Lok Sabha Speaker : ఓం బిర్లాకే లోక్సభ స్పీకర్ బాధ్యతలు! మరి పురంధేశ్వరి?
Lok Sabha Speaker : లోక్సభ స్పీకర్ పదవి.. మరోసారి ఓం బిర్లాకు దక్కడం దాదాపు ఖాయమైంది. ఫలితంగా.. పురంధేశ్వరి లోక్సభ స్పీకర్ అవుతారన్న ఊహాగానాలకు చెక్ పడింది!

Lok sabha speaker : బీజేపీ ఎంపీ, 17వ లోక్సభలో స్పీకర్గా వ్యవహరించిన ఓం బిర్లా.. ఈసారి కూడా ఆ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది! స్పీకర్ పదవి కోసం ఆయన తన నామినేషన్ని దాఖలు చేయనున్నట్టు, ఈ మేరకు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసినట్టు సమాచారం. ఒక వేళ ఇదే నిజమైతే.. వరుసగా రెండోసారి స్పీకర్ బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తి అవుతారు ఓం బిర్లా.
నిర్ణయం తీసుకున్న బీజేపీ..!
2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి స్పీకర్ పోస్ట్పై తీవ్ర ఉత్కంఠ కనిపించింది. ఎన్డీఏలో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూలు స్పీకర్ పోస్ట్ కోసం ప్రయత్నిస్టున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సైతం.. లోక్సభ స్పీకర్ రేసులో ఉన్నట్టు ఊహాగానాలు జోరుగా సాగాయి. మోదీ కేబినెట్లో ఆమెకు ఎలాంటి మంత్రి పదవి దక్కకపోవడంతో.. స్పీకర్ పోస్ట్ అందుకోవడం ఖాయమని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ ఇవన్నీ రూమర్స్గానే మిగిలిపోయాయి. కీలకమైన స్పీకర్ పదవిని తిరిగి ఓం బిర్లాకే అప్పగించాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
సంబంధిత వర్గాల ప్రకారం.. ఓం బిర్లాను లోక్సభ స్పీకర్ చేసే విషయంపై.. రక్షణమంత్రి రాజ్నాథ్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజులు.. అన్ని పార్టీలను సంప్రదించారు. ఈ విషయంపై సోమవారం అర్థరాత్రి వరకు ఇండియా కూటమితో రాజ్నాథ్ సింగ్ చర్చలు జరిపారు. కూటమి మద్దతు పొందేందుకు ప్రయత్నించారు.
Om Birla Lok sabha speaker : అయితే.. అధికార పక్షం తమ స్పీకర్ అభ్యర్థి నిలబెట్టేంతవరకు వేచి చూడాలని ఇండియా కూటమి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. డిప్యూటీ స్పీకర్ని ఎంపిక చేసే అవకాశం తమకు ఇవ్వాలని కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి డిమాండ్ చేసినట్టు సమాచారం.
18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం అవ్వగా.. నిన్న, ఇవాళ ఎంపీల ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. కాగా.. మంగళవారం మధ్యాహ్నం నాటికి.. పార్టీలు, తమ స్పీకర్ అభ్యర్థి గురించి ప్రోటెం-స్పీకర్కు చెప్పాల్సి ఉంటుంది. బుధవారం.. స్పీకర్ని ఎన్నుకోనున్నారు.
ఓం బిర్లా.. రాజస్థాన్ కోటాకు ఎంపీగా ఉన్నారు. ఇక కాంగ్రెస్కు చెందిన బలరామ్ ఝాఖర్.. 1980 నుంచి 1989 వరకు వరుసగా రెండుసార్లు లోక్సభ స్పీకర్గా పనిచేశారు. అంతేకాదు.. లోక్సభ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి.. తిరిగి ఎంపీగా ఎన్నికవ్వడం 22ఏళ్లలో ఇదే తొలిసారి! 2022లో జీఎంసీ బాలయోగి.. స్పీకర్గా ఉండగానే మరణించారు. మోహర్ జోషీ, మీరా కుమార్లు ఎన్నికల్లో ఓడిపోయారు. సమిత్రా మహాజన్, సోమ్నాథ్ ఛాటర్జీలు రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు.
లోక్సభ స్పీకర్ పోస్ట్కి ఎందుకంత డిమాండ్?
స్పీకర్ను ఎన్నుకునే నియమాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 93లో పొందుపరిచారు. కొత్త లోక్సభ మొదటిసారి సమావేశం కావడానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అయ్యింది. అంటే ప్రస్తుత సందర్భంలో జూన్ 24.
లోక్సభ స్పీకర్ను సాధారణ మెజారిటీతో ఎన్నుకుంటారు. అంటే సభలో ఉన్న సభ్యుల్లో సగానికి పైగా ఎంపీలు లోక్సభ స్పీకర్ కావడానికి సంబంధిత అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం