ఎంపిక చేసినట్టు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.

దేశీయ ఎంఎస్​ఎంఈలు, స్టార్టప్​లు.. అంతర్జాతీయ సప్లై- చెయిన్​ వ్యవస్థ మధ్య బంధాన్ని ధృఢపరిచేందుకు ఈ ఏరో ఇండియా 2023 ఉపయోగపడనుంది. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు, వివిధ ప్రొడక్టులను కలిసి రూపొందించడంలో భాగస్వామ్యం ఏర్పరచకునేందుకు ఈ ఈవెంట్​ పనికొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

80 దేశాలు.. 800కుపైగా సంస్థలు..

Aero India 2023 News Live Updates : ఈ ఈవెంట్​లో 80కిపైగా దేశాలు పాల్గొంటున్నాయి. 30 దేశాల మంత్రులు, 65 అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో పాటు ఇండియన్​ ఓఈఎమ్​ (ఒరిజినల్​ ఎక్విప్​మెంట్​ మేన్యుఫ్యాక్చరర్​)లు సైతం ఏరో ఇండియా 14వ ఎడిషన్​కు హాజరవుతారు. డిఫెన్స్​ విభాగంలోని 800కుపైగా కంపెనీలు ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. వీటిల్లో 100 విదేశీ కంపెనీలు, 700 దేశీయ సంస్థలు ఉన్నాయి.

ఎయిర్​బస్​, బోయింగ్​, డసాల్ట్​ ఏవియేషన్​, లాక్​హీడ్​ మార్టిన్​, ఇజ్రాయెల్​ ఏరోస్పేస్​ ఇండస్ట్రీ, బ్రహ్మోస్​ ఎయిరోస్పేస్​, ఆర్మీ ఏవియేషన్​, హెచ్​సీ రోబోటిక్స్​, ఎస్​ఏఏబీ, సాఫ్రాన్​, రోల్స్​ రాయిస్​, లార్సన్​ అండ్​ టుబ్రో, భారత్​ ఫోర్జ్​, హిందుస్థాన్​ ఎయిరోనాటిక్స్​ లిమిటెడ్​, బీఈఎల్​, బీడీఎల్​ వంటి సంస్థలు ప్రదర్శనలు చేయనున్నాయి.

Aero India 2023 live : డిఫెన్స్​, ఎయిరోస్పేస్​లో ఆత్మనిర్భరత సాధించే దిశగా ప్రధాని మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ ఏరో ఇండియా 2023 ఈవెంట్​కు ప్రాధాన్యత సంతరించుకుంది.

IPL_Entry_Point