Wed, 07 May 202510:27 AM IST
సాయంత్రం 4 గంటలకు దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ప్రారంభం
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా మే 7 బుధవారం భారత్ లోని 244 జిల్లాల్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. సమర్థవంతమైన పౌర రక్షణ కోసం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని హోం మంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలను కోరింది. ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్ల అమలు, శత్రుదేశం దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి పౌర రక్షణ అంశాలపై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం వంటి చర్యలు చేపట్టనున్నారు.
Wed, 07 May 202509:07 AM IST
సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా కీలక సమావేశం
పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం పాకిస్తాన్, నేపాల్ సరిహద్దుల్లోని భారతీయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. అమిత్ షా నిర్వహించిన సమావేశానికి జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, సిక్కిం, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో పాటు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ హాజరయ్యారు.
Wed, 07 May 202508:28 AM IST
రేపు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మే 8వ తేదీ గురువారం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. 2025 మే 8న ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని కమిటీ రూమ్: జీ-074లో అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసిన మరుసటి రోజే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించడం గమనార్హం.
Wed, 07 May 202508:26 AM IST
‘‘భారత్ వెనక్కు తగ్గితే.. ఉద్రిక్తతలు తొలగుతాయి’’- పాకిస్తాన్
ఆపరేషన్ సింధూర్ అనంతరం పాక్ స్వరం మార్చింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తొలగాలంటే భారత్ వెనక్కు తగ్గాలని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవజా ఆసిఫ్ బుధవారం కోరారు. "మేము భారతదేశం పట్ల ఎటువంటి ప్రతికూల చర్య తీసుకోబోమని గత పక్షం రోజులుగా చెబుతున్నాము. కానీ మాపై దాడి జరిగితే, మేము ప్రతిస్పందిస్తాము. భారతదేశం వెనక్కి తగ్గితేనే ఈ ఉద్రిక్తతలు తగ్గుతాయి" అని ఆసిఫ్ అన్నారు.
Wed, 07 May 202507:44 AM IST
కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
భారత్ పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై విజయవంతంగా దాడులు చేసిన నేపథ్యంలో, బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఈ ‘ఆపరేషన్ సింధూర్’ దాడులను విజయవంతం చేసిన త్రివిధ దళాలకు శుభాకాంక్షలు తెలిపారు. పాక్ ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన ఈ ఆపరేషన్ సింధూర్ భారతీయులందరూ గర్వపడే విషయమన్నారు.
Wed, 07 May 202507:34 AM IST
‘భారతీయురాలిగా గర్వించే క్షణాలు’
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కేరళ వాసి రామచంద్రన్ కుమార్తె ఆరతి మెనన్ స్పందించారు. పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసిన విషయం తెలియగానే భారతీయురాలిగా గర్వించానని వ్యాఖ్యానించారు. ఉదయం లేవగానే ఆ వార్త విని ఎంతో ఊరట చెందానన్నారు. ఉగ్రవాదులు ఎందరో మహిళల సింధూరాన్ని చెరిపేస్తున్న నేపథ్యంలో.. ఈ ఆపరేషన్ కు ‘సింధూర్’ అని పేరు పెట్టడం సముచితమన్నారు. పహల్గామ్ లో ఆమె కళ్లముందే ఆమె తండ్రి రామచంద్రన్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు.
Wed, 07 May 202507:20 AM IST
భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పై ట్రంప్ ఏమన్నారు?
పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. తనకు ఆ విషయం ఇప్పుడే తెలిసిందని, ఇలాంటిదేదో జరగబోతోందని తాము ముందే ఊహించామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఘర్షణ త్వరగా ముగియాలని ఆకాంక్షించారు. భారత్, పాక్ ల మధ్య దశాబ్దాలుగా ఈ శత్రుత్వం ఉందన్నారు.
Wed, 07 May 202507:01 AM IST
భారత్ దాడుల్లో మృతుల సంఖ్యపై పాక్ స్పందన
పహల్గామ్ ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడులపై పాకిస్తాన్ స్పందించింది. భారత్ దాడుల్లో 26 మంది చనిపోయారని, మరో 14 మంది గాయపడ్డారని ప్రకటించింది.
Wed, 07 May 202506:57 AM IST
హైదరాబాద్లో మాక్ డ్రిల్..
హైదరాబాద్లోని సికింద్రబాద్లో ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఎన్సీసీ డైరెక్టరేట్లో ఎన్సీసీ కాడెట్స్ మాక్ డ్రిల్ని నిర్వహిస్తుంది. పాకిస్థాన్తో ఉద్రిక్తతల వేళ యుద్ధ సన్నద్ధకు ఇది దోహదపడనుంది.
Wed, 07 May 202506:50 AM IST
ఆపరేషన్ సిందూర్ live updates : 'మాకు యుద్ధం వద్దు'
ఆపరేషన్ సిందూర్పై జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు.
