మంగళవారం 26 మంది భారతీయ పర్యాటకుల ప్రాణాలను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు బలిగొనడంతో, భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్ తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, అట్టారీ చెక్ పోస్టును మూసివేయడం వంటి కఠిన చర్యలను ప్రకటించింది. దాంతో, ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ ఏప్రిల్ 24-25 తేదీల్లో కరాచీ తీరంలో క్షిపణి పరీక్షను నిర్వహించనుంది. పాక్ చర్యలను భారత ఏజెన్సీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
కరాచీ తీరంలో ఏప్రిల్ 24-25 తేదీల్లో ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలో ఉపరితలం నుంచి ఉపరితలానికి క్షిపణి పరీక్ష నిర్వహించేందుకు పాకిస్థాన్ నోటిఫికేషన్ జారీ చేసిందని రక్షణ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ ఐ వార్తా సంస్థ తెలిపింది. సంబంధిత భారత ఏజెన్సీలు అన్ని పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రేరేపితమేనని భారత్ విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశంపై 5 కఠిన నిర్ణయాలు తీసుకుంది. అవి..
సంబంధిత కథనం