Crime | నాలుగున్నరేళ్ల చిన్నారిపై తొమ్మిదేళ్ల బాలుడు లైంగిక దాడి..
మహారాష్ట్ర: తొమ్మిదేళ్ల బాలుడు.. నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఠాణెలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.
మహారాష్ట్ర ఠాణెలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తొమ్మిదేళ్ల బాలుడు.. నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు!
ట్రెండింగ్ వార్తలు
ఎవరు లేని చోటకు తీసుకెళ్లి..
ఉల్హస్నగర్ పట్టణంలో ఈ నెల 3న జరిగింది ఈ ఘటన. చిన్నారిని ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు ఆ బాలుడు. అక్కడే ఆమెను లైంగికంగా వేధించినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల తర్వాత.. నొప్పులు రావడంతో ఆ చిన్నారి.. తన తల్లిదండ్రులకు అసలు విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కానీ ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు.
టిఫిన్లో ఉప్పు ఎక్కువైందని…
మహారాష్ట్రలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఠాణెలో నేరాల సంఖ్య అధికంగా ఉంది. టిఫిన్లో ఉప్పు ఎక్కువైందని చెప్పి.. 40ఏళ్ల భార్యను కడతేర్చాడు ఓ కిరాతక భర్త.
ఠాణెలోని భయందర్ టౌన్షిప్లో శుక్రవారం ఉదయం జరిగింది ఈ ఘటన. ఎప్పటిలాగే.. భర్తకు టిఫిన్ పెట్టింది ఆ మహిళ. అది తిన్న వెంటనే అతడికి ఎక్కడలేనంత కోపం వచ్చేసింది.
"నిందితుడి పేరు నిలేష్ గాఘ్(46). శుక్రవారం ఉదయం టిఫిన్ చేశాడు. సుమారు 9:30 గంటల సమయంలో భార్య గొంతు నులిమి చంపేశాడు. భార్య చేసిన కిచిడిలో ఉప్పు ఎక్కువైందనేది కారణం," అని అధికారులు వెల్లడించారు. ఓ పొడవాటి గుడ్డ సాయంతో అతను సొంత భార్య గొంతు నులిమి హత్య చేశాడని వివరించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి పరుగులు తీశారు. మహిళ మృతదేహాన్ని ఫోరెన్సిక్ టెస్టుల కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
సంబంధిత కథనం
టాపిక్