Mumbai airport : ప్రయాణికులకు అలర్ట్.. 6 గంటల పాటు ముంబై ఎయిర్పోర్ట్ మూసివేత!
Mumbai airport to remain shut : ముంబై విమానాశ్రయం.. 6 గంటల పాటు పనిచేయదు. ఎప్పుడు? ఎందుకు? అన్న వివరాల కోసం ఈ వార్తను చూడండి.
Mumbai airport to remain shut : విమాన ప్రయాణికులకు అలర్ట్.! ముంబైలోని సీఎస్ఎంఐఏ(ఛత్రపతి శివాజి మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్).. అక్టోబర్ 18న కొన్ని గంటల పాటు మూతపడనుంది. విమానాశ్రయం నిర్వహణ పనుల కోసం ఈ చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు రన్వేలను మూసివేస్తున్నట్టు ఓ ప్రకటన చేశారు ముంబై విమానాశ్రయం సిబ్బంది.
ట్రెండింగ్ వార్తలు
ముంబై ఎయిర్పోర్ట్లో రెండు రన్వేలు ఉన్నాయి(9/27- 14/32). ఇక్కడ రోజుకు 800కుపైగా విమానాల రాకపోకలు ఉంటాయి. దేశంలో ఢిల్లీ విమానాశ్రయం తర్వాత.. అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ ఇదే!
Mumbai airport closed : రెండు రన్వేలు పనిచేయవు..
"అక్టోబర్ 18న.. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రన్వేలను 14/32, 9/27 మూసివేస్తున్నాము," అని ముంబై ఎయిర్పోర్ట్ పేర్కొంది.
సాధారణంగా రుతుపవనాల సమయం ముగిసిన తర్వాత నిర్వహణ పనులు చేస్తూ ఉంటారు. ఈసారి అక్టోబర్ 18న ఈ కార్యకలాపాలు చేపట్టారు ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది. ప్రయాణికులు, విమానాల భద్రత కోసం ఇలాంటి నిర్వహణ పనులు చేయాల్సి ఉంటుంది.
ముంబై విమానాశ్రయం రన్వేల మూసివేతతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు సిబ్బంది. పలు ఫైట్లను రీషెడ్యూల్ చేశారు. ఫలితంగా మెయింటేనెన్స్కి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ విషయంలో ప్రయాణికుల నుంచి సహకారాన్ని ఆశిస్తున్నట్టు ముంబై ఎయిర్పోర్ట్ అభిప్రాయపడింది.
Mumbai airport latest news : ఈ ముంబై విమానాశ్రయంలో అదానీ గ్రూప్నకు 74శాతం వాటా ఉంది.
ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల విమానాశ్రయాల్లో ముంబై ఎయిర్పోర్ట్ ఒకటి. 2022 సెప్టెంబర్ 17న.. 1,30,374మంది ప్రయాణికులు ఈ ముంబై విమానాశ్రయాన్ని వినియోగించుకున్నారు. ఇదొక రికార్డు.
Mumbai airport news in telugu : "95,080మంది ప్రయాణికులు టర్మినల్ 2 ద్వారా ప్రయాణాలు చేశారు. 35,294 మంది.. టర్మినల్ 1 నుంచి ప్రయాణించారు. ఆ ఒక్క రోజులో 839 విమానాలు ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాయి," అని విమానాశ్రయ సిబ్బంది స్పష్టం చేశారు.
ఇక పండుగ సీజన్ సమీపిస్తుండటంతో.. ముంబై విమానాశ్రయంలో రద్దీ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
సంబంధిత కథనం