IMD alerts : దేశవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు- ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్​-mumbai on alert today imd predicts heavy rainfall in gujarat bengal up ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Imd Alerts : దేశవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు- ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్​

IMD alerts : దేశవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు- ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్​

Sharath Chitturi HT Telugu

దేశవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్స్​ ఇచ్చింది. వాటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచనకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్​ (HT_PRINT)

భారత ఉపఖండంలో చురుకైన రుతుపవనాల కారణంగా ఈ రోజు చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆగస్టు 24 శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ముంబైని ఆరెంజ్ అలర్ట్​లో ఉంచింది. అదే సమయంలో గుజరాత్​లో రెడ్ అలర్ట్ ప్రకటించింది.

“గుజరాత్, విదర్భ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి,” అని ఐఎండీ వాతావరణ శాఖ అంచనా వేసింది.

గుజరాత్ రీజియన్​లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు (> 20 సెంటీమీటర్లు) కురిసే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్​గఢ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా, అసోం- మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం- త్రిపుర, కొంకణ్ - గోవా, మధ్య మహారాష్ట్ర, సౌరాష్ట్ర- కచ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (≥ 12 సెం.మీ) ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఝార్ఖండ్, మరాఠ్వాడా, కేరళ- మాహే, తెలంగాణ, కోస్తా- ఉత్తర- మధ్య కర్ణాటకలో భారీ వర్షాలు (≥ 7 సెం.మీ) కురుస్తాయని ఐఎండీ తన తాజా వాతావరణ బులెటిన్​లో తెలిపింది.

బంగాళాఖాతం, అరేబియా సముద్రం, గంగానది వెంబడి పశ్చిమబెంగాల్, ఒడిశా, ఉత్తరాంధ్ర తదితర తీర ప్రాంతాల్లో ఈ రోజు ఈదురుగాలులు వీస్తాయని, గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.

ముంబైలో ఆరెంజ్ అలర్ట్..

ముంబై, రాయ్​గఢ్, రత్నగిరి జిల్లాలతో సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్​లోని పాల్​గఢ్​, థానే, ముంబై, రాయ్​గఢ్, రత్నగిరి జిల్లాల్లో ఆగస్టు 24 నుంచి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

పశ్చిమ మహారాష్ట్రలోని పుణె, సతారా జిల్లాలకు, విదర్భలోని అమరావతి, భండారా, చంద్రాపూర్, గోండియా జిల్లాలకు శనివారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

24 గంటల్లో 64.5 మిల్లీమీటర్లకు మించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, జనజీవనానికి అంతరాయం కలుగుతుందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరించింది.

దిల్లీలో ఇలా..

ఈ రోజు ఆహ్లాదకరమైన దిల్లీ వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తన వాతావరణ బులెటిన్​లో అంచనా వేసింది. దేశ రాజధానిలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. దిల్లీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఐఎండీ శనివారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దిల్లీలో కనిష్ఠ, గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు నాలుగు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఐఎండీ వివరాల ప్రకారం.. ఇవాళ తెలంగాణలోని 16 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీలో చూస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో ఇవాళ(ఆగస్టు 24) చూస్తే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ మరియు నంద్యాల జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.