పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ ‘సిందూర్’ చేపట్టిన భారత సైన్యం.. పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఫలితంగా సరిహద్దు వెంబడి ఇప్పటికే ఉన్న ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరాయి. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో స్పైస్ జెట్ సహా ఇతర విమానయాన సంస్థలు భారతదేశ ఉత్తర భాగంలోని అనేక విమానాశ్రయాలకు సంబంధింంచి అడ్వైజరీలను జారీ చేశాయి. విమానాల రాకపోకలపై ప్రభావం పడుతుందని, ప్రయాణానికి ముందు అప్డేట్స్ చూసుకోవాలని ప్రయాణికులను ఎయిరిండియా, ఇండిగో కోరాయి.
ఎక్స్లో ఉన్న అప్డేట్స్ ప్రకారం.. ధర్మశాల, లేహ్, జమ్ము శ్రీనగర్, అమృత్సర్లోని విమానాశ్రయాలను తదుపరి నోటీసు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు విమానయాన సంస్థలు పేర్కొన్నాయి.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాజ్కోట్, భుజ్, జామ్నగర్లో మే 7న మధ్యాహ్నం 12 గంటల వరకు విమానాల రాకపోకలపై ప్రభావం పడుతుందని ఎయిరిండియా ట్వీట్ చేసింది.
“ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, జమ్ము, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ స్టేషన్లకు మే 7 మధ్యాహ్నం 12 గంటల వరకు ఎయిరిండియా తన అన్ని విమానాలను రద్దు చేసింది. అమృత్సర్ వెళ్లే రెండు అంతర్జాతీయ విమానాలను దిల్లీకి దారి మళ్లిస్తున్నాము. ఊహించని ఈ అంతరాయం వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం,” అని ఎయిరిండియా ట్వీట్ చేసింది.
మరోవైపు ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ఫ్లైట్ అడ్వైజరీని జారీ చేసింది. “శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, ఛండీగఢ్, ధర్మశాల నుంచి రాకపోకలు సాగించే విమానాలపై ప్రభావం పడనుంది. అంతేకాకుండా, ప్రస్తుత గగనతల ఆంక్షల కారణంగా బికనీర్కు వచ్చే విమానాలపై కూడా ప్రభావం పడనుంది,” అని పేర్కొంది.
“ప్రస్తుత గగనతల ఆంక్షల వల్ల #Bikaner నుంచి వచ్చే విమానాలపై కూడా ప్రభావం పడుతోంది. విమానాశ్రయానికి చేరుకునే ముందు మీ ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని కోరుతున్నాం,” అని తాజా అప్డేట్స్లో పేర్కొన్నారు.
ధర్మశాల (డీహెచ్ఎం)
లేహ్ (ఐఎక్స్ఎల్)
జమ్మూ (ఐఎక్స్జే)
శ్రీనగర్ (ఎస్ఎక్స్ఆర్)
అమృత్సర్ (ఏటీక్యూ)
ఛండీగఢ్
రాజ్కోట్
భుజ్
జామ్నగర్
బికనీర్
సంబంధిత కథనం