హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాగ్యనగరలో మిస్ వరల్డ్ పోటీలు జరగడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ ఈవెంట్పై అందరిలో ఆసక్తి పెరిగింది. అయితే, ఈ బ్యూటీ కాంటెస్ట్ ఎప్పుడు, ఎక్కడ మొదలైందో మీకు తెలుసా? దీనిని ఎవరు ప్రారంభిచారో తెలుసా? వీటితో పాటు మిస్ వరల్డ్కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందగత్తెలు, వారి వ్యక్తిత్వాలు- విలువలు, దేశాల సాంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తున్న మిస్ వరల్డ్ని ఒకప్పుడు 'బికినీ'ల ప్రమోషన్ కోసం ప్రారంభించారని మీకు తెలుసా? 1951లో ఎరిక్ మోర్లే అనే వ్యక్తి యూకేలో బికినీ కాంటెస్ట్ నిర్వహించారు. ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ సెలబ్రేషన్స్లో భాగంగా జరిగిన ఈ ఈవెంట్కి ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్ అని పేరు పెట్టారు.
బికినీ అనేది ప్రజలకు అప్పుడప్పుడే పరిచయం అవుతున్న కాలం ఇది. బికినీలను ప్రమోట్ చేసేందుకు ఈ ఈవెంట్ని నిర్వహించారు. 1951లో స్విడెన్కి చెందిన కెర్స్టిన్ కికి హకాన్సన్ ఈ టైటిల్ గెలిచారు. బికినీలోనే ఆమె కిరీటాన్ని ధరించారు.
ఈ బికినీ ఈవెంట్ మొదటి ఎడిషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దీనిని మీడియా మిస్ వరల్డ్ అని పిలవడం మొదలుపెట్టింది. ఇది మోర్లేకి కూడా బాగా నచ్చింది. వార్షికంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాలని బావించి ఈ టైటిల్ని ట్రేడ్మార్క్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ పేరుతోనే ఈ బ్యూటీ కాంటెస్ట్ జరుగుతోంది.
అయితే బికినీలో ఈవెంట్కి చాలా చోట్ల వ్యతిరేకత ఎదురైంది. అప్పటి పోప్ నుంచి అనేక మతపరమైన దేశాల వరకు ఈ ఈవెంట్ని ఖండించాయి. ఫలితంగా బికినీ ఈవెంట్ని తొలగించి మరింత మెరుగైన స్విమ్వేర్తో పోటీలు నిర్వహించారు. 1976 వరకు వివిధ స్విమ్సూట్స్లో ఈ పోటీలు జరిగేవి. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నట్టు గౌన్లు వచ్చాయి.
1959 నుంచి ఈ మిస్ వరల్డ్ పోటీలను బీబీసీ టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇది బంపర్ హిట్ కొట్టింది. మిస్ వరల్డ్ పోటీని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్గా మిస్ వరల్డ్ కాంటెస్ట్ ఎదిగింది. 180కి పైగా దేశాల్లో 2 బిలియన్కి పైగా మంది ప్రజలు ఈ వార్షిక ఈవెంట్ని చూస్తారు.
2000లో ఎరిక్ మోర్లే మరణం తర్వాత ఆయన భార్య జూలియా మిస్ వరల్డ్ ఆర్గనైషేన్కి ఛైర్మ్ అయ్యి, అప్పటి నుంచి ఈ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు.
ఈ ఈవెంట్ కేవలం అందం గురించి మాత్రమే కాదు అని తెలియజేసేందుకు 'బ్యూటీ విత్ ఎ పర్పస్' అన్న నినాదంతో మిస్ వరల్డ్ రీ-బ్రాండ్ అయ్యింది.
అత్యధిక మిస్ వరల్డ్ కిరీటాలు దక్కించుకున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇండియాకి ఆరు సార్లు ఈ టైటిల్ దక్కింది. వెనుజువెలాకి సైతం ఆరు టైటిల్స్ ఉన్నాయి. యూకే 4సార్లు పోటీలో విజయం సాధించింది. అమెరికాకు 3 మిస్ వరల్డ్ టైటిల్స్ ఉన్నాయి.
సంబంధిత కథనం