Man kills wife : కట్నంగా ఫార్చ్యునర్ ఇవ్వలేదని.. భార్యను చంపిన భర్త!
Man kills wife for dowry : కట్నంగా ఫార్చ్యునర్ ఇవ్వలేదని.. భార్యను ఓ వ్యక్తి, అతని కుటుంబసభ్యులు చంపేశారు. గ్రేటర్ నోయిడాలో జరిగింది ఈ దారుణ ఘటన.
Man kills wife in Greater Noida : గ్రేటర్ నోయిడాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరకట్నం వేధింపులతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కట్నం కింద ఫార్చ్యునర్తో పాటు రూ. 21లక్షల క్యాష్ ఇవ్వలేదన్న కారణంతో.. మహిళ భర్త, అతని కుటుంబసభ్యులు ఆమెను చిత్రహింసలు పెట్టి చంపేశారు!
ఇదీ జరిగింది..
గ్రేటర్ నోయిడాలోని ఖాడా చౌగన్పూర్ అనే గ్రామంలో నివాసముండే వికాస్ అనే వ్యక్తికి.. 2022 డిసెంబర్లో కరిష్మ అనే మహిళతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలోనే.. వికాస్ కుటుంబానికి రూ. 11లక్షల క్యాష్తో పాటు ఒక ఎస్యూవీని కట్నం కింద ఇచ్చింది కరిష్మ కుటుంబం.
కానీ పెళ్లి తర్వాత కూడా కట్నం గురించి కరిష్మను వేధించడం మొదలుపెట్టాడు వికాస్. అతని కుటుంబం కూడా కరిష్మను వేధించింది. కరిష్మ సోదరుడు దీపక్ ప్రకారం.. వికాస్ కుటుంబం అనేకమార్లు కరిష్మను భౌతికంగా, మానసికంగా హింసించింది.
కొన్ని నెలల క్రితం.. వికాస్-కరిష్మలకు ఆడ బిడ్డ పుట్టింది. ఇక కట్నం వేధింపులు మరింత పెరిగాయి. ఈ వ్యవహారం స్థానిక పంచాయతీ పెద్దల దృష్టికి కూడా వెళ్లింది. రెండు కుటుంబాలు కలిసి, విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా.. తమ కుటుంబం.. వికాస్ ఫ్యామిలీకి మరో రూ. 10లక్షలు ఇచ్చిందని దీపక్ చెప్పాడు. అప్పటికీ వరకట్న వేధింపులు ఆగలేదని అన్నాడు.
Man kills wife for Fortuner : కాగా.. కట్నం వేధింపులు ఇటీవలే నెక్ట్స్ లెవల్కి వెళ్లాయి. వికాస్ కుటుంబం.. ఒక ఫార్చ్యునర్తో పాటు రూ. 21లక్షల కట్నం డిమాండ్ చేయడం మొదలుపెట్టింది.
ఈ క్రమంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. వికాస్తో పాటు అతని కుటుంబసభ్యులు, తనని కొడుతున్నట్టు, పుట్టింటి వారికి ఫోన్ చేసి చెప్పింది కరిష్మ. ఆమె కుటుంబసభ్యులు కరిష్మ దగ్గరికి పరుగులు తీశారు. నేల మీద విఘత జీవిగా పడి ఉన్న కరిష్మను చూశారు. ఆమె మరణించిందని తెలుసుకుని విలపించారు.
వికాస్, అతని తల్లిదండ్రులే.. వరకట్నం కోసం తమ బిడ్డను కొట్టి చంపేశారని కరిష్మ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Man kills wife : వికాస్, అతని తండ్రి సోంపాల్ భాటి, తల్లి రాకేశ్, సోదరి రింకి, సోదరులు సునీల్- అనిల్లపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వికాస్తో పాటు అతని తండ్రిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారు పారిపోయారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినిట్టు, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, వారిని శిక్షించి, మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత కథనం