చైనా నుంచి పాకిస్థాన్ కొనుగోలు చేసిన క్షిపణి నిరోధక వ్యవస్థ పని చేయలేదని వార్తలు వస్తున్నాయి. చైనా బాగా ప్రచారం చేసిన HQ-9, HQ16 ప్లాట్ఫామ్లలోని తీవ్రమైన లోపాల గురించి చర్చ జరుగుతోంది.
చైనాకు చెందిన HQ16 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రాడర్లు, బ్యాటరీలను పాకిస్థాన్ ఎప్పుడో కొనుగోలు చేసింది. ఈ HQ16 అనేది చైనా తయారు చేసిన క్షిపణి నిరోధక వ్యవస్థ. అయితే భారత్ చేసిన దాడుల సందర్భంగా HQ16 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దాడి సమయంలో ఈ వ్యవస్థ ఎలా స్పందిస్తుందో భారత్ అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో వచ్చిన సమాచారం ఆధారంగా మరిన్ని దాడులు చేసేందుకు ఆస్కారం ఉంటుంది.
పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం కచ్చితమైన దాడులను చేసింది. ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ సుమారు 24 క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లు ప్రయోగించింది. అయితే వీటిలో ఒక్క దానిని కూడా పాకిస్థాన్ అడ్డుకోలేదు.
భారత్కు చెందిన క్షిపణులు పాకిస్థాన్ గగనతలం మీదుగా గుర్తించబడకుండా ప్రయాణించాయి. అవి ఖచ్చితత్వంతో దాడి చేశాయి. ఒక్క క్షిపణిని కూడా పాక్ అడ్డుకోలేదు.
పాకిస్థాన్ గగనతలాన్ని HQ-9, HQ-16 వైమానిక రక్షణ వ్యవస్థలు కాపాడుతున్నాయని చెబుతారు. HQ-9 గాలిలో ముప్పు గుర్తించి అడ్డుకోగలదని చైనా మార్కెటింగ్ చేసింది.
భారతదేశం అధునాతన ఎలక్ట్రానిక్ యుద్ధ పద్ధతులను ఉపయోగించడం... డెకాయిలు, సిగ్నల్ అణచివేత, రాడార్ జామింగ్ వంటివి కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. భారతదేశం ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడమే కాదు.. పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ ఎలా ఉందో ప్రపంచానికి చూపేట్టినట్టైంది.