Traffic violations : ఈ రాష్ట్రంలో.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా- నో 'ఫైన్స్'!
Gujarat traffic violations : రాష్ట్ర ప్రజలు ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించినా జరిమానాలు విధించమని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. దీపావళి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
Gujarat traffic rules violation : గుజరాత్ ప్రభుత్వం.. తన రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్లు ఇస్తోంది. ప్రతి ఇంటికి.. ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని ప్రకటించింది ప్రభుత్వం.. తాజాగా మరో వార్త చెప్పింది. ఈ నెల 21 నుంచి 27 వరకు.. రాష్ట్రంలో ఎవరు ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించినా జరిమానాలు విధించబోమని స్పష్టం చేసింది. దీపావళి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు.. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు
సూరత్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో హర్ష్ సంఘవి ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"దీపావళి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాము. 21 నుంచి 27 వరకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా ఫైన్లు వేయబోము. అలా అని మీరు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిచాలి అని కాదు. మీరు తప్పు చేసినా జరిమానాలు వేయము. దాని బదులు.. మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, పోలీసులు మీకు పువ్వులు ఇచ్చి చెబుతారు," అని హర్ష్ సంఘవి స్పష్టం చేశారు.
2022 గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రకటనలు చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
నెట్టింట ట్రోల్స్..
Gujarat latest news : ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించినా, జరిమానాలు విధించమని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించడంపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇదొక మంచి చర్య అని, ప్రజలు వాలంటరీగా రూల్స్ పాటించే అవకాశం లభిస్తుందని కొందరు చెబుతున్నారు. కాగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వ నిర్ణయంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
'ఎన్నికలు మీ చేత ఏదైనా చేయిస్తాయి,' అని ట్వీట్ చేశారు గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని. ఓట్ల కోసం వాహనదారుల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ సింగ్ చౌదరి అభిప్రాయపడ్డారు.
"ఇదేం ప్రకటన అసలు. ఓట్ల కోసం వాహనదారుల ప్రాణాలను ఫణంగా పెడతారా? ఇలాంటి ప్రకటనలు చేయడం కోసమేనా.. ఎన్నికల సంఘం ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ను విడుదల చేయలేదు?" అని జయంత్ సింగ్ ప్రశ్నించారు.
ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చట్టాలను ఎవరు పట్టించుకోరని కొందరు, యాక్సిడెంట్లు పెరుగుతాయని మరికొందరు అంటున్నారు.
గుజరాత్ ఎన్నికలు..
Gujarat Assembly elections 2022 : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. కాగా.. కొన్ని రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. అదే సమయంలో గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తుందని అందరు భావించారు. కానీ ఆ షెడ్యూల్ను ఈసీ ప్రకటించలేదు. ఫలితంగా ఈసీ చర్యలపై విపక్షాలు నిరసన తెలిపాయి. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ప్రజలను ఆకట్టుకనే విధంగా బీజేపీ ప్రకటనలు చేయడం కోసమే ఎన్నికల షెడ్యూల్ను ఈసీ వాయిదా వేసిందని విమర్శలు వచ్చాయి.
సంబంధిత కథనం