భారత యువకుడిని చిత్రహింసలు పెట్టిన చైనా సైన్యం!
Arunachal teen missing case | అరుణాచల్ప్రదేశ్ యువకుడిని చైనా సైన్యం కొట్టిందని, కరెంట్ షాక్ కూడా ఇచ్చిందని బీజేపీ ఎంపీ తాపిర్ గావో ఆరోపించారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అభ్యర్థించారు. గత నెలలో అరుణాచల్ప్రదేశ్లో అదృశ్యమైన యువకుడిని చైనా పీఎల్ఏ గుర్తించింది. అనంతరం అదే నెల 27న భారత సైన్యానికి అప్పగించింది.
China PLA India | ఈ నెల 18న అదృశ్యమైన అరుణాచల్ప్రదేశ్ యువకుడిని చైనా సైన్యం ఇటీవలే భారత్కు అప్పగించింది. అయితే తమకు చిక్కిన భారత యువకుడిని చైనా సైనికులు చిత్రహింసలు పెట్టారని ఈశాన్య రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ తాపిర్ గావో ఆరోపించారు.
"అరుణాచల్ప్రదేశ్ యువకుడు మిరామ్ తారోన్ను పీఎల్ఏ కొట్టినట్టు, కరెంట్ షాక్ ఇచ్చినట్టు నాకు తెలిసింది. ఇది చాలా సీరియస్ విషయం. కేంద్రం దీనిని తీవ్రంగా పరిగణించాలి. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి," అని గావో అభ్యర్థించారు.
అదృశ్యమయ్యాడా.. అపహరించారా?
జనవరి 18న.. అరుణాచల్ప్రదేశ్ షియాంగ్లోని సియుంగ్లాలో మిరామ్ తారోన్ అనే 17ఏళ్ల యువకుడు అదృశ్యమయ్యాడు. అతడు అదృశ్యమైన ప్రాంతం.. వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉంటుంది. అయితే తారోన్ అదృశ్యమవ్వలేదని, పీఎల్ఏ(పిపుల్స్ లిబరేషన్ ఆర్మీ) అతడిని అపహరించిందని బీజేపీ ఎంపీ తాపిర్ గావో ఆరోపించారు.
ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన భారత సైన్యం.. పీఎల్ఏను సంప్రదించింది. యువకుడి ఆచూకి కనుగొనేందుకు సహకరించాలని కోరింది. కొన్ని రోజుల తర్వాత.. ఓ వ్యక్తిని తమ భూభాగంలో గుర్తించినట్టు చైనా సమాచారం అందించింది. తదుపరి చర్యలు చేపట్టే ముందు.. తగిన వివరాలు అందించాలని స్పష్టం చేసింది. ఫలితంగా తారోన్ వ్యక్తిగత వివరాలు, అతడి ఫొటోను పీఎల్ఏకు అధికారులు ఇచ్చారు.
ఈ విషయంపై భారత సైన్యం- పీఎల్ఏ మధ్య గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంభాషణ జరిగింది. యువకుడిని త్వరలోనే అప్పగిస్తామని పీఎల్ఏ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఆ తర్వాతి రోజే.. తారోన్ను చైనా భారత సైన్యానికి అప్పగించింది. అతడికి అన్ని వైద్య పరీక్షలు చేసి గత నెల 31న తల్లిదండ్రులకు అందజేసింది భారత సైన్యం.
సంబంధిత కథనం