ఆపరేషన్ సిందూర్ తరువాత ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలో విమాన ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. 300 విమానాలు రద్దు చేశారు. 25 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు.
భద్రత, గగనతల పరిమితుల కారణంగా, బుధవారం సాయంత్రానికి భారతదేశంలోని 25 ప్రధాన విమానాశ్రయాలు మూసివేశారు. మే 9 వరకు కార్యకలాపాలు నడవని భారతదేశంలోని 25 విమానాశ్రయాల జాబితా ఇక్కడ చూడొచ్చు.
1. చండీగఢ్
2. శ్రీనగర్
3. అమృత్సర్
4. లూథియానా
5. భుంటార్
6. కిషన్గఢ్
7. పటియాలా
8. షిమ్లా
9. గగ్గల్
10. భటిండా
11. జైసల్మేర్
12. జోధ్పూర్
13. బికానీర్
14. హల్వారా
15. పఠాన్కోట్
16. జమ్మూ
17. లేహ్
18. ముంద్రా
19. జామ్నగర్
20. రాజ్కోట్
21. పోర్బందర్
22. కాండ్లా
23. కేశోడ్
24. భుజ్
25. థోయిస్
ఇండిగో మొత్తం 165 విమానాలను రద్దు చేయడంతో ఎక్కువగా ప్రభావితమైంది. ఎయిర్లైన్ ప్రతినిధి మాట్లాడుతూ, "గగనతల పరిమితులపై ప్రభుత్వ నోటిఫికేషన్ కారణంగా, బహుళ విమానాశ్రయాల నుండి 165 కంటే ఎక్కువ ఇండిగో విమానాలు మే 10, 2025 ఉదయం 0529 గంటల వరకు రద్దయ్యాయి." అని వివరించారు.
జమ్మూ, శ్రీనగర్, లేహ్ మరియు అమృత్సర్తో సహా అనేక నగరాలకు ఎయిర్ ఇండియా సేవలను నిలిపివేసింది.
ఇండిగో మరియు ఎయిర్ ఇండియా రెండూ ప్రభావిత ప్రయాణికులకు రీషెడ్యూలింగ్ ఛార్జీలపై మినహాయింపులు లేదా పూర్తి రిఫండ్ను అందిస్తున్నాయి.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ‘X’లో ఒక పోస్ట్లో, “మేం అమృత్సర్, గ్వాలియర్, జమ్మూ, శ్రీనగర్, హిండన్లకు పూర్తి రీఫండ్ లేదా ఉచిత రీషెడ్యూలింగ్ను మే 10, 2025 ఉదయం 05:30 గంటల వరకు అందిస్తున్నాం.” అని తెలిపింది.
ధర్మశాల, లేహ్, జమ్మూ, శ్రీనగర్ మరియు అమృత్సర్తో సహా ఉత్తర భారతదేశంలోని విమానాశ్రయాలు తదుపరి నోటీసు వచ్చే వరకు మూసిఉంటాయని స్పైస్జెట్ సోషల్ మీడియాలో ధృవీకరించింది.
అకాశ ఎయిర్, స్టార్ ఎయిర్ కూడా ఉత్తరాన ఉన్న అనేక గమ్యస్థానాలకు తమ సేవలను రద్దు చేశాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా అనేక విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది.
ఢిల్లీ విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. ఇక్కడ అర్ధరాత్రి నుండి కనీసం 140 విమానాలు రద్దయ్యాయి. రెండు అంతర్జాతీయ సర్వీసులు కూడా రద్దయ్యాయని PTI వార్తా సంస్థ తెలిపింది.
అమెరికన్ ఎయిర్లైన్స్, ఖతార్ ఎయిర్వేస్తో సహా విదేశీ విమానయాన సంస్థలు కూడా కొన్ని కార్యకలాపాలను నిలిపివేశాయి. పాకిస్తాన్ గగనతలం మూసివేసినందున పాకిస్తాన్కు విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఖతార్ ఎయిర్వేస్ తెలిపింది.
భారత దళాలు సరిహద్దులోని ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు చేసిన తరువాత 25 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలు పాకిస్తాన్ గగనతలాన్ని తప్పించుకోవడానికి దారి మళ్లింపు ఎదుర్కొన్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.
అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు ముందు జాగ్రత్తగా పాకిస్తాన్ మీదుగా తమ మార్గాలను నిలిపివేశాయి. డచ్ విమానయాన సంస్థ KLM ప్రతినిధి మాట్లాడుతూ, తదుపరి నోటీసు వచ్చే వరకు పాకిస్తాన్ మీదుగా విమానాలు నడపడం లేదని ధృవీకరించారు. సింగపూర్ ఎయిర్లైన్స్ కూడా మే 6 నుండి పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించడం ఆపివేసినట్లు పేర్కొంది.