27 విమానాశ్రయాల మూసివేత - మూసివేసిన భారతీయ విమానాశ్రయాల జాబితా ఇదే..-over 400 flights cancelled 27 airports shut which indian airports are closed ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  27 విమానాశ్రయాల మూసివేత - మూసివేసిన భారతీయ విమానాశ్రయాల జాబితా ఇదే..

27 విమానాశ్రయాల మూసివేత - మూసివేసిన భారతీయ విమానాశ్రయాల జాబితా ఇదే..

Sudarshan V HT Telugu

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ ల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాంతో, సరిహద్దుకు సమీపంలో ఉన్న పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. సుమారు 27 ఏర్ పోర్ట్ లను మూసేశారు. 400 లకు పైగా విమానాలను రద్దు చేశారు.

27 విమానాశ్రయాలు మూసివేత

మే 7, బుధవారం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు క్షిపణి దాడులను చేసిన నేపథ్యంలో, భారత్ లో 430 విమానాలను రద్దు చేశారు. ఉత్తర, పశ్చిమ మరియు మధ్య భారతదేశంలోని 27 విమానాశ్రయాలను మే 10, శనివారం వరకు మూసివేశారు. ఎయిరిండియా, ఇండిగో, స్పైస్ జెట్, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్, అకాసా ఎయిర్, పలు విదేశీ విమానయాన సంస్థలు ఈ విమానాశ్రయాలకు రాకపోకలు సాగించే సర్వీసులను రద్దు చేసుకున్నాయి.

430 విమానాల రద్దు

భారత విమానయాన సంస్థలు గురువారం మొత్తం 430 విమానాలను రద్దు చేశాయి. మరోవైపు, చాలా అంతర్జాతీయ విమానయాన సంస్థలు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించడం నిలిపివేసి, బదులుగా ముంబై, అహ్మదాబాద్ మీదుగా విమానాలను ‘రీ రూట్’ చేయడానికి ఎంచుకున్నాయి.

ఈ విమానాశ్రయాల మూసివేత

శ్రీనగర్, జమ్మూ, లేహ్, చండీగఢ్, అమృత్ సర్, లుధియానా, పాటియాలా, బటిండా, హల్వారా, పఠాన్ కోట్, భుంతర్, సిమ్లా, గగ్గల్, ధర్మశాల, కిషన్ గఢ్, జైసల్మేర్, జోధ్ ఫూర్, బికనీర్, ముంద్రా, జామ్ నగర్, రాజ్ కోట్, పోర్ బందర్, కాండ్లా, కేశోద్, భుజ్, గ్వాలియర్, హిందాన్ విమానాశ్రయాలను మే 10, శనివారం వరకు తాత్కాలికంగా వాణిజ్య విమానాల రాకపోకలకు మూసివేశారు.

ఆపరేషన్ సిందూర్

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై సాయుధ దళాలు క్షిపణి దాడులు చేసిన రోజునే భారత గగనతలం గుండా విమానాలు పాకిస్తాన్ లోకి ప్రవేశించడానికి అనుమతించే సుమారు 25 విమాన మార్గాలను భారత్ బుధవారం మూసివేసింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.