పిల్లల్ని కనేందుకు మస్క్​ కొత్త తరహా 'రిక్రూట్​మెంట్​'- ఎక్స్​లో మహిళలతో ఫ్లర్టింగ్​! ఆ తర్వాత..-musk recruits women on x to build legion of children says report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పిల్లల్ని కనేందుకు మస్క్​ కొత్త తరహా 'రిక్రూట్​మెంట్​'- ఎక్స్​లో మహిళలతో ఫ్లర్టింగ్​! ఆ తర్వాత..

పిల్లల్ని కనేందుకు మస్క్​ కొత్త తరహా 'రిక్రూట్​మెంట్​'- ఎక్స్​లో మహిళలతో ఫ్లర్టింగ్​! ఆ తర్వాత..

Sharath Chitturi HT Telugu

పిల్లల్ని కనేందుకు ఎలాన్​ మస్క్​ ఎంత దూరం వెళతారో తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఎక్స్​ని ఉపయోగించుకుని మస్క్​ తొలుత మహిళలను సంప్రదిస్తారని, ఆ తర్వాత వారితో పిల్లలు కంటారని నివేదిక వెల్లడించింది.

ఎలాన్​ మస్క్​.. (AFP)

ఎంత వీలైతే అంత మంది పిల్లల్ని కని, ప్రపంచ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా పెట్టుకున్న ఎలాన్​ మస్క్​.. దాన్ని సరికొత్త పంథాలో అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది! పిల్లల్ని కనేందుకు కావాల్సిన మహిళలను ఎక్స్​ వేదికగా ఆయన 'రిక్రూట్​' చేసుకుంటున్నట్టు వాల్​స్ట్రీట్​ జర్నల్​ ఒక నివేదికను తాజాగా బయటపెట్టింది. అసలు ఏం జరిగిందంటే..

ఎక్స్​ వేదికగా మహిళలతో మస్క్​ ఫ్లర్టింగ్​..

ప్రజలు పిల్లల్ని కనాలని ప్రోత్సహించే వారిలో అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​ ముందు వరుసలో ఉంటారు. 'ప్రపంచానికి జననాల రేటు పతనానికి మించిన దారుణం ఏం ఉండదు. ప్రజలు పిల్లల్ని కనకపోతే ఇక అంతే!' అని మస్క్​ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

అయితే పిల్లల్ని కనేందుకు మస్క్​ ఎంత దూరం వెళతారు అనేది వాల్​స్ట్రీట్​ జర్నల్​ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా కుప్పకూలడాన్ని అడ్డుకునేందుకు మస్క్​ తన సొంత 'ఎక్స్'​ని వాడుకుంటున్నారు. ఎక్స్​ ద్వారా మస్క్​ ఇప్పటికే అనేక మంది మహిళలను ప్రైవేట్​గా సంప్రదించారు. తొలుత ఫ్లర్ట్​ చేస్తారు. ఆ తర్వాత సంభాషనలను పెంచుతారు. చివరికి.. "నా పిల్లలకు తల్లి అవుతావా?" అని మహిళలను డైరక్ట్​గా అడుగుతారు.

నివేదిక ప్రకారం ఇన్​ఫ్లుయెంజర్​ ఆష్లే సెంట్​ క్లెయిర్​ని మస్క్​ ఈ విధంగానే సంప్రదించారు. తొలుత ఆమె పోస్టులను లైక్​ చేశారు. ప్రైవేట్​గా కామెంట్లు చేశారు. వారిద్దరి మధ్య కనెక్షన్​ పెరిగింది. ఆమె ఎక్స్​ ఆఫీస్​కి కూడా వెళ్లింది. మస్క్​తో రిలేషన్​లో కూడా ఉంది. 2023లో మస్క్​తో రోములస్​ అనే బిడ్డకు జన్మనిచ్చింది.

ఇలా మహిళలను ఫ్లర్ట్​ చేసి, వారితో పిల్లలు కనడంపై ఎలాన్​ మస్క్​ చాలా సీరియస్​గా ఉన్నారు. మహిళలను డీల్​ చేసేందుకు, పిల్లలు పుట్టాక వారికి సాయం చేసేందుకు ఏకంగా ఒక లీగల్​ టీమ్​నే మస్క్​ నడుపుతున్నారని నివేదిక పేర్కొంది. పిల్లలు పుట్టిన తర్వాత ఈ టీమ్​ సదరు మహిళను సంప్రదిస్తుంది. నాన్​ డిస్​క్లోజర్​ అగ్రిమెంట్​ భాగంగా వెంటనే 15 మిలియన్లను ఆఫర్​ చేస్తుంది. ఈ పూర్తి వ్యవహారంపై మౌనంగా ఉండేందుకు, బిడ్డ 21ఏళ్లు వచ్చేంత వరకు నెలకు 1,00,000 డాలర్లు మహిళలకు ఇస్తారు.

