పహల్గామ్ ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే.. "రెడీ టు స్ట్రైక్," అంటూ భారత సైన్యం ఈ దాడులకు ముందు ఒక ట్వీట్ చేయడం. అంటే.. భారత సైన్యం చెప్పి మరీ చేసింది!
మే 7 తెల్లవారుజామున 1:26 గంటలకు ఎక్స్లో ఒక వీడియోతో కూడిన ట్వీట్ చేసింది ఇండియన్ ఆర్మీ. 'రెడీ టు స్ట్రైక్, ట్రైన్డ్ టు విన్' (దాడి చేయడానికి సిద్ధం, శిక్షణ తీసుకుంది గెలవడానికే) అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఈ వీడియోలో భారత సైనికులు ఆయుధాలను లోడ్ చేస్తుండటం కనిపిస్తోంది. ట్యాంకర్లు దూసుకెళ్లడాన్ని మనం చూడవచ్చు. "నా సోదరుడు- సోదరీమణుల బాధ నిన్ను వెంటాడుతుంది," అని బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వినిపిస్తుంది. "నిరంతరం సిద్ధం, నిరంతరం విజయం," అన్న మెసేజ్తో ఆ వీడియో ముగుస్తుంది.
ఈ వీడియో పెట్టిన కొద్దిసేపటికి, అంటే 1:44 గంటలకు భారత సైన్యం, వాయుసేన, నౌక దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ని చేపట్టాయి.
సోషల్ మీడియాలో వైరల్గా మారిన భారత సైన్యం వీడియోని ఇక్కడ చూడండి
"కొంతసేపటి క్రితమే భారత సాయుద దళాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టాయి. పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి," అని అధికారిక స్టేట్మెంట్ వచ్చింది.
ఈ ఆపరేషన్ పేరు కూడా చాలా ఆసక్తికరంగా మారింది. హిందూ మహిళలు నుదుటన పెట్టుకునే కుంకుమను సిందూర్ అంటారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మతం గురించి అడిగి మరీ పురుషులను ఉగ్రవాదులు చంపేశారు. వారి భార్యలను విడిచిపెట్టారు. నాటి ఉగ్రదాడిలో సర్వం కోల్పోయిన మహిళలను ఉద్దేశించి ఈ ఆపరేషన్కి 'సిందూర్' అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది.
"బహవల్పూర్, మురీడ్కేలోని లష్కే తోయిబా, జైషే మహమ్మద్ హెడ్క్వార్టర్స్ని టార్గెట్ చేశారు. మిసైల్ దాడులు జరిగాయి," అని ఓ అధికారి వివరించారు. ఈ ఆపరేషన్ కోసం స్టాండాఫ్ క్రూయిజ్ మిసైళ్లను ఉపయోగించినట్టు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యంతో పాటు నేవీ, వాయు సేనకు చెందిన ఆయుధ వ్యవస్థలు పాల్గొన్నాయి. టార్గెట్ల కోసం ఎదురుచూసి, ఎదురుచూసి దాడులు చేసే సూసైడ్ డ్రోన్స్ (లాయిటరీ మునిషన్స్)ని కూడా ఈ ఆపరేషన్లో వినియోగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం
టాపిక్