Pilots fall asleep : అటు పైలట్ల 'నిద్ర'- ఇటు 37వేల అడుగుల ఎత్తులో విమానం.. చివరికి!
Pilots fall asleep : ఆ విమానం 37వేల ఎత్తులో ప్రయాణిస్తోంది. సమీపంలోనే ఎయిర్పోర్టు ఉంది. రన్వేపై విమానం దిగాల్సి ఉంది. కానీ.. అలా జరగలేదు. రన్వే దాటుకుని వెళ్లిపోయింది. ఏటీసీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. పైలట్లను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించారు. కానీ పైలట్లు స్పందించలేదు. ఆ విమానంలో అసలేం జరిగింది? చివరికి విమానం పరిస్థితేంటి?
Pilots fall asleep : విమానాల్లో ఏ చిన్న తప్పు జరిగినా.. ప్రాణనష్టం అత్యంత తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా విమాన ప్రయాణం సాఫీగా జరగాలంటే పైలట్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది.. ఓ విమానం.. 37వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు.. అందులోని ఇద్దరు పైలట్లు నిద్రపోయారు!
ట్రెండింగ్ వార్తలు
సోమవారం.. సుడాన్లోని ఖార్టూమ్ నుంచి ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబాకు బయలుదేరింది ఇథయోపియన్ ఎయిర్లైన్స్ ఈటీ343. కాగా.. అందులో ఇద్దరు పైలట్లు నిద్రపోయారు. ఆడిస్ అబాబా విమనాశ్రయంలో ఆ విమానం దిగాల్సి ఉంది. రన్వే సమీపిస్తున్నా, విమానం కిందకి దిగలేదు. దీంతో ఎయిర్ ట్రఫిక్ కంట్రోల్(ఈఏసీ) సిబ్బంది ఆందోళన చెందారు. వెంటనే అలర్ట్ చేసేందుకు ప్రయత్నించారు. పైలట్లను సంప్రదించేందుకు తీవ్రంగా కృషి చేశారు. కానీ పైలట్ల నుంచి ఎలాంటి స్పందన లభించలేదు.
అయితే.. పైలట్లు పడుకునే సమయంలో ఆటోపైలట్ మోడ్ను ఆన్ చేసినట్టు తెలుస్తోంది. రన్వేదాటిన తర్వాత.. అది ఆఫ్ అయినట్టు, వెంటనే ఆలరం మోగినట్టు సమాచారం.
ఆ శబ్దానికి పైలట్లు నిద్ర నుంచి హఠాత్తుగా లేచి, ఏం జరిగిందో అర్థం చేసుకున్నారు. చివరికి.. 25నిమిషాల గందరగోళం తర్వాత.. విమానం.. రన్వైపై ల్యాండ్ అయ్యింది. అప్పడు అసలు విషయం బయటపడింది.
ఆ విమానం.. మరో ట్రిప్ వేసేందుకు 2.5గంటలు ఆలస్యమైంది.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు.
ఏడీఎస్-బీ(ఏవియేషన్ సర్వీలియన్స్ సిస్టం) కూడా ఈ ఘటనను ధ్రువీకరించింది. విమానం.. రన్వే దాటి వెళ్లిపోయిందని పేర్కొంది. ఇది చాలా ఆందోళనకర విషయం ఏవిషేయన్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇలా.. విమానంలో పైలట్లు నిద్రపోతున్న ఘటనలు కొత్తేమీ కాదు. మే నెలలో.. న్యూయార్క్ నుంచి రోమ్కు బయలుదేరిన ఓ విమానంలోనూ పైలట్లు పడుకుండిపోయారు. అప్పుడు ఆ విమానం 38వేల అడుగుల ఎత్తులో ఉంది.
సంబంధిత కథనం
టాపిక్