Vande Bharat express accident : ‘వందే భారత్’​కు మళ్లీ యాక్సిడెంట్​- ఈసారి ఎద్దు!-mumbaigandhinagar vande bharat damaged after hitting cattle nose cone damaged ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mumbai-gandhinagar Vande Bharat Damaged After Hitting Cattle, Nose Cone Damaged

Vande Bharat express accident : ‘వందే భారత్’​కు మళ్లీ యాక్సిడెంట్​- ఈసారి ఎద్దు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 29, 2022 01:19 PM IST

Vande Bharat express accident : వందే భారత్​కు మళ్లీ యాక్సిడెంట్​ అయ్యింది. ఈసారి ఓ ఎద్దు.. ట్రైన్​ను ఢీకొట్టింది.

‘వందే భారత్’​కు మళ్లీ యాక్సిడెంట్​- ఈసారి ఎద్దు!
‘వందే భారత్’​కు మళ్లీ యాక్సిడెంట్​- ఈసారి ఎద్దు! (ANI)

Vande Bharat express accident : వందే భారత్​ ఎక్స్​ప్రెస్​కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు యాక్సిడెంట్​కు గురై వార్తలకెక్కింది వందే భారత్​. తాజాగా.. మళ్లీ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. శనివారం ఉదయం ముంబై సెంట్రల్​ నుంచి గాంధీనగర్​కు వెళుతున్న వందే భారత్​ ఎక్స్​ప్రెస్​.. ఓ ఎద్దును ఢీకొట్టింది. ఫలితంగా.. ట్రైన్​ ముందు భాగం దెబ్బతింది.

ట్రెండింగ్ వార్తలు

శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గుజరాత్​లోని అతుల్​ రైల్వే స్టేషన్​కు సమీపంలో.. ఓ ఎద్దు రైల్వే ట్రాక్​పైకి దూసుకొచ్చింది. అదే సమయంలో అటుగా వెళుతున్న వందే భారత్​ ఎక్స్​ప్రెస్​.. ఆ ఎద్దును ఢీకొట్టింది. ఘటన అనంతరం ట్రైన్​ 15 నిమిషాలు నిలిచిపోయింది.

"రైలుకు ఎలాంటి నష్టం జరగలేదు. ముందు భాగం కాస్త విరిగింది. 15 నిమిషాల తర్వాత రైలు మళ్లీ బయలుదేరింది. ప్రయాణం సాఫీగానే సాగుతోంది. ఏదైనా తగిలితే ఆ తాకిడిని అబ్సార్బ్​ చేసుకునే విధంగా నోస్​ కవర్​ని రూపొందించారు. ఆ నోస్​ కవర్​ని రిప్లేస్​ చేసుకోవచ్చు," అని భారతీయ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

Vande Bharat express accident today : వందే భారత్​ ఎక్స్​ప్రెస్​కు ఈ విధంగా జరగడం ఇది మూడోసారి. అక్టోబర్​ 6న.. ముంబై నుంచి గాంధీనగర్​కు వెళుతున్న క్రమంలో.. వట్వా- మనీనగర్​ రైల్వే స్టేషన్​ వద్ద గేదెను ఢీకొట్టింది. అప్పుడు కూడా నోస్​ ప్యానెల్​ దెబ్బతింది. ఆ మరుసటి రోజు గుజరాత్​ నుంచి ముంబైకి వెళుతుండగా.. ఆనంద్​ సమీపంలో ఓ ఆవు.. వందే భారత్​ ట్రైన్​ను ఢీకొట్టింది.

ఇటీవలే.. ఆవును ఢీకొట్టి నిలిచిపోయింది ఈ వందే భారత్​ ఎక్స్​ప్రెస్​.

వందే భారత్​..

పూర్తిగా దేశీయంగా తయారు చేసిన సెమీ హైస్పీడ్​ ట్రైన్​గా గుర్తింపు పొందిన ఈ వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ను.. సెప్టెంబర్​ 30న గాంధీనగర్​లో ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ తర్వాత నుంచి ఈ రైళ్లు వాణిజ్య కార్యకలాపాలు మొదలుపెట్టాయి.

WhatsApp channel

సంబంధిత కథనం