అయితే ఆష్లే ఈ ఒప్పందానికి ఒప్పుకోలేదు. "నా బిడ్డను రహస్యంగా పెంచడం నాకు ఇష్టం లేదు," అని ఆమె చెప్పారు.

పబ్లిక్​ తెలిసిన దాని ప్రకారం మస్క్​కి 14మంది పిల్లలు. కానీ అంతకన్నా ఎక్కువ మందే ఉంటారని నివేదిక చెబుతోంది. సరైన నెంబర్​పై మాత్రం క్లారిటీ లేదు. కానీ స్పష్టంగా ఉన్న విషయం ఏంటంటే.. ఈ పూర్తి వ్యవహారం చాలా సీక్రెట్​గా జరుగుతుండం!

మస్క్​ లీగల్​ టీమ్​లో ప్రధాన సభ్యుడి పేరు బిర్చల్​. ఆయన మస్క్​కి సన్నిహితుడు. మస్క్​ ఫ్యామిలీ ఆఫీస్​ని మేనేజ్​ చేస్తుంటాడు. ఆయన న్యూరోలింక్​ సీఈఓ, ఎక్స్​ఏఐలో మస్క్​తో పార్ట్​నర్​. అయితే వీటన్నింటి కన్నా.. మస్క్​ పిల్లల్ని కనే విషయంపై ఆయన ఎక్కువ సాయం చేస్తారని నివేదిక చెబుతోంది. మస్క్​ సంప్రదించిన మహిళలతో మాట్లాడటం, వారితో అగ్రిమెంట్​ సెటిల్​ చేయడం ఆయన పనట.

"మస్క్​కి వ్యతిరేకంగా వెళితే కచ్చితంగా మంచి ఫలితాలు రావు," అని బిర్చర్​ చెబుతుంటారట.

నివేదిక ప్రకారం అష్లే ఒక్కరే కాదు, ఇలా మస్క్​ చాలా మందిని సంప్రదించారు. వారిలో ఒకరు టిఫనీ ఫాంగ్​. ఆమె ఒక క్రిప్టో ఇన్​ఫ్లుయెంజర్​. ఎక్స్​లో ఆమెను కలిసిన మస్క్​ లైక్స్​, ప్రైవేట్​ మెసేజ్​ల ద్వారా దగ్గరయ్యారు. ఆమెను ఒక్కసారి కూడా డైరక్ట్​గా కలవకుండానే తన పిల్లలకు తల్లి అవ్వాలని మస్క్​ కోరారు. కానీ కుటుంబ కారణాలతో ఆమె ఒప్పుకోలేదు. కానీ ఆమె ఇతరులకు ఆ చాట్స్​ని చూపించింది. ఈ విషయం తెలిసి మస్క్​ ఆమెకు దూరం జరిగారు. ఆ తర్వాత ఎక్స్​ రెవెన్యూ షేరింగ్​ ప్రోగ్రామ్​ నుంచి ఆమెను తప్పించారు. ఫలితంగా ఆమె ఆదాయం దారుణంగా పతనమైంది.

ఇదే విధంగా కలిసిన న్యూరోలింక్​ ఎగ్జిక్యూటివ్​ షివోన్​ జిలిస్​తో మస్క్​ నలుగురు పిల్లల్ని కన్నారు. తన టర్మ్స్​ అండ్​ కండీషన్లకు ఒప్పుకునే మహిళలను ఆయన బాగా చూసుకుంటారు. ఒప్పుకోకపోతే మాత్రం మహిళలు కోర్టుల చుట్టూ తిరుగుతారు.

"ఈ మొత్తం చాలా రహస్యంగా సాగుతుంది. రహస్యంగా ఉండేందుకు వెనక చాలా ప్రయత్నాలు జరుగుతాయి. ఇది ప్రైవసీ కోసం కాదు- కంట్రోల్​ కోసం జరుగుతోంది," అని సంబంధిత వర్గాలు చెప్పాయని వాల్​స్ట్రీట్​ జర్నల్​ నివేదిక వెల్లడించింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.