ప్రియుడితో ఉన్నప్పుడు భార్యను పట్టుకున్న భర్త.. బెల్టుతో కొట్టి- ఊరంతా..!-mp tribal woman thrashed by villagers over suspected affair paraded after being made to carry husband on shoulders ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ప్రియుడితో ఉన్నప్పుడు భార్యను పట్టుకున్న భర్త.. బెల్టుతో కొట్టి- ఊరంతా..!

ప్రియుడితో ఉన్నప్పుడు భార్యను పట్టుకున్న భర్త.. బెల్టుతో కొట్టి- ఊరంతా..!

Sharath Chitturi HT Telugu
Jul 04, 2022 09:30 PM IST

ఓ గిరిజన మహిళను తన గ్రామానికి చెందిన ప్రజలు చిత్రహింసలకు గురిచేసిన ఘటన మధ్యప్రదేశ్​లో చోటుచేసుకుంది. ఆమెను బెల్టుతో కొట్టి, చెప్పులతో తయారు చేసిన దండను మెడలో వేశారు.

<p>ప్రియుడితో ఉన్నప్పుడు భార్యను పట్టుకున్న భర్త..&nbsp;</p>
ప్రియుడితో ఉన్నప్పుడు భార్యను పట్టుకున్న భర్త.. (HT Telugu)

మధ్యప్రదేశ్​లో మానవజాతి సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. ఓ 32ఏళ్ల గిరిజన మహిళను.. ప్రజలు చిత్రహింసలకు గురిచేశారు. బట్టలు చింపేసి, ఊరంతా ఊరేగించారు. ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో వారిద్దరిని హింసించారు. దాడి చేసిన వారిలో ఆ మహిళ భర్త కూడా ఉన్నాడు.

yearly horoscope entry point

దేవాస్​ జిల్లా బోర్పదావ్​ గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఓ గిరిజన మహిళ, తన భర్త- ముగ్గురు పిల్లలతో ఆ గ్రామంలో నివాసముంటోంది. కాగా.. అదే గ్రామంలోని ఓ 26ఏళ్ల వ్యక్తితో ఆ మహిళకు అఫైర్​ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

శనివారం రాత్రి నుంచి తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ భర్త. కాగా.. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చి.. తన అనుచరులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టాడు ఆ భర్త. ఈ క్రమంలోనే ఆ 26ఏళ్ల వ్యక్తి ఇంట్లో ఆమెను చూశాడు.

కోపంతో ఊగిపోయిన ఆ భర్త.. ఆ ఇద్దరికి నరకం చూపించాడు. అతనికి గ్రామస్థులు కూడా తోడయ్యారు. అందరు కలిసి ఆ ఇద్దరిని చిత్రహింసలు పెట్టారు. ఆ మహిళ బట్టలు చింపేశారు. బెల్టుతో కొట్టారు. కాళ్లతో కొట్టారు. భర్త కూడా దాడి చేశాడు.

ఇంకొందరు.. చెప్పులతో కూడిన దండను ఆ మహిళ మెడలో వేశారు. అక్కడితో ఆగకుండా.. భర్తను ఆమె భుజాల మీద ఎక్కించి, ఆ మహిళను ఊరంతా ఊరేగించారు. ఈ దాడిని స్థానికులు తమ కెమెరాల్లో చిత్రీకరించారు. పక్కనే ఉన్న పిల్లలు కూడా వీడియోలు తీశారు. ఘటనను నవ్వుతూ వీక్షించారు.

ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న స్థానిక కానిస్టేబుల్​.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. ఊరి జనం నుంచి ఆ మహిళను, ఆ 26ఏళ్ల వ్యక్తిని రక్షించారు. పోలీసు వాహనం ఎక్కించి గ్రామం బయటకు తీసుకెళ్లిపోయారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇప్పటివరకు 12మందిని అరెస్ట్​ చేశారు. వారిలో ఆ మహిళ భర్త కూడా ఉన్నాడు.

కాగా.. ఆ మహిళను, ఆమె భర్త చిత్రహింసలు పెట్టేవాడని.. ఆ బాధను చెప్పుకునేందుకే తన వద్దకు వచ్చిందని ఆ 26ఏళ్ల వ్యక్తి పోలీసులకు చెప్పాడు.

తాజా ఘటనపై మధ్యప్రదేశ్​లో రాజకీయ దుమారం రేగింది. అధికార బీజేపీపై కాంగ్రెస్​ మండిపడింది. 'పేదలకు, గిరిజనలకు అండగా ఉంటామని ప్రభుత్వం చెబుతోంది. కానీ బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయి,' అని విరుచుకుపడింది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.