భారత​ యువకుడిని చిత్రహింసలు పెట్టిన చైనా సైన్యం!-pla beat up gave electric shocks to arunachal teen claims bjp mp ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Pla Beat Up, Gave Electric Shocks To Arunachal Teen, Claims Bjp Mp

భారత​ యువకుడిని చిత్రహింసలు పెట్టిన చైనా సైన్యం!

HT Telugu Desk HT Telugu
Feb 02, 2022 02:35 PM IST

Arunachal teen missing case | అరుణాచల్​ప్రదేశ్​ యువకుడిని చైనా సైన్యం కొట్టిందని, కరెంట్​ షాక్​ కూడా ఇచ్చిందని బీజేపీ ఎంపీ తాపిర్​ గావో ఆరోపించారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అభ్యర్థించారు. గత నెలలో అరుణాచల్​ప్రదేశ్​లో అదృశ్యమైన యువకుడిని చైనా పీఎల్​ఏ గుర్తించింది. అనంతరం అదే నెల 27న భారత సైన్యానికి అప్పగించింది.

తల్లిదండ్రులతో మిరాన్​ తారోన్​
తల్లిదండ్రులతో మిరాన్​ తారోన్​ (hindustan times)

China PLA India | ఈ నెల 18న అదృశ్యమైన అరుణాచల్​ప్రదేశ్​ యువకుడిని చైనా సైన్యం ఇటీవలే భారత్​కు అప్పగించింది. అయితే తమకు చిక్కిన భారత యువకుడిని చైనా సైనికులు చిత్రహింసలు పెట్టారని ఈశాన్య రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ తాపిర్​ గావో ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

"అరుణాచల్​ప్రదేశ్​ యువకుడు మిరామ్​ తారోన్​ను పీఎల్​ఏ కొట్టినట్టు, కరెంట్​ షాక్​ ఇచ్చినట్టు నాకు తెలిసింది. ఇది చాలా సీరియస్​ విషయం. కేంద్రం దీనిని తీవ్రంగా పరిగణించాలి. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి," అని గావో అభ్యర్థించారు.

అదృశ్యమయ్యాడా.. అపహరించారా?

జనవరి 18న.. అరుణాచల్​ప్రదేశ్​ షియాంగ్​లోని సియుంగ్లాలో మిరామ్​ తారోన్​ అనే 17ఏళ్ల యువకుడు అదృశ్యమయ్యాడు. అతడు అదృశ్యమైన ప్రాంతం.. వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉంటుంది. అయితే తారోన్​ అదృశ్యమవ్వలేదని, పీఎల్​ఏ(పిపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ) అతడిని అపహరించిందని బీజేపీ ఎంపీ తాపిర్​ గావో ఆరోపించారు.

ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన భారత సైన్యం.. పీఎల్​ఏను సంప్రదించింది. యువకుడి ఆచూకి కనుగొనేందుకు సహకరించాలని కోరింది. కొన్ని రోజుల తర్వాత.. ఓ వ్యక్తిని తమ భూభాగంలో గుర్తించినట్టు చైనా సమాచారం అందించింది. తదుపరి చర్యలు చేపట్టే ముందు.. తగిన వివరాలు అందించాలని స్పష్టం చేసింది. ఫలితంగా తారోన్​ వ్యక్తిగత వివరాలు, అతడి ఫొటోను పీఎల్​ఏకు అధికారులు ఇచ్చారు.

ఈ విషయంపై భారత సైన్యం- పీఎల్​ఏ మధ్య గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంభాషణ జరిగింది. యువకుడిని త్వరలోనే అప్పగిస్తామని పీఎల్​ఏ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరెన్​ రిజిజు ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

ఆ తర్వాతి రోజే.. తారోన్​ను చైనా భారత సైన్యానికి అప్పగించింది. అతడికి అన్ని వైద్య పరీక్షలు చేసి గత నెల 31న తల్లిదండ్రులకు అందజేసింది భారత సైన్యం.

IPL_Entry_Point

సంబంధిత కథనం