Mizoram: భారీ వర్షాలకు స్టోన్ క్వారీ కుప్పకూలి 14 మంది దుర్మరణం-mizoram 14 killed as stone quarry collapses due to heavy rainfall ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mizoram: భారీ వర్షాలకు స్టోన్ క్వారీ కుప్పకూలి 14 మంది దుర్మరణం

Mizoram: భారీ వర్షాలకు స్టోన్ క్వారీ కుప్పకూలి 14 మంది దుర్మరణం

HT Telugu Desk HT Telugu
May 28, 2024 03:07 PM IST

Mizoram: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో భారీ వర్షాలకు ఒక రాతి క్వారీ కూలిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మిజోరం రాజధాని ఐజ్వాల్ పట్టణానికి దక్షిణ శివార్లలోని మెల్థమ్, హ్లిమెన్ మధ్య ప్రాంతంలో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

మిజోరంలో స్టోన్ క్వారీ కూలి, 14 మంది చనిపోయిన ప్రదేశం
మిజోరంలో స్టోన్ క్వారీ కూలి, 14 మంది చనిపోయిన ప్రదేశం

Mizoram: రెమల్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు మిజోరం రాజధాని ఐజ్వాల్ కు సమీపంలో ఉన్న మెల్థమ్ ప్రాంతంలో స్టోన్ క్వారీ కూలి 14 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఒక చిన్నారితో సహా కొందరిని రక్షించామని, అయితే భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయని అధికారులు తెలిపారు.

yearly horoscope entry point

స్టోన్ క్వారీలో ప్రమాదం

ఐజ్వాల్ జిల్లాలోని మెల్థమ్, హ్లిమెన్ సరిహద్దులో ఉన్న రాతి క్వారీ కూలిపోవడంతో పలువురు కార్మికులు దాని కింద చిక్కుకుపోయారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), అస్సాం రైఫిల్స్, స్థానిక పోలీసు సిబ్బంది రంగంలోకి దిగడంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టామని మిజోరం డీజీపీ అనిల్ శుక్లా తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు.

రెమల్ తుపాను కారణంగా..

రెమల్ తుపాను కారణంగా మే 27న ప్రారంభమైన భారీ వర్షాలు మే 28న తీవ్రరూపం దాల్చడంతో మిజోరం సహా ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. మిజోరాం ముఖ్యమంత్రి లాల్దుహోమ్ మంగళవారం ఉదయం హోం మంత్రి కె సప్దంగాన్ జోఖావ్తార్, అన్ని శాఖల అధిపతులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. తాము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, రెమల్ తుపాను (Cyclone Remal) వల్ల సంభవించిన మరణాలు, నష్టాన్ని అంచనా వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని లాల్దుహోమా తెలిపారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 14 మంది చనిపోయారని, మరికొందరు గల్లంతయ్యారని తెలిపారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.