Nepal plane crash : నేపాల్​లో నేలకూలిన విమానం.. 68మంది దుర్మరణం!-plane with 72 people on board crashes in nepal rescue operations underway ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Plane With 72 People On Board Crashes In Nepal Rescue Operations Underway

Nepal plane crash : నేపాల్​లో నేలకూలిన విమానం.. 68మంది దుర్మరణం!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 15, 2023 03:57 PM IST

Nepal plane crash : నేపాల్​లో ఓ విమానం నేలకూలింది. ఆ సమయంలో విమానంలో 72మంది ఉన్నారు. ఇప్పటివరకు 68 మంది మృతి చెందినట్టు సమాచారం.

నేపాల్​లో కూలిన విమానం
నేపాల్​లో కూలిన విమానం (Yeti airlines/ screenshot)

Nepal plane crash : నేపాల్​లో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పశ్చిమ నేపాల్​లోని పోఖారా నగరంలో పాత-నూతన అంతర్జాతీయ విమానాశ్రయాల మధ్యలో ఓ విమానం ఆదివారం ఉదయం నేలకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 68 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారని న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‍పీ రిపోర్ట్ చేసింది. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

అసలేం జరిగింది…?

నేలకూలిన విమానం దేశీయ విమానయాన సంస్థ యెటీ ఎయిర్​లైన్స్​కి చెందినది. నేపాల్​ రాజధాని కాట్మాండూ నుంచి పోఖారాకు వస్తున్న నేపథ్యంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ ఏటీఆర్​ 72 ఎయిర్​క్రాఫ్ట్​లో.. 68మంది ప్రయాణికులతో పాటు మొత్తం మీద 72మంది ఉన్నారు. ఈ ఘటనలో ప్రణాలతో మిగిలి ఉండటం కష్టమే అని తెలుస్తోంది.

Nepal plane crash today : ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసే పనిలోపడ్డారు.

సివిల్​ ఏవియేషన్​ అథారిటీ ఆఫ్​ నేపాల్​ ప్రకారం.. ఆదివారం ఉదయం 10:33 గంటలకు కాట్మాండూ నుంచి ఈ ఏటీఆర్​ 72 ఎయిర్​క్రాఫ్ట్ బయలుదేరింది. 25 నిమిషాల తర్వాత గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. టేకాఫ్​ అయిన 20 నిమిషాల తర్వాత.. పోఖారా విమానాశ్రయానికి సమీపంలోని సేతీ నది ఒడ్డున విమానం కుప్పకూలింది. ల్యాండింగ్​ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో 5 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటామని ప్రయాణికులు భావిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది.

Yeti airlines plane crash : నేలకూలిన వెంటనే విమానానికి మంటలు అంటుకున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. స్థానిక యంత్రాంగం.. మంటలను అదుపుచేసేందుకు శ్రమిస్తోంది. మంటల కారణంగా సహాయక చర్యలు మరింత ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది.

ఘటనపై సమాచారం అందుకున్న నేపాల్​ ప్రధానమంత్రి పుష్ప కమల్​ దహల్​ ప్రచండ.. అత్యవసర కేబినెట్​ సమావేశానికి పిలుపునిచ్చారు. ఘటనపై ప్రాథమిక నివేదికను సత్వరమే అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ప్రమాదాల అడ్డా.. నేపాల్​!

Yeti airlines pokhara plane crash : 'నేపాల్​లో విమాన ప్రయాణాలు చేయడం అంటే.. ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నట్టే!' అన్నట్టుగా అక్కడి పరిస్థితులు తయారయ్యాయి. విమాన సేవలు అత్యంత దారుణంగా ఉన్న దేశాల్లో నేపాల్​ ఒకటి. ఇక్కడ జరిగే ప్రమాదాల్లో ప్రతియేటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

2022 మేలో జరిగిన ఓ ప్రమాదంలో 22మంది ప్రాణాలు కోల్పోయారు. తారా ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ విమానం.. ఒక్కసారిగా కుప్పకూలింది. మృతుల్లో 16మంది నేపాలీలు, నలుగురు భారీతుయుల, ఇద్దరు జర్మన్​వాసులు ఉన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం