New Parliament building : నూతన పార్లమెంట్​ భవనంలో కార్యకలాపాలు షురూ..!-new building of parliament notified as parliament house of india ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  New Building Of Parliament Notified As Parliament House Of India

New Parliament building : నూతన పార్లమెంట్​ భవనంలో కార్యకలాపాలు షురూ..!

Sharath Chitturi HT Telugu
Sep 19, 2023 01:21 PM IST

New Parliament building : నూతన పార్లమెంట్​ భవనంలో కార్యకలాపాలు మొదలయ్యాయి. ఎంపీల ఫొటో సెషన్​ జరిగింది.

నూతన పార్లమెంట్​ భవనం వద్ద ఎంపీల ఫొటో సెషన్​..
నూతన పార్లమెంట్​ భవనం వద్ద ఎంపీల ఫొటో సెషన్​.. (PTI)

New Parliament building : దేశ చరిత్రలో మరో కీలక పరిణామం! నూతన పార్లమెంట్​ భవనంలో మంగళవారం ఉదయం కార్యకలాపాలు మొదలయ్యాయి. పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు ఇక ఇక్కడే జరగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఫొటో సెషన్​తో మొదలు..

పార్లమెంట్​ స్పెషల్​ సెషన్​ సోమవారం ఉదయం పాత భవనంలో ప్రారంభమైంది. పాత పార్లమెంట్​ భవనంతో తనకు ఉన్న బంధాన్ని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక మంగళవారం ఉదయం.. లోక్​సభ సెక్రటేరియట్​ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇకపై కార్యకలాపాలన్నీ నూతన పార్లమెంట్​ భవనంలోనే జరుగుతాయని ఆ ప్రకటన స్పష్టం చేసింది.

Parliament special session : మరోవైపు మంగళవారం ఉదయం 10గంటల ప్రాంతంలో నూతన పార్లమెంట్​ భవనం వద్దకు వెళ్లారు ప్రధాని మోదీ. అనంతరం జరిగిన ఫొటో సెషన్​లో ఎంపీలందరితో కలిసి ఫొటో దిగారు.

అయితే.. ఈ ఫొటో సెషన్​ మధ్యలో బీజేపీ ఎంపీ నర్హరి అమిన్​ స్పృహ తప్పి పడిపోయారు. అక్కడ ఉన్నా వారు ఆయనకు మంచి నీరు అందించారు. కొద్దిసేపటి తర్వాత.. ఆయన తిరిగి లేచి, ఫొటో సెషన్​లో పాల్గొన్నారు.

ఫొటో సెషన్​ అనంతరం పాత పార్లమెంట్ భవనంలోని​ సెంట్రల్​ హాల్​లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇందులో మోదీతో పాటు అనేక మంది ఎంపీలు పాల్గొన్నారు. దేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు మోదీ.

అనంతరం పార్లమెంట్​ పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మోదీతో పాటు ఎంపీలందరు కలిసి నడిచి వెళ్లారు. అయితే.. మోదీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని పార్లమెంట్​లోకి ప్రవేశిస్తారని తొలుత సమాచారం వచ్చింది. అయితే.. లీడర్​ ఆఫ్​ అపోజీషన్​, కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత అధీర్​ రంజన్​ చౌదరి.. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని నూతన భవనంలోకి వెళ్లారు. రాహుల్​ గాంధీతో పాటు కాంగ్రెస్​ ఎంపీలు అధీర్​ వెనుక నడిచారు.

లోక్​సభ ముందుకు కీలక బిల్లు..!

Women's reservation bill : మహిళా రిజర్వేషన్​ బిల్లుకు కేంద్ర కేబిన్​ సోమవారం రాత్రి ఆమోద ముద్ర వేసింది. ఇది దేశవ్యాప్తంగా హాట్​ టాపిక్​గా మారింది. ఈ నేపథ్యంలో.. ఈ బిల్లు మంగళవారం లోక్​సభ ముందుకు వస్తుందని తెలుస్తోంది. ఈ అంశంపై బుధవారం సభలో చర్చ జరగొచ్చు. ఈ నెల 21 రాజ్యసభలో ఈ విషయంపై చర్చ ఉంటుందని తెలుస్తోంది.

కొత్త డ్రెస్​ కోడ్​..

ఇక పార్లమెంట్​లో పని చేసే సిబ్బందికి కొత్త డ్రెస్​ కోడ్​ వచ్చింది. మార్షల్స్​, సెక్యూరిటీ స్టాఫ్​, అధికారులు, ఛాంబర్​ అటెండెంట్స్​లు కొత్త రంగు దుస్తుల్లోనే పనులు చేయడం మొదలుపెట్టారు.

సంబంధిత కథనం

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.