“పహల్గామ్లో 26 మంది అమాయకుల ప్రాణాలు పోయాయి. ప్రభుత్వ సరైన సమాధానం ఇస్తుందని చెప్పింది. ఇదై సరైన సమాధానం. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేశారు. మిలిటరీ స్థావరాలను కాదు. వాళ్లే ఇది మొదలుపెట్టింది. మనము కాదు. మేము శాంతియుతంగా జీవిస్తున్నాము. మాకు యుద్ధం వద్దు. పరిస్థితులు మళ్లీ మెరుగుపడాలి. కానీ ముందు పాకిస్థాన్ ఆయుధాలను విడిచిపెట్టాలి,” అని అన్నారు.
Wed, 07 May 202506:27 AM IST
ఆపరేషన్ సిందూర్ live updates : అజర్కి కోలుకోలేని దెబ్బ?
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు, కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజర్కి చెందిన 14మంది కుటుంబసభ్యులు మరణించారని వార్తలు వస్తున్నాయి. మసూద్ సోదరుడు- మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రౌఫ్ అస్గార్ కుమారుడు ఈ దాడుల్లో మరణించాడని సమాచారం. అంతేకాదు, రౌఫ్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.
Wed, 07 May 202506:21 AM IST
ఆపరేషన్ సింధూర్ live updates : తెలంగాణ సీఎం సమీక్ష
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష
ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇతర సంబంధిత వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి.
ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్కకు సీఎం రేవంత్ ఫోన్. తక్షణం బయలుదేరి హైదరాబాద్ రావాల్సిందిగా సూచన.
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశ రక్షణలో హైదరాబాద్ వ్యూత్మక ప్రాంతంగా ఉన్నందున, డిఫెన్స్ విభాగాలకు స్థావరంగా ఉన్నందున తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా అన్నీ విభాగాలకు సీఎం దిశానిర్ధేశం.
ఈ రోజు సాయంత్రం జరిగే మాక్ డ్రిల్ని స్వయంగా పర్యవేక్షించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Wed, 07 May 202506:16 AM IST
ఆపరేషన్ సిందూర్ live updates : 25 నిమిషాల్లో ఖేల్ ఖతం..!
ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసింది. అయితే ఈ ప్రక్రియ మొత్తం 25 నిమిషాల్లో పూర్తైంది! అర్థరాత్రి 1:05 నుంచి 1:0 వరకు ఈ ఆపరేషన్ కొనసాగింది. 25 నిమిషాల్లో ఉగ్రవాద సంస్థలు కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.
Wed, 07 May 202505:57 AM IST
ఆపరేషన్ సిందూర్ live updates : ఇద్దరు మహిళా అధికారుల మీడియా బ్రీఫింగ్..
ఆపరేషన్ సిందూర్పై ఆర్మీ బ్రీఫింగ్లో ఇద్దరు మహిళా అధికారులు పాల్గొన్నారు. వారు.. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి. పాక్పై దాడి చేయాల్సిన కారణాలు, ఎంచుకున్న ఉగ్రస్థావారాలు, భారత్కు వ్యతిరేకంగా వాటిలో జరుగుతున్న కార్యకలాపాల గురించి వివరించారు.
Wed, 07 May 202507:21 AM IST
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, మీడియా బ్రీఫింగ్..
లష్కర్ తోయిబా అనుబంధ భారతీయ పర్యాటకులపై దాడులు చేసి 25మంది భారతీయులు, ఒక నేపాల్ జాతీయుడిని కాల్చి చంపారు.
ఏప్రిల్ 22న పాకిస్థా, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్ర దాడికి పాల్పడ్డారు. పహల్గామ్లో జరిగిన దాడి అత్యంత పాశవికమైనది. అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల దాడులతో మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గత ఏడాది 22లక్షల మంది పర్యాటకులు జమ్మూకశ్మీర్ను సందర్శించారు. జమ్మూ కశ్మీర్తో పాటు దేశంలో మత కల్లోలాలను సృష్టించే లక్ష్యంతో ఈ దాడులు జరిగాయి. పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా ఈ దాడుల వెనుక ఉంది. జమ్మూ కాశ్మీర్లో అలజడి సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. జమ్మూ కాశ్మీర్లో అభివృద్ది కార్యక్రమాలను నిరోధించే లక్ష్యంతో ఉగ్రదాడులకు పాల్పడ్డారు.
లష్కరే తోయిబా సోషల్ మీడియా ఖాతాల ద్వారా వారి ప్రమేయాన్ని గుర్తించాము. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దాడులకు పాల్పడిన వారిని గుర్తించాము. పాకిస్థాన్కు ఉన్న దీర్ఘ కాలిక చరిత్ర నేపథ్యంలో తాజా దాడులతో ఆ దేశానికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి.
ఉగ్రవాదులకు ఆర్ధిక సాయం అందించడం నుంచి దేశంలో జరిగిన అనే క దాడులకు పాకిస్థాన్ ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందించింది. తాజా దాడుల నేపథ్యంలో దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. దాడుల తర్వాత కూడా ఉగ్రవాద చర్యలకు పాకిస్థాన్ సహకారాన్ని కొనసాగించింది. ఉగ్రవాద శిబిరాలను కొనసాగించింది. ఈ క్రమంలో దేశాన్ని కాపాడుకోవడానికి, భవిష్యత్తులో జరిగే ఉగ్ర దాడుల నుంచి కాపాడుకోడానికి తెల్లవారుజామున భారత్ నిర్దేశిత లక్ష్యాలపై దాడులు చేసింది.
