Air India pee gate : మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్​-mumbai man who peed on woman on air india flight arrested from bengaluru says cops ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mumbai Man Who Peed On Woman On Air India Flight Arrested From Bengaluru Says Cops

Air India pee gate : మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్​

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 07, 2023 10:43 AM IST

Air India pee gate incident : మహిళపై మూత్ర విసర్జన కేసులో నిందితుడు శంకర్​ మిశ్రాను పోలీసులు అరెస్ట్​ చేశారు. బెంగళూరులో అతడిని శుక్రవారం రాత్రి పట్టుకుని.. ఢిల్లీకి తీసుకెళ్లారు!

మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్​
మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్​ (HT_PRINT)

Air India urinating case : : దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఎయిర్​ ఇండియా 'పీ గేట్'​ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. నవంబర్​ నెలలో ఎయిర్​ ఇండియా విమానంలో ఓ మహిళపై మూత్ర విసర్జన చేసిన కారణంగా.. ముంబైవాసి శంకర్​ మిశ్రాను ఢిల్లీ పోలీసులు.. శుక్రవారం రాత్రి బెంగళూరులో పట్టుకున్నారు. సంబంధిత వర్గాల ప్రకారం.. నిందితుడిని పోలీసులు ఢిల్లీకి తీసుకెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు

మహిళపై మూత్ర విసర్జన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత.. నిందితుడు శంకర్​ మిశ్రా పరారీలో ఉన్నట్టు తెలిపిన పోలీసులు.. అతడి కోసం లుకౌట్​ నోటీసులు జారీ చేశారు. విమానాశ్రయాలను అలర్ట్​ చేశారు. కాగా.. అతడు బెంగళూరులో తలదాచుకుంటున్నట్టు శుక్రవారమే ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులను అల్టర్ట్​ చేశారు. ఓ బృందాన్ని ఈ వ్యవహారం కోసం నియమించారు.

Shankar Mishra Air India : శంకర్​ మిశ్రా.. తన ఫోన్​ను వాడటం ఆపేశాడు. అయితే.. తన సోషల్​ మీడియా ఖాతాల ద్వారా తన స్నేహితులతో ఛాట్​ చేయడం మొదలుపెట్టాడు. దీని ఆధారంగా.. అతడు ఉన్న లోకేషన్​ను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.

'నిద్రలేదు.. బ్లాక్​మెయిల్​ చేస్తున్నారు..!'

మహిళపై మూత్ర విసర్జన కేసులో నిందితుడుగా ఉన్న శంకర్​ మిశ్రా తండ్రి.. ఈ వ్యవహారంపై స్పందించారు. తన కుమారుడు రెండు రోజులు నిద్రపోలేదన్నారు. ఈ పూర్తి విషయంలో బ్లాక్​మెయిల్​ కోణం కూడా ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు.

Shankar Mishra Air India incident : "నా కుమారుడు అలసిపోయాడు. రెండు రోజులు సరిగ్గా నిద్రపోలేదు. ఎయిర్​లైన్స్​ ఇచ్చిన డ్రింక్స్​నే సేవించి, పడుకున్నాడు. నా కుమారుడు చాలా మంచివాడు. ఇలాంటి ఘటన చేసి ఉండడు. బాధితురాలు డబ్బులు అడిగింది. మేము కట్టేశాము. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. మేము తీర్చలేని విధంగా ఏదైనా డిమాండ్​ చేసి ఉండొచ్చు. అందుకు నా కుమారుడు ఒప్పుకోలేదేమో! ఆ కోపంతోనే ఆమె ఈగో దెబ్బతిని ఉంటుంది. ఇందులో బ్లాక్​మెయిల్​ కోణం కూడా ఉండొచ్చు," అని శంకర్​ మిశ్రా తండ్రి శ్యామ్​ మిశ్రా అన్నారు.

బాధితురాలికి.. శంకర్​ మిశ్రా రూ. 15వేలు చెల్లించినట్టు తెలుస్తోంది. నెల రోజుల తర్వాత ఆ డబ్బును బాధితురాలి కుమార్తె తిరిగిచ్చేసినట్టు సమాచారం.

ఇదీ జరిగింది..

Shankar Mishra Air India Wells Fargo Linkedin : 2022 నవంబర్​ 26న.. ఎయిర్​ ఇండియా విమానంలో జరిగింది ఈ ఘటన. మద్యం మత్తులో ఉన్న శంకర్​ మిశ్రా.. 72ఏళ్ల వృద్ధురాలి ముందు ప్యాంట్​ జిప్పు విప్పు మూత్ర విసర్జనం చేశాడు. ఈ ఘటనను విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. వారు సరిగ్గా స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి.

ఈ పూర్తి వ్యవహారంపై విమానాయన సంస్థతో పాటు రెగ్యులేటరీ కూడా దర్యాప్తు చేపట్టింది. మరోవైపు నిందితుడు శంకర్​ మిశ్రా.. తన ఉద్యోగాన్ని కోల్పోయాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం