గంట కూడ గడవకముందే, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్; జమ్మూలో డ్రోన్ దాడులు-pak violates ceasefire once again within hours of agreement drone attacks in jammu air raid alert in barmer ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  గంట కూడ గడవకముందే, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్; జమ్మూలో డ్రోన్ దాడులు

గంట కూడ గడవకముందే, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్; జమ్మూలో డ్రోన్ దాడులు

Sudarshan V HT Telugu

భారత్, పాకిస్తాన్ ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఇరుదేశాలు ఎలాంటి కాల్పులు, దాడులకు పాల్పడకూడదు. కానీ, ఒప్పందం కుదిరి గంట కూడా గడవకముందే, పాకిస్తాన్ తన బుద్ధి చూపించుకుంది. జమ్మూపై డ్రోన్ దాడులకు పాల్పడింది.

పాక్ దాడుల ముప్పు ఉన్న ప్రాంతాల్లో బ్లాకౌట్ (HT_PRINT)

భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కాసేపటికే జమ్మూలోని ఉధంపూర్ పై పాకిస్తాన్ మరోసారి డ్రోన్ల దాడికి పాల్పడింది. మరోవైపు, శ్రీనగర్ లో పాక్ దాడుల హెచ్చరికతో శనివారం సాయంత్రం సైరన్లు, బ్లాక్అవుట్లకు దారితీసింది.

మళ్లీ అదే బుద్ధి

కాల్పుల విరమణకు ఏకపక్షంగా అభ్యర్థించిన పాకిస్తాన్, మళ్లీ పాత బుద్ధిని చూపించుకుంటూ, సరిహద్దు ప్రాంతాలపై దాడులకు తెగబడ్తోంది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలు అవగా, ఆ కాసేపటికే డ్రోన్ దాడులకు సిద్ధమైంది. పాక్ దాడుల ముప్పుతో రాజస్థాన్ లోని బార్మర్ లో ఎయిర్ రైడ్ అలర్ట్ తో పాటు జిల్లాలో అత్యవసర బ్లాక్అవుట్ ఎన్ ఫోర్స్ మెంట్ ను జారీ చేశారు. జమ్ముకశ్మీర్ లోని బారాముల్లా, బుద్గాం ప్రాంతాల్లోనూ కాల్పుల శబ్దాలు వినిపించాయి.

పాకిస్తాన్ దుర్భుద్ధి

ఒకవైపు, కాల్పుల విరమణను స్వాగతిస్తూనే, మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోంది. ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారంలో ఇది కొత్త ఆరంభాన్ని సూచిస్తుందని, శాంతి, సౌభాగ్యం, సుస్థిరత దిశగా ప్రయాణానికి సహాయపడుతుందని తమ దేశం విశ్వసిస్తోందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీష్ కాల్పుల విరమణ గురించి వ్యాఖ్యానించిన కొద్ది సేపటికే, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

ఒమర్ అబ్దుల్లా ట్వీట్

పాక్ కాల్పులు, దాడులపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి కూడా స్పందించారు. ఈ పేలుళ్ల గురించి ఎక్స్ లో పోస్ట్ చేశారు. 'కాల్పుల విరమణ ఏమైంది? శ్రీనగర్ అంతటా పేలుళ్ల శబ్దాలు!! అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.