ఆపరేషన్​ సిందూర్​ : చెప్పి మరీ దాడి చేసిన భారత సైన్యం! వీడియో వైరల్​..-operation sindoor indian army posted ready to strike video minutes before pakistan strikes ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఆపరేషన్​ సిందూర్​ : చెప్పి మరీ దాడి చేసిన భారత సైన్యం! వీడియో వైరల్​..

ఆపరేషన్​ సిందూర్​ : చెప్పి మరీ దాడి చేసిన భారత సైన్యం! వీడియో వైరల్​..

Sharath Chitturi HT Telugu

ఆపరేషన్​ సిందూర్​ పేరుతో పాకిస్థాన్​, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్​ దాడి చేసింది. కాగా, ఈ ఆపరేషన్​కి కొద్దిసేపటి ముందే సోషల్​ మీడియాలో సైన్యం ఒక వీడియో పెట్టింది. ‘రెడీ టు స్ట్రైక్​’ అని ఆ వీడియో క్యాప్షన్​ చెబుతోంది. అంటే భారత సైన్యం చెప్పి మరీ దాడి చేసినట్టు !

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ముజాఫరాబాద్​ (HT_PRINT)

పహల్గామ్​ ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్​తో పాటు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఇక్కడ హైలైట్​ విషయం ఏంటంటే.. "రెడీ టు స్ట్రైక్​," అంటూ భారత సైన్యం ఈ దాడులకు ముందు ఒక ట్వీట్​ చేయడం. అంటే.. భారత సైన్యం చెప్పి మరీ చేసింది!

ఆపరేషన్​ సిందూర్​- ఆ ట్వీట్​లో ఏముంది?

మే 7 తెల్లవారుజామున 1:26 గంటలకు ఎక్స్​లో ఒక వీడియోతో కూడిన ట్వీట్​ చేసింది ఇండియన్​ ఆర్మీ. 'రెడీ టు స్ట్రైక్​, ట్రైన్డ్​ టు విన్​' (దాడి చేయడానికి సిద్ధం, శిక్షణ తీసుకుంది గెలవడానికే) అంటూ క్యాప్షన్​ ఇచ్చింది.

ఈ వీడియోలో భారత సైనికులు ఆయుధాలను లోడ్​ చేస్తుండటం కనిపిస్తోంది. ట్యాంకర్లు దూసుకెళ్లడాన్ని మనం చూడవచ్చు. "నా సోదరుడు- సోదరీమణుల బాధ నిన్ను వెంటాడుతుంది," అని బ్యాక్​గ్రౌండ్​లో ఒక వాయిస్​ వినిపిస్తుంది. "నిరంతరం సిద్ధం, నిరంతరం విజయం," అన్న మెసేజ్​తో ఆ వీడియో ముగుస్తుంది.

ఈ వీడియో పెట్టిన కొద్దిసేపటికి, అంటే 1:44 గంటలకు భారత సైన్యం, వాయుసేన, నౌక దళాలు సంయుక్తంగా ఆపరేషన్​ సిందూర్​ని చేపట్టాయి.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన భారత సైన్యం వీడియోని ఇక్కడ చూడండి

"కొంతసేపటి క్రితమే భారత సాయుద దళాలు ఆపరేషన్​ సిందూర్​ చేపట్టాయి. పాకిస్థాన్​తో పాటు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి," అని అధికారిక స్టేట్​మెంట్​ వచ్చింది.

ఆపరేషన్​ సిందూర్​..

ఈ ఆపరేషన్​ పేరు కూడా చాలా ఆసక్తికరంగా మారింది. హిందూ మహిళలు నుదుటన పెట్టుకునే కుంకుమను సిందూర్​ అంటారు. పహల్గామ్​ ఉగ్రదాడిలో మతం గురించి అడిగి మరీ పురుషులను ఉగ్రవాదులు చంపేశారు. వారి భార్యలను విడిచిపెట్టారు. నాటి ఉగ్రదాడిలో సర్వం కోల్పోయిన మహిళలను ఉద్దేశించి ఈ ఆపరేషన్​కి 'సిందూర్​' అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది.

"బహవల్​పూర్​, మురీడ్కేలోని లష్కే తోయిబా, జైషే మహమ్మద్​ హెడ్​క్వార్టర్స్​ని టార్గెట్​ చేశారు. మిసైల్​ దాడులు జరిగాయి," అని ఓ అధికారి వివరించారు. ఈ ఆపరేషన్​ కోసం స్టాండాఫ్​ క్రూయిజ్​ మిసైళ్లను ఉపయోగించినట్టు తెలిపారు.

ఆపరేషన్​ సిందూర్​లో భారత సైన్యంతో పాటు నేవీ, వాయు సేనకు చెందిన ఆయుధ వ్యవస్థలు పాల్గొన్నాయి. టార్గెట్ల కోసం ఎదురుచూసి, ఎదురుచూసి దాడులు చేసే సూసైడ్​ డ్రోన్స్​ (లాయిటరీ మునిషన్స్​)ని కూడా ఈ ఆపరేషన్​లో వినియోగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.