Wed, 07 May 202505:22 AM IST
ఆపరేషన్ సిందూర్ Live Updates: భారత సైన్యం కీలక ప్రకటన..
ఆపరేషన్ సిందూర్పై భారత సైన్యం కీలక మీడియా సమావేశాన్ని నిర్వహిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తులో పాకిస్థాన్ కు సంబంధం ఉన్నట్లు తేలిందని దేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు.
Wed, 07 May 202505:08 AM IST
చైనా స్పందన ఇలా..
“ఈ ఉదయం భారతదేశం తీసుకున్న సైనిక చర్యలను చైనా చింతిస్తోంది. ప్రస్తుత పరిణామాల గురించి ఆందోళన చెందుతోంది. అన్ని రకాల ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకిస్తుంది. శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రశాంతంగా సంయమనంతో ఉండాలని, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని మేము భారత్, పాకిస్థాన్లను కోరుతున్నాము," అని తన విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ప్రకటనలో చైనాలో ఇలా పేర్కొంది.
Wed, 07 May 202504:54 AM IST
ఆపరేషన్ సిందూర్ live updates : 70మంది హతం!
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ జరిపిన దాడులకు 70మంది మరణించారని సమాచారం. మరో 60మంది గాయపడ్డారని తెలుస్తోంది.
Wed, 07 May 202504:28 AM IST
ఆపరేషన్ సిందూర్ live updates : ఎల్ఓసీ దగ్గర రక్తపాతం
ఆపరేషన్ సిందూర్ వేళ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పుల మోత మోగించింది. ఫలితంగా 10మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
Wed, 07 May 202504:13 AM IST
ఆపరేషన్ సిందూర్ : చెప్పి మరీ దాడి చేసిన సైన్యం
మే 7 తెల్లవారుజామున 1:26 గంటలకు ఎక్స్లో ఒక వీడియోతో కూడిన ట్వీట్ చేసింది ఇండియన్ ఆర్మీ. 'రెడీ టు స్ట్రైక్, ట్రైన్డ్ టు విన్' (దాడి చేయడానికి సిద్ధం, శిక్షణ తీసుకుంది గెలవడానికే) అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఈ వీడియోలో భారత సైనికులు ఆయుధాలను లోడ్ చేస్తుండటం కనిపిస్తోంది. ట్యాంకర్లు దూసుకెళ్లడాన్ని మనం చూడవచ్చు. "నా సోదరుడు- సోదరీమణుల బాధ నిన్ను వెంటాడుతుంది," అని బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వినిపిస్తుంది. "నిరంతరం సిద్ధం, నిరంతరం విజయం," అన్న మెసేజ్తో ఆ వీడియో ముగుస్తుంది.
ఈ వీడియో పెట్టిన కొద్దిసేపటికి, అంటే 1:44 గంటలకు భారత సైన్యం, వాయుసేన, నౌక దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ని చేపట్టాయి.
Wed, 07 May 202504:08 AM IST
ఆపరేషన్ సిందూర్ Live Updates : విమాన సేవలు బంద్!
ఆపరేషన్ సిందూర్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఆపరేషన్ సిందూర్ అనంతరం అనేక విమానాశ్రయాలు మూతపడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆపరేషన్ సిందూర్లో భారత్ టార్గెట్ చేసిన ఉగ్ర స్థావరాల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Wed, 07 May 202504:06 AM IST
ఆపరేషన్ సిందూర్ Live Updates: భారత్ ప్రకటన
"మొత్తం 9 స్థావరాలను టార్గెట్ చేశాము. ఇందులో ఎలాంటి పాకిస్థాన్ మిలిటరీ స్థావరం లేదు. మా చర్యలు ఫోకస్డ్గా, అన్ని విషయాలను పరిగణించి చేపట్టినవి. ఉద్రిక్తతలు పెంచే విధంగా మా చర్యలు లేవు. ఆయా స్థావరాలను ఎంచుకుని, టార్గెట్ చేయడంతో మేము మా నిగ్రహాన్ని చూపించాము," అని ఇండియా తన స్టేట్మెంట్లో పేర్కొంది.
Wed, 07 May 202504:05 AM IST
ఆపరేషన్ సిందూర్ Live Updates : పహల్గామ్కి ప్రతీకారం..
గత నెలలో కశ్మీర్లోని పహల్గామ్లోకి చొరబడిన ఉగ్రవాదులు 26 మందిని చంపేశారు. అనంతరం భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారత్ అనేక చర్యలు చేపట్టింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం నుంచి మిలిటరీ యాక్షన్ కోసం యావత్ భారత దేశం ఎదురుచూసింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ని చేపట్టింది భారత్.
Wed, 07 May 202504:04 AM IST
ఆపరేషన్ సిందూర్ Live Updates : ప్రతీకారం తీర్చుకున్న భారత సైన్యం
పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్థరాత్రి- బుధవారం తెల్లవారుజామున జరిగిన ఆపరేషన్ ‘సిందూర్’లో భాగంగా పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది.