ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్పై గెలిచిన టీమిండియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆపరేషన్ సిందూర్ని గుర్తు చేస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు.
“క్రీడా మైదానంలో ఆపరేషన్ సిందూర్. ఫలితం మాత్రం ఒక్కటే- భారత్ గెలుపు,” అని మోదీ ట్వీట్ చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత ప్రభుత్వం మే నెలలో ఆపరేషన్ సిందూర్ని చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ సహా పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసి, వాటిని ధ్వంసం చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ఈ తరుణంలో జరుగుతున్న ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్లను బహిష్కరించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ మ్యాచ్లు యథాతథంగా కొనసాగాయి. టోర్నీలో పాకిస్థాన్తో భారత్ మూడు మ్యాచ్లు ఆడింది. లీగ్ దశ, సూపర్ 4 దశ, ఫైనల్. మూడింటిలోనూ విజయం సాధించింది.
మరోవైపు ఆసియా కప్ ఫైనల్ ఉత్కంఠభరితంగా సాగింది. 147 టార్గెట్తో బరిలో దిగిన టీమిండియా మొదటి 20 పరుగుల్లోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ తిలక్ వర్మా, సంజూ శాంసన్లు జట్టును గట్టెక్కించారు. చివరి ఓవరలో 10 పరుగులు అవసరం ఉండగా, తిలక్ వర్మా 6, రింకు సింగ్ బౌండరీతో టీమిండియాను గెలిపించారు.
అనంతరం టీమిండియా ప్లేయర్లను అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
అయితే, ఆసియా కప్ని గెలిచినప్పటికీ టీమిండియా సభ్యులు ట్రోఫీని తీసుకోలేదు! ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్థాన్ మంత్రి అయిన మోసిన్ నఖ్వి నుంచి కప్ని తీసుకోబోమని టీమిండియా తెల్చిచెప్పడం ఇందుకు కారణం అని తెలుస్తోంది.
గెలిచిన జట్టుకు ట్రోఫీ అందకపోవడం క్రికెట్ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి!
సంబంధిత కథనం
టాపిక్