Lottery scam : లాటరీ ‘స్కామ్​’తో రూ. 2.10లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి!-mumbai man conned of rs 2 10 lakh in lottery fraud ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mumbai Man Conned Of <Span Class='webrupee'>₹</span>2.10 Lakh In Lottery Fraud

Lottery scam : లాటరీ ‘స్కామ్​’తో రూ. 2.10లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 01, 2023 01:53 PM IST

Lottery scam : లాటరీ వచ్చిందంటే.. ముందు వెనక చూసుకోకుండా.. ఓ వ్యక్తి రూ. 2.10లక్షలు పోగొట్టుకున్నాడు. ముంబైలో జరిగింది ఈ ఘటన.

లాటరీ ‘స్కామ్​’తో రూ. 2.10లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి!
లాటరీ ‘స్కామ్​’తో రూ. 2.10లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి!

Lottery scam in Mumbai : 'లాటరీ స్కామ్​'కు ఓ ముంబైవాసి బలయ్యాడు! లాటరీ వచ్చిందంటూ వచ్చిన ఫోన్​ను నమ్మేసి.. రూ. 2.10లక్షలను ట్రాన్స్​ఫర్​ చేశాడు. అంతే! ఆ తర్వాతి నుంచి అటువైపు ఫోన్​ను ఎత్తడం మానేశారు. చివరికి బాధితుడు.. పోలీసులను ఆశ్రయించాడు.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

ముంబైకు చెందిన ఓ వ్యక్తి.. 2019లో ఆన్​లైన్​ స్టోర్​లో ఓ వస్తువు కొనుగోలు చేశాడు. రెండేళ్ల తర్వాత.. పశ్చిమ్​ బెంగాల్​ ఆధారిత ఆ ఆన్​లైన్​ స్టోర్​ నుంచి అంటూ ఓ లెటర్​ వచ్చింది. ఆ వ్యక్తి పేరు.. లక్కీ డ్రాకు ఎంపికైనట్టు ఆ లెటర్​లో రాసి ఉంది. ఆ లెటర్​తో పాటు ఓ స్క్రాచ్​ కార్డ్​ కూడా వచ్చింది. ఆ ముంబైవాసి.. రూ. 10.4లక్షలు విలువ చేసే కారును గిఫ్ట్​గా పొందినట్టు అందులో ఉంది.

Online scams in India : కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తికి ఓ కాల్​ వచ్చింది. 'ఆన్​లైన్​ స్టోర్​కు చెందిన సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ని మాట్లాడుతున్నా..' అంటూ ఓ వ్యక్తి, ఆ ముంబైవాసితో మాట్లాడాడు. ముంబైవాసికి వచ్చిన గిఫ్ట్​ గురించి వివరించారు. 'మీకు కారు కావాలా? లేదా ఆ నగదును మీకు ట్రాన్స్​ఫర్​ చేయాలా?' అని ఆ వ్యక్తి అడిగాడు. ఆ నగదును తన అకౌంట్​కు బదిలీ చేయాల్సిందిగా ఈ వ్యక్తితో చెప్పాడు ఈ ముంబైవాసి. ఇక్కడే అసలు కథ మొదలైంది!

నగదును బదిలీ చేయాలంటే.. ప్రాసెసింగ్​ ఫీజు, ఇతర ఛార్జీల కింద రూ. 2.10లక్షలు డిపాజిట్​ చేయాలని ఆ వ్యక్తి ఈ ముంబైవాసికి చెప్పాడు. అది నమ్మిన ముంబైవాసి.. అతను చెప్పినట్టే డబ్బులు డిపాజిట్​ చేసి.. రూ. 10.4లక్షల కోసం తన బ్యాంక్​ ఆకౌంట్​ను చూస్తూ కూర్చున్నాడు. కొన్ని రోజుల తర్వాత.. ఇంకొంత నగదును డిపాజిట్​ చేయాలని మళ్లీ ఫోన్​ వచ్చింది. అప్పుడు ఈ ముంబైవాసికి అనుమానం వచ్చింది. తాను ఇంక డబ్బులు డిపాజిట్ చేయనని, తన రూ. 2.10లక్షలను కూడా తిరిగిచ్చేయాలని డిమాండ్​ చేశారు. ఆ తర్వాతి నుంచి అటువైపు ఫోన్​ ఎత్తడం మానేశారు. చివరికి.. తాను మోసపోయినట్టు బాధితుడికి అర్థమైంది.

Mumbai crime news latest : ఈ క్రమంలోనే.. బాధితుడు పోలీసులను సంప్రదించాడు. తనకు జరిగినది వివరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు.

ఎంత చెబుతున్నా..!

ఆన్​లైన్​ మోసాలు, స్కామ్​లు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటున్నాయి. అయినప్పటికీ.. ప్రజలు అత్యాశకు పోయి ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారు. అధికారులు ఎంత హెచ్చరించినా, పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు.

WhatsApp channel

సంబంధిత కథనం