మిస్​ వరల్డ్​ : బికినీ ప్రమోషన్​ కోసం మొదలైన ఈవెంట్​- ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద బ్యూటీ కాంటెస్ట్​!-miss world 2025 hyderabad interesting facts about the beauty pageant you never knew ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  మిస్​ వరల్డ్​ : బికినీ ప్రమోషన్​ కోసం మొదలైన ఈవెంట్​- ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద బ్యూటీ కాంటెస్ట్​!

మిస్​ వరల్డ్​ : బికినీ ప్రమోషన్​ కోసం మొదలైన ఈవెంట్​- ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద బ్యూటీ కాంటెస్ట్​!

Sharath Chitturi HT Telugu

మిస్​ వరల్డ్​ 2025 హైదరాబాద్​లో ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యూటీ ఈవెంట్​గా గుర్తింపు తెచ్చుకున్న ఈ మిస్​ వరల్డ్​ని.. బికినీల ప్రమోషన్​ కోసం ప్రారంభించారని మీకు తెలుసా? పూర్తి వివరాల్లోకి వెళితే..

మిస్​ వరల్డ్​ కిరీటంతో ఐశ్వర్య రాయ్​

హైదరాబాద్​లో 72వ మిస్​ వరల్డ్​ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాగ్యనగరలో మిస్​ వరల్డ్​ పోటీలు జరగడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో మిస్​ వరల్డ్​ ఈవెంట్​పై అందరిలో ఆసక్తి పెరిగింది. అయితే, ఈ బ్యూటీ కాంటెస్ట్​ ఎప్పుడు, ఎక్కడ మొదలైందో మీకు తెలుసా? దీనిని ఎవరు ప్రారంభిచారో తెలుసా? వీటితో పాటు మిస్​ వరల్డ్​కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో మిస్​ వరల్డ్​ పోటీలు- ఇవి మీకు తెలుసా?

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందగత్తెలు, వారి వ్యక్తిత్వాలు- విలువలు, దేశాల సాంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తున్న మిస్​ వరల్డ్​ని ఒకప్పుడు 'బికినీ'ల ప్రమోషన్​ కోసం ప్రారంభించారని మీకు తెలుసా? 1951లో ఎరిక్​ మోర్లే అనే వ్యక్తి యూకేలో బికినీ కాంటెస్ట్​ నిర్వహించారు. ఫెస్టివల్​ ఆఫ్​ బ్రిటన్​ సెలబ్రేషన్స్​లో భాగంగా జరిగిన ఈ ఈవెంట్​కి ఫెస్టివల్​ బికినీ కాంటెస్ట్​ అని పేరు పెట్టారు.

బికినీ అనేది ప్రజలకు అప్పుడప్పుడే పరిచయం అవుతున్న కాలం ఇది. బికినీలను ప్రమోట్​ చేసేందుకు ఈ ఈవెంట్​ని నిర్వహించారు. 1951లో స్విడెన్​కి చెందిన కెర్స్​టిన్​ కికి హకాన్సన్​ ఈ టైటిల్​ గెలిచారు. బికినీలోనే ఆమె కిరీటాన్ని ధరించారు.

ఈ బికినీ ఈవెంట్​ మొదటి ఎడిషన్​ గ్రాండ్​ సక్సెస్​ అయ్యింది. దీనిని మీడియా మిస్​ వరల్డ్​ అని పిలవడం మొదలుపెట్టింది. ఇది మోర్లేకి కూడా బాగా నచ్చింది. వార్షికంగా మిస్​ వరల్డ్​ పోటీలు నిర్వహించాలని బావించి ఈ టైటిల్​ని ట్రేడ్​మార్క్​ చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ పేరుతోనే ఈ బ్యూటీ కాంటెస్ట్​ జరుగుతోంది.

అయితే బికినీలో ఈవెంట్​కి చాలా చోట్ల వ్యతిరేకత ఎదురైంది. అప్పటి పోప్​ నుంచి అనేక మతపరమైన దేశాల వరకు ఈ ఈవెంట్​ని ఖండించాయి. ఫలితంగా బికినీ ఈవెంట్​ని తొలగించి మరింత మెరుగైన స్విమ్​వేర్​తో పోటీలు నిర్వహించారు. 1976 వరకు వివిధ స్విమ్​సూట్స్​లో ఈ పోటీలు జరిగేవి. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నట్టు గౌన్లు వచ్చాయి.

1959 నుంచి ఈ మిస్​ వరల్డ్​ పోటీలను బీబీసీ టెలికాస్ట్​ చేయడం మొదలుపెట్టింది. ఇది బంపర్​ హిట్​ కొట్టింది. మిస్​ వరల్డ్​ పోటీని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్​గా మిస్​ వరల్డ్​ కాంటెస్ట్​ ఎదిగింది. 180కి పైగా దేశాల్లో 2 బిలియన్​కి పైగా మంది ప్రజలు ఈ వార్షిక ఈవెంట్​ని చూస్తారు.

2000లో ఎరిక్​ మోర్లే మరణం తర్వాత ఆయన భార్య జూలియా మిస్​ వరల్డ్​ ఆర్గనైషేన్​కి ఛైర్మ్​ అయ్యి, అప్పటి నుంచి ఈ ఈవెంట్​ని నిర్వహిస్తున్నారు.

ఈ ఈవెంట్​ కేవలం అందం గురించి మాత్రమే కాదు అని తెలియజేసేందుకు 'బ్యూటీ విత్​ ఎ పర్పస్​' అన్న నినాదంతో మిస్​ వరల్డ్​ రీ-బ్రాండ్​ అయ్యింది.

అత్యధిక మిస్​ వరల్డ్​ కిరీటాలు దక్కించుకున్న దేశాల్లో భారత్​ ఒకటి. ఇండియాకి ఆరు సార్లు ఈ టైటిల్​ దక్కింది. వెనుజువెలాకి సైతం ఆరు టైటిల్స్​ ఉన్నాయి. యూకే 4సార్లు పోటీలో విజయం సాధించింది. అమెరికాకు 3 మిస్​ వరల్డ్​ టైటిల్స్​ ఉన్నాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.