Operation sindoor : పాక్​లో భారత్​ దాడులతో హై టెన్షన్​! అనేక విమానాశ్రయాలు మూసివేత..-operation sindoor after indias strikes on pakistan several airports closed see list ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Operation Sindoor : పాక్​లో భారత్​ దాడులతో హై టెన్షన్​! అనేక విమానాశ్రయాలు మూసివేత..

Operation sindoor : పాక్​లో భారత్​ దాడులతో హై టెన్షన్​! అనేక విమానాశ్రయాలు మూసివేత..

Sharath Chitturi HT Telugu

పాకిస్థాన్​, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ దాడుల తరువాత, స్పైస్ జెట్ సహా ఇతర విమానయాన సంస్థలు అనేక విమానాశ్రయాలకు ఫ్లైట్​ అడ్వైజరీని జారీ చేశాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అనేక విమానాశ్రయాలు మూతపడ్డాయి.

మూతపడిన విమానాశ్రయాలు (Reuters)

పహల్గామ్​ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్​ ‘సిందూర్​’ చేపట్టిన భారత సైన్యం.. పాకిస్థాన్​తో పాటు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఫలితంగా సరిహద్దు వెంబడి ఇప్పటికే ఉన్న ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరాయి. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ కాల్పులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో స్పైస్ జెట్ సహా ఇతర విమానయాన సంస్థలు భారతదేశ ఉత్తర భాగంలోని అనేక విమానాశ్రయాలకు సంబంధింంచి అడ్వైజరీలను జారీ చేశాయి. విమానాల రాకపోకలపై ప్రభావం పడుతుందని, ప్రయాణానికి ముందు అప్డేట్స్ చూసుకోవాలని ప్రయాణికులను ఎయిరిండియా, ఇండిగో కోరాయి.

ఎక్స్​లో ఉన్న అప్డేట్స్​ ప్రకారం.. ధర్మశాల, లేహ్, జమ్ము శ్రీనగర్, అమృత్​సర్​లోని విమానాశ్రయాలను తదుపరి నోటీసు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు విమానయాన సంస్థలు పేర్కొన్నాయి.

ఆపరేషన్​ సిందూర్​ నేపథ్యంలో రాజ్​కోట్, భుజ్, జామ్​నగర్​లో మే 7న మధ్యాహ్నం 12 గంటల వరకు విమానాల రాకపోకలపై ప్రభావం పడుతుందని ఎయిరిండియా ట్వీట్ చేసింది.

“ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, జమ్ము, శ్రీనగర్, లేహ్, జోధ్​పూర్​, అమృత్​సర్​, భుజ్, జామ్​నగర్, చండీగఢ్, రాజ్​కోట్​ స్టేషన్లకు మే 7 మధ్యాహ్నం 12 గంటల వరకు ఎయిరిండియా తన అన్ని విమానాలను రద్దు చేసింది. అమృత్​సర్ వెళ్లే రెండు అంతర్జాతీయ విమానాలను దిల్లీకి దారి మళ్లిస్తున్నాము. ఊహించని ఈ అంతరాయం వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం,” అని ఎయిరిండియా ట్వీట్ చేసింది.

మరోవైపు ఇండిగో ఎయిర్​లైన్స్ కూడా ఫ్లైట్ అడ్వైజరీని జారీ చేసింది. “శ్రీనగర్, జమ్మూ, అమృత్​సర్​, లేహ్, ఛండీగఢ్, ధర్మశాల నుంచి రాకపోకలు సాగించే విమానాలపై ప్రభావం పడనుంది. అంతేకాకుండా, ప్రస్తుత గగనతల ఆంక్షల కారణంగా బికనీర్కు వచ్చే విమానాలపై కూడా ప్రభావం పడనుంది,” అని పేర్కొంది.

“ప్రస్తుత గగనతల ఆంక్షల వల్ల #Bikaner నుంచి వచ్చే విమానాలపై కూడా ప్రభావం పడుతోంది. విమానాశ్రయానికి చేరుకునే ముందు మీ ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని కోరుతున్నాం,” అని తాజా అప్డేట్స్​లో పేర్కొన్నారు.

మూతపడిన విమానాశ్రయాల జాబితా..

ధర్మశాల (డీహెచ్ఎం)

లేహ్ (ఐఎక్స్ఎల్)

జమ్మూ (ఐఎక్స్​జే)

శ్రీనగర్ (ఎస్ఎక్స్ఆర్)

అమృత్​సర్​ (ఏటీక్యూ)

ఛండీగఢ్

రాజ్​కోట్

భుజ్

జామ్​నగర్

బికనీర్​

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.