Teen gives birth to baby : 15ఏళ్లకే తల్లి అయిన మైనర్​.. ఆన్​లైన్​లో వీడియోలు చూసి సొంతంగా డెలివరీ!-nagpur teen gives birth after watching online youtube videos kills baby ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Nagpur Teen Gives Birth After Watching Online Youtube Videos, Kills Baby

Teen gives birth to baby : 15ఏళ్లకే తల్లి అయిన మైనర్​.. ఆన్​లైన్​లో వీడియోలు చూసి సొంతంగా డెలివరీ!

Sharath Chitturi HT Telugu
Mar 06, 2023 07:30 AM IST

Nagpur teen gives birth to baby : ఓ బాలిక 15ఏళ్లకే తల్లి అయ్యింది. ఆ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. చివరికి.. యూట్యూబ్​లో వీడియోలు చూసి సొంతంగా డెలివరీ చేసుకుంది. ఆ వెంటనే.. ఆ పసికందును చంపేసింది. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్​పూర్​లో కలకలం సృష్టించింది.

15ఏళ్లకే తల్లి అయిన మైనర్​.. ఆన్​లైన్​లో వీడియోలు చూసి డెలివరీ!
15ఏళ్లకే తల్లి అయిన మైనర్​.. ఆన్​లైన్​లో వీడియోలు చూసి డెలివరీ!

Nagpur teen gives birth to baby : మహారాష్ట్రలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. 15ఏళ్లకే తల్లి అయిన ఓ బాలిక.. ఆన్​లైన్​లో వీడియోలు చూసి ఇంట్లోనే సొంతంగా డెలివరీ చేసుకుంది. చివరికి.. భూమి మీదకు అడుగుపెట్టిన కొన్ని క్షణాల్లోనే ఆ పసికందును చంపేసింది!

ట్రెండింగ్ వార్తలు

ఆన్​లైన్​లో వీడియోలు చూసి..

మహరాష్ట్ర నాగ్​పూర్​లోని అంబాజారీ ప్రాంతంలో నివాసముంటున్న ఓ 15ఏళ్ల బాలికకు.. కొంత కాలం క్రితం సోషల్​ మీడియాలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. కాగా అతను ఆమెను లైంగికంగా వేధించాడు. ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం ఆ బాలిక ఎప్పుడూ ఇంట్లో చెప్పలేదు. బిడ్డ పెరిగే కొద్ది, బాలిక శరీరంలో మార్పులు రావడం మొదలయ్యాయి. తనకు ఓంట్లో బాలేదని ఆ బాలిక, తన తల్లికి చెబుతూ వచ్చింది.

Maharashtra crime news : ఈ విషయాన్ని మరింత రహస్యంగా ఉంచేందుకు.. ఆ బాలిక సొంతంగా డెలివరీ చేసుకోవడం ఎలాగో నేర్చుకుంది! యూట్యూబ్​తో పాటు ఆన్​లైన్​లో అనేక వీడియోలు చూసింది. చివరికి మార్చ్​ 2న.. తన ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. కాగా పుట్టిన వెంటనే ఆ పసికందు గొంతు నులిమి చంపేసింది ఆ బాలిక. మృతదేహాన్ని ఓ బాక్స్​లో పెట్టి.. సమయం చూసుకుని బయట పడేద్దామని భావించింది.

ఇలా బయటపడింది..

డెలివరీ కారణంగా బాలిక ఆరోగ్యం దెబ్బతింది. అదే సమయానికి ఆమె తల్లి కూడా ఇంటికి చేరుకుంది. ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించింది. నొప్పి, బాధను ఇక భరించలేకపోయిన ఆ మైనర్​.. చివరికి జరిగినది అంతా చెప్పింది. ఒక్కసారిగా ఆ తల్లి షాక్​కు గురైంది. బాలికను, బిడ్డను ఆసుపత్రికి తరలించింది. పసికందు అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

Nagpur latest news : ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లారు. పసికందు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తిపై పోలీసులు పోక్స్​ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత.. మైనర్​పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసే యోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

IPL_Entry_Point