MP Elections 2023: మధ్య ప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఒక్క పార్టీ తమ మేనిఫెస్టో (Congress manifesto) లను ప్రకటిస్తున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెబుతూ పలు ఎన్నికల హామీలను తమ మేనిఫెస్టోలో పొందుపర్చింది. 230 స్థానాల మధ్య ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి.
సీనియర్ నేత కమల్ నాథ్ నాయకత్వంలో మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోరాటంలో దిగుతోంది. రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు ఢిల్లీ నుంచి సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే.. తదితరులు ప్రచారంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం పార్టీ మేనిఫెస్టో (Congress manifesto) ను విడుదల చేశారు.
మొత్తం 106 పేజీల మేనిఫెస్టోలో రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మొత్తం 59 ఎన్నికల హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందులో ముఖ్యమైన హామీలు..
టాపిక్